Total Pageviews

Saturday, August 3, 2013

శ్రీ సాయి నీళ్లతో దీపాలను వెలిగించుట :


గోదావరీ నిదీ పరీవాహక ప్రాంతమైన అహమద్ నగర్ జిల్లాలో ఒక కుగ్రామమైన శిరిడీలో ఒక పాడుబడ్ద మశీదులో స్థిర నివాసమేర్పరుచుకున్న శ్రీ సాయిబాబా నిత్యం తన మశిదులో రాత్రిళ్ళు దీపాలను వెలిగించే వారు. దీపాలని వెలిగించేందుకు అవసరమయిన నూనెను ఆ ఊరులోని షాహుకార్ల వద్ద నుండి యాచించి తెచ్చేవారు.మానవుని హృదయంలో జన్మాంతరాలుగా పేరుకొనిపోయి వున్న అజ్ఞానపు చీకట్లను పటాపంచలు చేసి, వారికి సన్మార్గం చూపేందుకే ఈ దీపాలను వెలిగిస్తున్నానని శ్రీ సాయి తన భక్తులతో తరచుగా చెప్పేవారు. ఆ గ్రామంలో బాలా భాటే అనే ఒక ఆసామికి శ్రీ సాయి యొక్క పద్ధతులు నచ్చేవి కావు, శ్రీ సాయి ఒక పిచ్చి ఫకీరని, చిన్నపాటి క్షుద్ర విద్యలను నేర్చుకొని ప్రజలను మోసం చేస్తున్నాడని భాటే ఆ ఊరి ప్రజలకు చేప్పేవాడు. పైగా మహ్మదీయుడైన సాయి మశీదులో హిందువుల ఆచార పద్ధతిలో దీపాలను వెలిగించడం హిందువుల మత విశ్వాసాలను మంటగలపడమేనని అందరినీ రెచ్చగొట్టసాగాడు. భాటే మాటలను నమ్మినా ఆ ఊరి వర్తకులు ఒకసారి కూడబలుక్కొని శ్రీ సాయికి నూనెను ఇవ్వరాదని నిశ్చయించుకున్నారు.ఆ సాయంత్రం సాయి నూనె కోసం యాచనకు వెళ్ళినప్పుడు వర్తకులందారూ మెము నూనెను ఇవ్వమని ఖచ్చితంగా చెప్పేసారు. శ్రీ సాయి ఇంకెమి బదులివ్వక, 'అల్లా అచ్చా కరెగా" అని వారిని ఆశీర్వదించి ఖాలీ చేతులతో మశీదుకు తిరిగి వెళిపోయారు. ఆ రాత్రి ఆ పిచ్చి ఫకీరు ఇక దీపాలను ఎలా వెలిగిస్తాడో చూద్దామని భాటేతొ కలిసి వర్తకులందరూ మశిదుకు వెళ్ళి దూరంగా దాక్కోని జరిగే తతంగాన్నంతటినీ వేడుకగా చూడసాగారు. రాత్రి అయ్యాక, శ్రీ సాయి కొద్దిపాటి నూనె చుక్కలున్న ఆ తంబిరేలు డబ్బాలో నీళ్ళను పోసి, ఆ నీటినంతటినీ తాగేసి తిరిగి ఆ డబ్బాలోకి వొంపేసారు. ఈ విధంగా నూనె చుక్కలతో కలిసిన ఆ నీళ్లను తన నోటితో పావనం చేసాక ఆ నీటిని ప్రమిదలలో పోసి వెలిగించగా ఆశ్చర్యాలలో కెల్లా ఆశ్చర్యంగా ప్రమిదలన్నీ మరింత ఎక్కువ కాంతితో తెల్లవార్లూ అద్భుతంగా వెలిగాయి.ఈ వింతను చూసిన ఆ వర్తకుల అజ్ఞానం నశించింది.శ్రీ సాయి సామాన్యుడు కాదని, ఒక గొప్ప యోగియని వారికి అప్పుడు అవగతం అయ్యింది. శ్రీ సాయి సాక్షాత్ భగవత్స్వరూపుడు కాకపోతే తన శక్తితో నీళ్ళను నూనెగా మార్చివెయగలుగుతారా ?సాధారణ యోగులకు ఇది సాధ్యమా ?పశ్చాతాపంతో వర్తకులందారూ శ్రీ సాయి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. దయామయుడైన సాయి ఆ వర్తకులను క్షమించి అప్పుడు ఒక అపూర్వమైన బోధ చేసారు" నాయనలారా ! అసత్యమంటే ఆ భగవంతునికి గిట్టదు.ఎల్లఫ్ఫుడూ సత్యాన్నే అంటి పెట్టుకొని వుంటే అది మనల్ని తప్పక రక్షిస్తుంది.ఇతరులను బాధ పెట్టి వేడుక చూడాలని ఎన్నడూ ప్రయత్నించవద్దు.ఇతరులకు పంచి ఇచ్చిన ఐశ్వర్యం వంద రెట్లు అయ్యి తిరిగి వచ్చినట్లే ఇతరులను మనము పెట్టి బాధలు వెయ్యింతలై మన వద్దకే తిరిగి వస్తాయి. ఎన్నడూ చెప్పుడు మాటలను విన్నవద్దు.అవి మనల్ని అధోగతి పాలు చేస్తాయి, మనకు ఏం కావాలన్నా, ఏం తెలుసుకోవాలన్నా ఆ భవవంతుడినే అడిగి తెలుసుకోవాలి"


పరిశుద్ధ పరబ్రహ్మ అవతారమైన శ్రీ సాయినాధుని అమృత పలుకులను మనసారా వంటపట్టించుకున్న ఆ వర్తకులందరూ సాయి ఆశీర్వాదములను తీసుకొని సంతోషంగా తమ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.

0 comments:

Post a Comment