Total Pageviews

Saturday, May 31, 2014

బాబా పట్ల అచంచల మైన విశ్వాసం, ప్రేమతో కూడిన సహనం.

ఏదైనా సమస్యలు వచ్చినపుడు భక్తులు సహజంగా బాబా వారు నాకే ఇన్ని కష్టాలు పెట్టారు ఎందుకు? నేను చేసిన తప్పు ఏమిటి అని బాధ పడుతుంటారు. బాబా గారు తనకు ఇష్టమైన భక్తులను నిరంతరం పరీక్ష చేస్తూ ఉంటారు. అలవి కాని సమస్యలు ఇచ్చి వారి యొక్క గుండె నిబ్బరం ఎలా ఉందొ పరీక్షిస్తూ ఉంటారు. ఆ సమస్యలను అధిగమించే గుండె ధైర్యాన్ని కూడా ఆయనే మనకు ఇస్తారు. ఎంతకాలం పరీక్షిస్తారు అని మనం ఒక్కోసారి ఆయనను నిందిస్తూ ఉంటాము కూడా. కానీ అయన అది పట్టించుకోరు. పిల్లలు నిందిస్తే తల్లి బాధపడుతుందా ఎక్కడైనా? అలాగే బాబా వారు కూడా. అయన పరీక్ష కొన్ని రోజులు కావచ్చు, వారాలు, నెలలు, ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు కూడా కావచ్చు. ఈ పరీక్షల ద్వారా మనకు అయన మిద ద్రుఢమైన విశ్వాసం కలుగుతుంది. తద్వారా బాబా మన వెంటనే ఉన్నారు అనే ధైర్యం కలుగుతుంది. అయన పట్ల అచంచలమైన విశ్వాసం భక్తులకు కలగటానికే బాబా ఎప్పుడూ ఆలోచిస్తారు. ఒకసారి అయన పట్ల మనకు విశ్వాసం కలిగితే ఇంక మన చేయి అయన వదలరు. ఇంక అక్కడి నుండి మన జీవితం లో చెప్పలేని మార్పులు వస్తాయి. ప్రతి అడుగు లోను విజయం మనలను వరిస్తుంది. బాబా ఎప్పుడూ చెప్పినట్టు అయన మన నుంచి కోరేది అచంచల మైన విశ్వాసం, ప్రేమతో కూడిన సహనం.
జై సాయి రామ్.

భక్త మహల్సాపతి సేకరణ

 
(మహాల్సాపతి గృహము)
 జనారధనరావు గారి బ్లాగునుండి సంగ్రహింపబడినవి.  వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.

(మొట్టమొదటగా బాబా షిరిడీలోకి అడుగుపెట్టినపుడు ఆయనను "సాయి" అని పిలిచినది మహల్సాపతి.  ఆతరువాతనుంచి బాబాకు సాయి అన్న పేరు స్థిరపడింది.  1886వ.సంవత్సరంలో బాబా ఆయన ఒడిలో పడుకొని తమ ప్రాణాన్ని బ్రహ్మండంలో లీనం చేసి సమాధిలోకి వెళ్ళారు.  మరుసటిరోజు షిరిడీ గ్రామ ప్రజలందరూ వచ్చి చలనం, ఉచ్చ్వాశ నిశ్వాసాలు లేని బాబా శరీరం చూసి ఆయన మరణించారని భావించారు.  మహల్సాపతి చెప్పినదానికి వ్యతిరేకించి, లాంచనాలన్నీ పూర్తిచేసి బాబా శరీరాన్ని సమాధి చేయవసిందేనని అన్నారు.  కాని మహల్సాపతి ఒక్క అంగుళం కూడా కదలక "మూడురోజులు వేచి చూసినందువల్ల నష్టమేమీ లేదనీ, బాబా మూడు రోజులలో మరల తిరిగి వస్తారని చెప్పారు. బాబా మాటలు సత్యమని నమ్మకంగా చెప్పాడు.)
బాబా షిరిడీ గ్రామంలోనికి అడుగు పెట్టగానే మహల్సాపతి ఆయనను "ఆవో సాయి" అని ఎదురేగి ఆహ్వానించాడు. 

 తర్వాత బాబా "సాయిబాబా" గా ప్రసిధ్ధి చెందారు.  తన స్నేహితులయిన కాశీరాం షింపీ, అప్పా జాగ్లే లను మహల్సాపతి బాబాకు పరిచయం చేశాడు.  వారిద్దరూ కూడా ఎంతో ఉదార స్వభావులు, భక్తి భావం కలిగినటువంటి వారు.  సాధువులు, సన్యాసులు అంటే వారికెంతో గౌరవం. అటువంటి వ్యక్తులు గ్రామంలోకి ఎవరు వచ్చినా వారెంతో గౌరవభావంతో స్వాగతం పలికేవారు. ఆవిధంగానే బాబాను కూడా గ్రామంలోనికి ఆరాధనా భావంతో స్వాగతం పలికారు.
ఆయన పేరు మహల్సాపతి చిమనాజీ నగారే.  ఎప్పుడు జన్మించారో ఆవివరాలు తెలియవు.  కాని, చనిపోయేనాటికి ఆయన వయస్సు 85 సంవత్సరాలు.  ఆయన వృత్తిరీత్యా కంసాలి.  తండ్రితాతలనుంచి అందరూ కూడా షిరిడీలోనే నివాసమేర్పరచుకొన్నారు.
వారి కులదేవత ఖండేరాజ్ (ఖండోబా).  పూనా జిల్లా జెజూరీ గ్రామంలోని దేవాలయం  ఖండేరాయ్ (ఖండోబాకి) అంకిత భక్తుడు.  సంవత్సరంలో ఒకసారయినా జిజూరీ యాత్రకి వెడుతూండేవాడు.  
                 స్వభావ సిధ్ధంగా ఆయనకు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేదు.  తన వృత్తిద్వారా లభించిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించేవారు.  ఇక సాయిబాబాను మస్ఫూర్తిగా నమ్మిన తరువాత నుంచీ ఆయనకు ప్రాపంచిక సుఖాలమీద పూర్తిగా ఆశ నశించింది.
శ్రీ బీ.వీ.నరసిం హ స్వామీజీగారు మహల్సాపతిని సాయి పూజ, సాయి ప్రచారానికి ఒక మార్గదర్శకుడని, ఆద్యుడని ప్రకటించారు.  మహల్సాపతికి నలుగురు కుమార్తెలు.  వారు జానకీబాయి, సీతాబాయి, రఖుమా బాయి, విఠాబాయి.  వారికి వరుసగా అసక్ గావు, దొఖాలె, దొర్వాలే, సీ , గ్రామాలనుంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగాయి.  మహల్సాపతికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.  కాని అతను చిన్న వయసులోనే 1880 సంవత్సరంలో మరణించాడు.  ఈకారణంగానే మహల్సాపతికి ప్రాపంచిక విషయాలమీద అయిష్టత ఏర్పడింది. 
బాబాకు మహల్సాపతి మీద ప్రీతి.  అందువల్ల అతనిని యింటికి వెళ్ళిపొమ్మని, మరలా రెండవ కుమారుని కోసం ప్రయత్నించమనీ అనేకసార్లు బాబా సలహా యిచ్చారు.  ఆయనకు ప్రాపంచిక విషయాలమీద ఆసక్తి లేకపోవడం వల్ల బాబా చెప్పిన మాటలను ఆయన పాటించలేదు.  నిజానికి ఆయనకు మరొక కొడుకుని కందామనే కోరిక లేదు.  ఒక రోజున కృష్ణాష్టమినాడు కాశీరాం షింపీ బాబా ఆజ్ఞ ప్రకారం మహల్సాపతిని బలవంతంగా ఆయన యింటికి తీసుకొని వెళ్ళి యింటిలోపల వుంచి బయట తాళం పెట్టేసాడు.  ఈ విధంగా మహల్సాపతి పూర్తిగా ఒక సంవత్సరం యింటిలోనే ఉండిపోయాడు.  బాబా అనుగ్రహంతో 1897 లో ఆయనకు కుమారుడు జన్మించాడు.  బాబా సూచించిన ప్రకారం కొడుకుకి 'మార్తాండ్' అని నామకరణం చేశారు.  మార్తాడ్ తన కొడుకులను కూతుళ్ళను పెంచి పెద్ద చేసి, 1986 లో మరణించాడు. 
బాబా మహల్సాపతిని 'సొనర్దా' అని తరువాత 'భట్' అని పిలిచేవారు.  అనగా సన్నిహిత శిష్యుడు అని అర్ధం.  బాబా మసీదులో నివసించడానికి ప్రవేశించినప్పటినుండి, మహల్సాపతి, తాత్యాపాటిల్ యిద్దరూ ఆయనతో కలిసి నిదురించేవారు.  చావడి సిధ్ధమయిన తరువాత బాబా ఒకరోజు మసీదు మరొక రోజు చావడిలోను నిదురించేవారు.  మసీదులో బాబాతో కలసి నిదురించే అదృష్టం వీరిద్దరికే దక్కింది.  బావా మానవాతీత శక్తులను, ప్రేమను స్వయంగా చూసి అనుభవించిన మహల్సాపతి తరువాతనుంచి ప్రాపంచిక విషయాలను పూర్తిగా వదలి ఆయనకు అంకితమయిపోయారు.  మహల్సాపతి సంప్రదాయంగా వస్తున్న తన వృత్తిని వదలి సన్యాసిలా కుటుంబంతో కూడా ఎక్కువ కాలం గడిపేవారు కారు.   భోజనానికి మాత్రమే యింటికి వెళ్ళేవారు.  ఇతర సమయాలలో ఆయన బాబాకు సేవ చేస్తూ ఉండిపోయేవారు.  రాత్రులందు బాబాతో మసీదులో నిద్రపోయేవారు.   


ఆరోజు 1886వ.సంవత్సరం డిశెంబరు నెల.  సూర్యాస్తమానమయి 4 గంటలయింది.  బాబా విపరీతమయిన ఆస్థమాతో బాధ పడుతున్నారు.  అయన మహల్సాపతితో తాను తాత్కాలికంగా సమాధి స్థితిలోనికి వెడుతున్నానని  చెప్పారు. తన శరీరంలో ప్రాణం ఉండదనీ, మూడు రోజులు విశ్రాంతిగా ఉంటాననీ చెప్పారు.  మూడు రోజుల తరువాత తిరిగి తన శరీరంలోకి ప్రాణం వస్తుందనీ అప్పటివరకు కదలకుండా తన శరీరాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని చెప్పారు.  ఒకవేళ అలా కాక తన ప్రాణం తిరిగి రాకపోయినట్లయితే ఒక స్థలాన్ని చూపించి ఆ ప్రదేశంలో తన శరీరాన్ని సమాధి చేసి ఆసమాధి మీద గుర్తుగా రెండు జండాలను పాతమని చెప్పారు. 
     
మహల్సాపతికి అంతా వివరించి బాబా ఆయన ఒడిలో పడుకొన్నారు.   మరునాడు షిరిడీ గ్రామ ప్రజలందరూ నిర్జీవంగా ఉచ్చ్వాశ నిశ్వాసలు లేని బాబా శరీరాన్ని చూసి ఆయన మరణించారని భావించారు.  జరగవలసిన లాంచనాలన్నీ నిర్ణయించి మహల్సాపతి చెప్పినదానికి ఏమీ అంగీకరించక బాబా శరీరాన్ని సమాధి చేయవలసిందేనని తీర్మానించారు.  మహల్సాపతి ఒక్క అంగుళం కూడా కదలలేదు.  బాబ చెప్పిన ప్రకారం మూడు రోజులపాటు వేచి చూసినందువల్ల కలిగే నష్టమేమీ లేదని మహల్సాపతి అక్కడున్నవారితో చెప్పారు.  బాబా చెప్పిన మాట ప్రకారం మూడు రోజుల తరువాత తప్పకుండా బాబా తిరిగి వస్తారని ఘంటాపధంగా చెప్పారు.  మూడు రోజుల పాటు కృతనిశ్చయంతో నిద్రాహారాలు మని మహల్సాపతి బాబా శరీరాన్ని తన ఒడిలో ఉంచుకొన్నారు.  72గంటలు గడిచిపోయాయి.  సూర్యోదయానికి 3గంటల ముందుగా అనగా తెల్లవారుఝాము 3 గంటలకు బాబా శరీరంలో చైతన్యం కలిగింది.  శ్వాస నిశ్వాసలు ఆడసాగాయి.  బాబా మహల్సాపతి ఒడిలోనించి లేచారు.  మహల్సాపపతికి ఆనంద పారవశ్యంతో కళ్ళంబట నీరు కారింది.
బాబాకు తొలిసారిగా పూజ మహల్సాపతి చేశారు.  అనేక సందర్భాలలో మహల్సాపతి బాబాతో కలిసి మసీదులో ఏకాంతంగా అనేక రాత్రులు గడిపాడు.  అర్ధరాత్రివరకూ వారిద్దరూ సంభాషించుకొనేవారు.  బాబాకు మహల్సాపతికి మధ్యనున్న సంబంధం చాలా వింతగాను ఆసక్తికరంగాను ఉండేది.  ఈ కారణం చేతనే వారిద్దరిమధ్య అద్భుతమయిన చర్చలు ఏకాంతంగా జరిగేవని తెలుస్తుంది.  చిలుం పీలుస్తూ అందులోని ఆనందాన్ని అనుభవిస్తూ సాగే వారి చర్చలు చాలా ఆసక్తిదాయకంగా జరుగుతూ ఉండేవి. 
ప్రతిరోజూ సాయంత్రం దీపాలు వెలిగించిన తరువాత ఎవరినీ మసీదులోకి ప్రవేశించనిచ్చేవారు కాదు.  దాదా కేల్కర్, మహల్సాపతి, తాత్యా, మహదు, అబ్దుల్లా, లక్ష్మీబాయి వీరికి మాత్రమే ప్రవేశార్హత ఉండేది.  
బాబా మహాసమాధి చెందిన తరువాత కూడా మహల్సాపతి ఎప్పటిలాగే మసీదులో కూర్చొంటూ ఉండేవారు.  బాబాకు పూజ చేసేవారు.  రోజువిడచి రోజు అక్కడే నిద్రిస్తూ ఉండేవారు.   ఆయన చనిపోయే వరకు ఈ విధంగా జరిగింది. అయన తన కుమారునితో మంచి కార్యక్రమాలు చేస్తూ భక్తి మార్గంలో జీవించమని చెప్పారు. బాబా మహాసమాధి చెందిన నాలుగు సంవత్సరాలకి, మహల్సాపతి మసీదులో బాబాకు పూజ చేసి రాత్రి ఆరతి యిచ్చిన తరువాత బాబా ముందే చెప్పినట్లుగా 1922 సంవత్సరం సెప్టెంబరు 11వ.తారీకు ఏకాదశినాడు 'రామ' అని ఉచ్చరిస్తూ తనువు చాలించారు.  మొదటిసారిగా బాబాను "సాయి" అని స్వాగతించి 1886 సంవత్సరంలో 72 గంటలపాటు బాబా శరీరాన్ని ఆయన చెప్పిన మాటల మీద పరిపూర్ణ విశ్వాసంతో కాపాడిన మహల్సాపతి ధన్యజీవి.  బాబా తాను సమాధి చెందిన తరువాత  కూడా యిప్పటికీ ఆయన తన భక్తులనెందరినో అనుగ్రహిస్తూనే ఉన్నారు.  


ఆంగ్ల రచయిత 
శ్రీబొండాడ జనార్ధనరావు
సాయి ప్రచారక్
బెంగళూరు - 560 068 
(సర్వం  శ్రీసాయినాధార్పణమస్తు)

Monday, May 26, 2014

Interview with Shri K.V.Ramani ( శ్రీ కే.వీ.రమణిగారి తో ముఖా ముఖి)





శ్రీ కే.వీ.రమణిగారి తో ముఖా ముఖి
Online లో చదవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి | Click Below Link to View / Read Online



https://drive.google.com/file/d/0ByOMsv7nnAWEWDZZWjRjcWF4cVE/edit?usp=sharing

శ్రీ కే.వీ.రమణిగారి తో ముఖా ముఖి క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి | Download From The Below Link      


https://drive.google.com/file/d/0ByOMsv7nnAWEWDZZWjRjcWF4cVE/edit?usp=sharing

శ్రీ కే.వీ.రమణి



A – శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు, షిరిడీ వారు శ్రీ కే.వీ.రమణి కి ఇచ్చిన ప్రశంసాపత్రపు మెమొంటో.
 B – షిరిడీ సాయి ట్రస్ట్, చెన్నయ్ ప్రాంగణంలోని సాయి ద్వారకామాయి

 C – షిరిడీ సాయి ట్రస్టు, చెన్నయ్ ధ్యానమందిరంలోని సాయి విగ్రహం
 D – షిరిడీ సాయి ట్రస్టు, చెన్నయ్ ధ్యాన మందిరంలోని సాయి విగ్రహం/
 షిరిడీ సాయి ట్రస్టు, చెన్నయ్, మేనేజింగ్ ట్రస్టీ శ్రీ కే.వీ.రమణి
 సాయి ఆశ్రమంలో శ్రీ రమణి
 చెన్నయ్ లోని షిరిడీ సాయి ట్రస్టు ప్రాంగణం




శ్రీ కే.వీ.రమణి



A – శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు, షిరిడీ వారు శ్రీ కే.వీ.రమణి కి ఇచ్చిన ప్రశంసాపత్రపు మెమొంటో.
 B – షిరిడీ సాయి ట్రస్ట్, చెన్నయ్ ప్రాంగణంలోని సాయి ద్వారకామాయి
 C – షిరిడీ సాయి ట్రస్టు, చెన్నయ్ ధ్యానమందిరంలోని సాయి విగ్రహం

 D – షిరిడీ సాయి ట్రస్టు, చెన్నయ్ ధ్యాన మందిరంలోని సాయి విగ్రహం
  E - షిరిడీ సాయి ట్రస్టు, చెన్నయ్ లొని సాయి ద్వారకా మాయి

షిరిడీ సాయి ట్రస్టు, చెన్నయ్, మేనేజింగ్ ట్రస్టీ శ్రీ కే.వీ.రమణి
 షిరిడీ సాయి ట్రస్టు, చెన్నయ్ 110 కోట్ల రూపాయల విరాళంతో షిరిడీలో నిర్మించిన సాయి ఆశ్రమ్ ని సంస్థాన్ కి అందజేస్తున్న శ్రీ రమణి.

 


మహరాష్ట్ర్ ముఖ్యమంత్రి శ్రీ రమణికి ప్రశంసా పత్రాన్ని అందిస్తున్న చిత్రం


చెన్నయ్ లోని షిరిడీ సాయి ట్రస్టు ప్రాంగణం


Thursday, May 22, 2014

ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సాయి దేవాలయం

చాలా మంది గురువారం సాయినాథుని దర్శించనిదే ఏ పని మొదలుపెట్టరు. అందుకే ప్రతి వాడ వాడన సాయిబాబా మందిరాలు ఎన్నో వెలిశాయి. అయితే ఆంథ్రప్రదేశ్‌లో మొదటి సాయిమందిరం ఎక్కడ వెలిసిందో తెలుసా...
ఇది కృష్టాజిల్లా విజయవాడలో. ఈ మందిరం 1947 ఆగస్టు నెలలో కృష్ణలంకలోని భ్రమరాంబపురంలో నిర్మించారు. రాంపిళ్ళ లక్ష్మణరావు గారి చేతుల మీదుగా ఈ గుడి ప్రతిష్ఠాపన జరిగిందని చెప్తారు. ఈ ఆలయంలో సిమెంటుతో చేసిన బాబా విగ్రహం 5.4 అడుగుల ఎత్తు ఉంటుంది.
1990 తర్వాత ఇక్కడ భక్తుల రద్దీ మరింత పెరగటంతో ఆయయపునర్మిణా చేయవలసి వచ్చింది. అలా 1992లో గుడి పుణనిర్మాణం జరిగింది. భక్తులు బహుకరించిన పాలరాతి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించారు. ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది.
ఆలయంలో విశిష్ట పూజలు జరిగే రోజులు
సంవత్సరం పొడుగునా భక్తులతో కళకళలాడే ఈ మందిరంలో ప్రతి గురువారం భక్తులు వెల్లువల వస్తుంటారు. అలాగే ప్రత్యేక రోజులైన గురుపూర్ణిమ రోజు బాబాకు అన్నాభిషేకం జరుగుతుంది. విజయదశమి రోజు బాబా సమాధికి విశేష అలంకరణ చేస్తారు. దీపాలతో హారతి సమర్పించి, పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు. ఇక ఆంగ్ల నూతన సంవత్సరాది నాడు ఆలయం రాత్రంతా తెరిచే ఉంటుంది. తెలుగు సంవత్సరాది ఉగాది నాడు బాబాకు సహస్ర జ్యోతిర్లంగార్చన వైభవంగా జరుపుతారు.అలాగే మాఘమాసంలో సాయివ్రతం, సహస్ర జ్యోతిర్లింగార్చన ఇక్కడ విశేషంగా జరుపుతారు.

Thursday, May 8, 2014

అందరి హృదయాలలోను నివసించువాడను నేనే సేకరణ http://telugublogofshirdisai.blogspot.in/2014/05/38.html

శ్రీసాయినాధుని యొక్క లీలలు(అంతుపట్టని అనుభూతులు) ఆయన భక్తులకు బాబా మీద ఎంతటి భక్తి ఉన్నదో  ధృవపరుస్తాయి.   శ్రీసాయి బాబాను అర్ధం చేసుకోవడం ఆయన భక్తులయినవారికి చాలా సులభం. బాబా తన భక్తులను తనవైపునకు పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా లాగుకొని తన దయను వారిపైన ప్రసరింపచేయడమన్నది చాలా అద్భుతమయిన విషయం.  లేకపోతే ఎక్కడో ధర్మవరంలో పనిచేస్తున్న శ్రీస్వామి కేశవయ్యజీ గారికి బాబా గురించి తెలుసుకొనే అదృష్టం ఎలా కలుగుతుంది?  ఆయన ఎప్పుడూ శ్రీసాయి సత్ చరిత్రను చదవలేదు.  ఎవరినించీ ఆయన శ్రీసాయిబాబా లీలలను గురించి వినలేదు.  అనంతపురం జిల్లా ధర్మవరంలో నివసిస్తున్న ఆయనకు 1939వ.సంవత్సరం జూలై 1 వ.తేదీన సాయిబాబా గురించితెలిసింది .  



ఆరోజు మరపురానిది.  ఆరోజు సాయంత్రం ఆయన తన వ్యక్తిగత సమస్యల గురించి తన సన్నిహిత స్నేహితుడు, అడ్వకేటు అయిన శ్రీమల్లిరెడ్డిగారితో చర్చిస్తున్నారు.  కష్టాలు తీరాలంటే సాయిబాబాను పూజించమని ఆయన సలహా యిచ్చారు.  ఆరోజు రాత్రి ఆయనకు కలలో శ్రీసాయిబాబా దర్శనమయింది.  మరుసటిరోజు ఆయనకు షిరిడీనుండి బాబా ఫొటో, ఊదీ వచ్చాయి.  వాటిని ఎవరు పంపించారో తెలియదు.  అప్పటినుండి శ్రీకేశవయ్యజీ గారి వ్యక్తిత్వం మారిపోయింది.  శ్రీసాయిబాబాకు భక్తుడయిపోయారు.  తమ కష్టాలు బాధలనుండి ఉపశమనం పొందడానికి ఆయన వద్దకు అసంఖ్యాకంగా ఎంతో మంది సాయి భక్తులు వచ్చేవారు.  శ్రీసాయిబాబా కృప వారిపై ప్రసరింపడానికి ఆయన బాబాకు, భక్తులకు మధ్య మధ్యవర్తిగా సేవ చేశారు.  19వ.శతాబ్దం చివర హేవళంబి సంవత్సరంలో శ్రావణ బహుళ అమావాస్య రోజున శ్రీ కేశవయ్యజీ గారు జన్మించారు.  ఆయన తండ్రిగారయిన శ్రీ స్వామి బాలయ్యగారు వ్యవసాయం చేస్తూ ఉండేవారు.  ఆయన హిందువు, ఎంతో భక్తికలవారు. కేశవయ్యగారికి చిన్నతనం నించి ఆధ్యాత్మిక విషయాలమీద ఎంతో ఆసక్తి ఉండేది.  జీవితాంతం ఆయనకు అదే ముఖ్యమయిన గుణంగా కొనసాగుతూ వచ్చింది.  దేవాలయంలో కొబ్బరికాయ కొట్టడమంటే ఆయనకు ఎంతో ప్రీతి.  స్కూలులో చదువుకునే రోజులలో బైబిల్ క్లాసులో ఆయనే మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడయేవారు.  ఆయనకు జీసస్ క్రీస్తు కూడా దర్శనమిచ్చారు.  ఆయన ఖురాన్ కూడా నేర్చుకొన్నారు.  ప్రాఫెట్ మహమ్మద్ కూడా ఆయనకు దర్శనమిచ్చారు. ఆయన తత్వ వేత్తలను సాధువులను, సన్యాసులను కలుసుకొన్నారు.  వారినుంచి ఎన్నో విషయాలను పరిశీలనా దృష్టితోను, శ్రధ్ధతోను, గ్రహించేవారు.  అందులో ఎంతో ఆసక్తిని కనపరచేవారు.   


మద్రాసు ఉమ్మడి రాష్ట్రం రెజిస్ట్రేషన్ డిపార్ట్ మెంటు లో స్వామీజీగారు గుమాస్తాగా తమ జీవితాన్ని ప్రారంభించారు.  తొందరలోనే ఆయన సబ్ రిజిస్ట్రారుగా పదోన్నతి పొంది మంచి పేరు తెచ్చుకొన్నారు.  బీదవారిపై ఆయన ఎంతో దయగా ఉండేవారు.  అందుచేత అందరూ ఆయనను 'స్వామి సబ్ రెజిస్ట్రారు  ' అనేవారు.  ఆయన యింటిలో కూడా ఎంతో దయగా ఉండేవారు.  నీతి, నిజాయితీగా కష్టపడి శ్రమించే ఆఫీసరు ఆయన. 


పదవీ విరమణ చేసిన తరువాత శ్రీనరసిం హ స్వామీజీ తన జీవితాన్ని సాయిబాబా తత్వ ప్రచారానికే అంకితం చేశారు. పెనుకొండలో ఒకసారి ఆయన పూజలో ఉండగా, ఒక పిల్లవాడిని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు.  ఆపిల్లవాడు నాలుగు సంవత్సరాలుగా తుంటి కీలుమీద చీము కురుపు వచ్చి ఎంతో బాధ పడుతున్నాడు.  బళ్ళారిలోని మిరాజ్ ఆస్పత్రిలో వైద్యం చేయించినా కూడా పుండు మానలేదు.  ఆపిల్లవాడిని యిద్దరు మనుషులు ఎత్తుకొని తీసుకొని వచ్చారు.  ఆపిల్లవాడు వచ్చిన సమయం చూశారు కేశవయ్యగారు.  పిల్లవాడి నుదుటి మీద చేయి వేసి, కొబ్బరినూనెలో ఊదీ కలిపి పుండు మీద రాయమని చెప్పారు.  కొన్ని వారాలపాటు ప్రతి గురువారం బాబా పూజకు రమ్మని పిల్లవాడితో చెప్పారు.  ఆయన ముందుగా చెప్పినట్లుగానే, చెప్పిన సమయానికి పిల్లవాడి పుండు మానిపోయింది. ఆరోగ్యవంతుడయాడు.  ఇటువంటి సంఘటనలెన్నో వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.  ఇవన్ని కూడా కేశవయ్యజీగారు శ్రీసాయినాధుల వారికే అంకితం చేశారు.  బాబా భక్తులయినవారికి వివిధ పరిస్థితులలో వారు లౌకిక జీవితంలో ఎదుర్కొనే అన్ని కష్టనష్టాలనుండి విముక్తులవడానికి శ్రీసాయినాధులవారి రక్షణబాధ్యత ఎంతో సహాయకారిగా ఉంటుంది.    


శ్రీకేశవయ్యజీ గారు, షెనాయ్ నగర్ మద్రాస్ లో శ్రీసాయిబాబా భక్త సమాజ్ ని స్థాపించి దానికి అధ్యక్షులుగా ఉన్నారు.  ఆసమాజం సాయిభక్తులకు సేవలనందిస్తోంది.  ఆయన షెనాయ్ నగర్  లో ఆగష్టు, 9వ తేదీ, 1981 వ.సంవత్సరంలో సమాధి చెదారు.


సంధ్యా ఉడతా

హైదరాబాదు