Total Pageviews

Friday, January 31, 2014

కష్టమొచ్చినా సాయిని మరవద్దు

ఈ లీల సాయి భక్తురాలయిన రియా గారు అమెరికానించి పంపించారు.
సాయి సిస్టర్ రియా అమెరికా నించి తమ అనుభవాన్ని ఇలా మనతో పంచుకుంటున్నారు.
కష్టమొచ్చినా సాయిని మరవద్దు
సాయి భక్తులందరి అనుభూతులను ఎన్నిటినో నేను చదువుతున్నాను. మొట్టమొదటిసారిగా నాకు నా అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాలనిపించింది. 12 సంవత్సరాలనించి నేను బాబాని సేవిస్తున్నాను. నా జీవితంలో ఆయన చూపించే లీలలు కూడా వృధ్ధి చెందుతున్నాయి. నేను వాటినన్నిటినీ వివరించలేను గానీ, గత 10 నెలలలో నాకు కలిగిన అనుభూతులని వివరిస్తాను.
అమెరికాలో రెసిషన్ వల్ల నాకు ఉద్యోగం పోయింది. 8 నెలలుగా ఉద్యోగం లేకుండా గడిపాను. ఫిబ్రవరి, 2010 లో నా ఉద్యోగం పోయినప్పుడు నేనంతగా బాధ పడలేదు. కారణం సాయి నాతోనే ఉన్నారని నాకు తెలుసు. అంతా ఆయనే చూసుకుంటారనే ధీమా. కాని సాయి నా ఓర్పును సహనాన్ని పరీక్షిస్తున్నారనుకున్నాను.. మరలా కొత్తగా ఉద్యోగాలకి ప్రయత్నాలు మొదలుపెట్టాను. నెలలు గడుస్తున్నా నాకు యెవరినించీ కూడా పిలుపు రాలేదు. పిలుపు వచ్చినా గాని ఎటువంటి ఉద్యోగమూ రాలేదు. జూన్/జూలై కల్లావర్క్ పెర్మిట్ కూడా ఒక సమస్య గా మారింది. నాకు చాలా నిరాశ ఎదురయింది. ఆ సమయంలో గురువార వ్రతము కూడా చేశాను గాని ఏమీ ఫలితం కనిపించలేదు. పరిస్థితులన్నీకూడా దుర్లభంగా మారి, బిల్లులు కట్టడానికి, కారు మీద తీసుకున్న అప్పు తీర్చడానికి కూడా చాలా కష్టమయింది. ఆ సమయములో నా స్నేహితులే నాకు సహాయం చేస్తూ ఉండేవారు. చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టాను గాని అవేమీ కూడా నా అవసరాలను తీర్చలేకపోయాయి. ఒకానొక సమయంలో నేనెంతగా కృంగిపోయానంటే అసలు సాయి ఉన్నారా అని అనిపించింది. నా పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చేశాను. కాని ఏమీ ఫలితం కనపడలేదు. ఒకదాని తరువాత ఒకటి సమస్యలు రావడంతో నేను పూర్తిగా నాశనమయిపోయినట్లుగా అనిపించింది. ఒకనొక సమయంలో పూర్తి నిస్సహాయ స్థితిలో నేను సాయిని కూడా ప్రార్థించడం మానేసాను. కాని నన్ను నేను సమాధాన పరచుకుని సాయినే ప్రార్థించడం మొదలుపెట్టాను. వ్రతాలను చేయడం మానేశాను. ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా చదవడం మానేసాను. నాకింక సహనం నశించి సాయిని సహాయం చేయమని అర్థించాను. ఆన్ లైన్లో బాబా ప్రశ్నలు సమాధానలలో ప్రశ్నలు అడగసాగాను. అందులో జవాబులో ఏది వస్తే అది అన్నీ చేశాను. ఉదాహరణకి కొబ్బరికాయ కొట్టమంటే కొట్టాను. గుడికి వెళ్ళమంటే గుడికి వెళ్ళాను. ఏది చేయమని వస్తే అదే విధంగా అన్నీ చేశాను.
భాబా సచ్చర్తిత్రలో చెప్పారు, ఏది యెలా జరగాలో అది జరుగుతుంది. తన భౌతిక దేహానంతరము తాను తన భక్తులకు సహాయం చేస్తానని చెప్పారు. సెప్టెంబరు నెల వచ్చేటప్పటికి నాకు ఇక సహనం పోయింది. చిన్న ఆశాకిరణం, నమ్మకం మాత్రమే మిగిలి ఉన్నాయి.
నేనెంతగా విసిగి పోయానంటే నేను ఉద్యోగప్రయత్నాలను కూడా మానేశాను. నేనిక ఒకటే చేసాను. సాయి ప్రశ్నలు జవాబులలో ఏది వస్తే అది చేయడానికి సిధ్ధమయ్యాను. నాకెప్పుడూ ఒకే సమాధానం వస్తూ ఉండేది. నవంబరు/డిసెంబరులలో పర్తిస్థితులలో మార్పు వస్తుందని. నాకు నమ్మకం ఉంది. కాని కొన్ని అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. అక్టోబరు వరకు పరిస్థితులు అలాగే ఉన్నాయి. అక్టోబరు చివరలో నాకు పెద్ద ప్రమాదం జరిగి (వివరాలను నేను చెప్పదలచుకోలేదు) ప్రాణాపాయాన్నుండి బయటపడ్డాను. నాకివన్నీ ఎందుకిలా జరుగుతున్నాయి, సాయి నా మొఱ ఎందుకని ఆలకించటంలేదని బాధపడుతూ ఉండేదాన్ని. మెల్లగా, రెండు రోజుల తరువాత సాయి నామీద తన అనుగ్రహాన్ని చూపడం మొదలుపెట్టారు. నన్ను చావునుంచి తప్పించినది సాయే అని నాకు అర్థమయింది. ఆ క్షణంలో నేను, నన్ను రక్షించమని సాయి నామాన్నే స్మరించాను, అప్పుడు నన్ను సాయె కాపాడారు. నవంబరు చివరి వారంలో నాకొక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. కాని దానికి నేనెప్పుడూ అప్ప్లై చేయలేదు. వారు ఆన్ లైన్ లో నా రెజ్యూం చూసి నన్ను యింటర్వ్యూకి పిలవడం జరిగింది. ఇంటర్వ్యూ చాలా కఠినంగా జరిగింది. నాకు ఈ ఉద్యోగం వస్తుందా రాదా అని సందేహం వచ్చింది.
అయినప్పటికీ నేను సాయిని ప్రార్థించాను. నాకు మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. నా వర్క్ పెర్మిట్ కూడా తిరిగి రెన్యూ చేయబడింది.
నేనిప్పుడు ఇక్కడ పనిచేస్తున్న చోట చాలా సంతోషంగా ఉన్నాను. నేనెప్పటినుంచో సాయిని పూజిస్తున్నప్పటికీ, ఈ చివరి నెలలలో ఎన్నో విషయాలను అవగతం చేసుకున్నాను. వాటిని నేను మీతో పంచుకోదలచుకున్నాను.
జీవితంలో మనకందరికీ ఎన్నోసమస్యలు ఉంటాయి. అందరి జీవితాలూ వడ్డించిన విస్తరి కాదు. ఇప్పటికే మనకిచ్చినవాటిని గురించి మనం సంతోషించి, హృదయాంతరాళలోనించి భగవంతునికి కృతజ్ఞతలను తెలుపుకోవాలి. ఆవిధంగా చేసినట్లయితే మనలో మంచి శక్తి పెంపొందుతుంది. అదే మనకు జీవితంలో మంచిని కలగచేస్తుంది.
నాకేది జరిగినా అది భగవంతుని వల్ల జరిగినదే అని నేను భావించాను. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినప్పుడు నేను విచారిస్తూ ఉండేదానిని. ఇప్పుడు నా దృక్పధంలో చాలా మార్పు వచ్చింది. ఏ చిన్న విషయానికైనా భగవంతునికి కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు పునర్జన్మ.
నువ్వేదయినా పని జరగాలని కోరుకున్నప్పుడు అది జరగకపోతే, సాయి సహాయం చేయటంలేదు అని భావించద్దు. దానర్ధం మనం అనవసరంగా ఆందోళనపడుతూ ఉంటాము. కాని సమయం వచ్చినప్పుడు సాయి తప్పకుండా సహాయం చేస్తారు. సాయిమీద పూర్తి విశ్వాసంతో ఉండాలి. ఆయన మృత్యుకోరలనుండి కూడా రక్షిస్తారు.
పరిస్తితులు ఏమయినా కానివ్వండి, మనకోరికలు స్వచ్చమైననవి, తగినవి అయితే సాయి మనవెంటే ఉంటారు. సాయి మనలనెపుడు నిర్లక్ష్యం చేయరు.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Thursday, January 30, 2014

శ్రద్ధ, సబూరీ చాలా అవసరం...

షిర్డీ సాయిబాబా ఎలాంటి హంగులూ, ఆర్భాటాలూ చూపలేదు. మంత్రాలూ తంత్రాలూ ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలు అయింది. అందరూ, అన్ని జీవులూ తినగా మిగిలిన పదార్ధాలనే పంచ భక్ష్య పరమాన్నాలుగా భావించారు. షిర్డీ సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబ వృక్షం కిందనో ఏ ఆడంబరాలూ లేకుండా కూర్చుని, శ్యామా, మహల్సాపతి, బయజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైన ఆణిముత్యాల మూటలు. ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారు.
''మీరు ఎవర్నీ నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని ఏ రకంగా నయినా కష్టపెట్టినా సరే, వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. ''శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకూ కొరకాకుండా పోతారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి. ఎవరైనా, ఏ కారణంగా నయినా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుండి వెళ్లిపోండి.
''ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక, నిశ్చలంగా, నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాటకు దిగారంటే, మీరు కూడా వారితో సమానులే అవుతారు. ''దేవునిపట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా, పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి. దేవుడివైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుడు మిమ్మల్ని కాపాడటానికి పది అడుగులు ముందుకు వస్తాడని తెలుసుకోండి..'' సాయిబాబా చిప్పిన మాటలను మర్చిపోకండి. ఆచరించేందుకు ప్రయత్నించండి.

సాయి చేష్టల వెనుక గూఢార్ధం

సాయిబాబా అవతార మూర్తి. ఆయన్ను ప్రత్యక్షంగా చూసి తరించినవారు ధన్యులు. బాబాతో సన్నిహితంగా మెలిగే అవకాశం పొందినవారు, ఆ పుణ్యమూర్తి సాంగత్యం పొందివారు అదృష్టవంతులు. మహల్సాపతి, తాత్యాకోతే పాటిల్ తదితరులు ఎందరో బాబాతో సన్నిహితంగా గడిపారు. వారిద్వారా సాయిబాబాకి సంబంధించిన విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.
సాయిబాబా దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేముందు బాబా అనుమతి తీసుకుని వెళ్ళేవారు. ఆయన సమ్మతిస్తేనే వెళ్ళాలి. బాబా గనుక ''ఇప్పుడు వద్దు'' అని చెప్పినా పట్టించుకోకుండా, ఆయన మాటను తేలిగ్గా తీసుకుని వెళ్ళిన భక్తులకు ఏవో ఆటంకాలు కలిగి వెనుదిరిగి రావలసి వచ్చేది. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవారు. తన భక్తులు ఇబ్బందుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే కొన్నిసార్లు బాబా వారిని అడ్డగించేవారు. అది గ్రహించక ఏదో ముఖ్యమైన పని ఉందంటూ వెళ్ళి, కష్టనష్టాలు కొనితెచ్చుకునేవారు. అలా ఆపదలు ఎదురైనప్పుడు గానీ, బాబా ఎందుకు వద్దన్నారో గ్రహించేవారు కాదు. బాబా మాటలమీద గురి ఉన్నవారు మాత్రం, ఆయన చెప్పినట్లు విని నిశ్చింతగా ఉండేవారు.
సాయిబాబా షిర్డీ వదిలి ఎక్కడికీ వెళ్ళేవారు కాదు. ఎప్పుడైనా వెళ్తే షిర్డీకి ఉత్తరాన ఉన్న నీంగావ్, దక్షిణాన ఉన్న రహతా గ్రామాలకు మాత్రం వెళ్ళి వచ్చేవారు. ఈ రెండు ఊళ్లకు తప్పించి సాయిబాబా మరెక్కడికీ వెళ్ళింది లేదు. బాబా ఎన్నడూ రైలు ఎక్కలేదు. ఇంకా చెప్పాలంటే రైలును చూడను కూడా లేదు. కానీ, రైళ్ళ రాకపోకల వేళలను, వాటి వివరాలను భక్తులకు వివరించి చెప్పేవారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో, దారిలో ఎవరు ఎదురౌతారో కూడా చెప్పేవారు. ఆయన ఏది చెబితే అది అక్షరాలా జరిగేది.
సాయిబాబా మసీదులోనే కూర్చుని, ఎక్కడెక్కడ ఏం జరిగిందీ, ఏమి జరగబోతున్నదీ చక్కగా చెప్పేవారు. బాబా ఒక్కోసారి చిత్రవిచిత్రమైన సైగలు చేసేవారు. కొన్నిసార్లు పెద్దపెద్దగా కేకలు వేసేవారు. ఇంకొన్నిసార్లు తనను తానే వీపుమీద చరుచుకునేవారు. మరికొన్నిసార్లు పక్కనున్న భక్తులను విసుక్కునేవారు. ఆ చేష్టలు ఒక్కోసారి ''పిచ్చి పకీరు'' అనిపించేలా ఉండేవి. బాబా ప్రవర్తన కొన్నిసార్లు భయపెట్టేలా కూడా ఉండేది. కానీ, వాటి వెనుక ఏదో గూఢార్ధం ఉండేది. కొద్దిసేపటికి బాబా శాంతించేవారు. భక్తులకు బాబా ఎందుకలా చేస్తున్నారో ఎంతమాత్రం అర్ధమయ్యేది కాదు. దూరాన ఉన్న భక్తులు ఆకస్మిక ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు, వారిని కాపాడే ప్రయత్నంలో బాబా అలా చిత్రంగా ప్రవర్తించేవారు. బాబా ఆ సంగతి చెప్పినప్పుడు పక్కనున్నవారికి ఆశ్చర్యంగానే ఉండేది. నమ్మశక్యం కానట్లు చూసేవారు. కానీ, కొద్దిసేపటికే తమను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిన భక్తులను చూశాక, బాబా ఇక్కడే ఉండి, కష్టాల్లో చిక్కుకున్న వారిని ఆదుకున్న తీరు వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసేది. మసీదులో ఓ మూల కూర్చుని మహినంతటినీ చూడగల మహిమాన్వితుడు సాయిబాబా.
సాయిబాబాను చేరువగా చూసిన వారిలో కూడా అందరికీ ఆయన బోధనలు అర్ధమయ్యేవి కావు. బాబా మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహించేవారు కాదు. కొందరు మాత్రమే బాబాను పరిపూర్ణంగా అర్ధం చేసుకుని తూచ తప్పకుండా అనుసరించేవారు. వారిని బాబా అనుక్షణం కనిపెట్టుకుని ఉండేవారు.

Wednesday, January 29, 2014

COMPLETE DETAILS WITH MORE CCTV PHOTOS OF MIRACLE ON 10 th JAN 2014 IN Andhra Pradesh SAI TEMPLE

 
 
 
 
 
10 jan 2014 zaheerabad sai temple andhra pradesh (99 km from hydrabad on mumbai highway )Doing the rounds is a Miracle of Sai Baba in person actually entering the Sai Temple @ Zaheerabad Sai Baba Temple in Andhra Pradesh on 10th Jan`2014. He walks around the Temple, talks to the pundit and asks him to do a Arati after which Baba has Prasad. Then while walking down towards the gate, a couple of guys accompany him talking something as he leaves the Temple from the gate. In all he spends around 5 mins in the Temple. All caught on CCTV

Tuesday, January 28, 2014

సాయీ నీలీలలు వర్ణించ తరమా? సేకరణ http://telugublogofshirdisai.blogspot.in/

ఈ అద్భుతమైన లీల శ్రీ ప్యారేలాల్ ఖన్న, 13 థియేటర్ రోడ్ కోల్ కత్తా వారివి. ఈ లీల శ్రీసాయి లీల ద్వైమాస పత్రిక నవంబరు-డిసెంబరు 2003వ.సంవత్సరంలో (61వ.నంబరు) ప్రచురింపబడింది. అందులో ప్రచురింపబడిన ఈ లీల యధాతధంగా మీకందిస్తున్నాను.
నేను నాభార్య 1950వ.సంవత్సరంలో రామేశ్వరం వెళ్ళాము. దక్షిణ భారత దేశమంతా తిరిగాము. మేమెక్కడికి వెళ్ళినా మాకు తలపాగా చుట్టుకొని వున్న ఒక యోగి చిత్రపటాలు మాకు దర్శనమిస్తూ ఉండేవి.
ఆయనెవరో మాకు తెలీదు. ఆఖరికి ఆఫొటోలు శ్రీషిరిడీ సాయిబాబా వారివని తెలిసింది.
నాతమ్ముడు షిరిడీ వెళ్ళాడు. షిరిడీనించి వచ్చిన తరువాత మమ్మల్ని కూడా షిరిడీ వెళ్ళమన్నాడు. ఆసమయంలో నేను పెద్ద కష్టంలో ఉన్నాను.ఆఫీసులో విపరీతమయిన పని వత్తిడి. అంతే కాదు నాభార్యకు అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేయించవలసిన పరిస్థితి.
ఆమెకు బొంబాయిలో మేజర్ ఆపరేషన్ చేయించడానికి వెళ్ళేముందు బాబా ఆశీర్వాదం కోసం మేము 1982 ఏప్రిల్ లో బొంబాయి వెళ్ళాము. షిరిడీ యింకా చేరుకోకముందే బాబా మమ్మల్ని అనుగ్రహించారు.
మేము రైలులో ఉండగా ఎఱ్ఱటి దుస్తులతో ఒక ఫకీరు మా బోగీలోకి వచ్చాడు. అతను మాకష్టాలన్నీ తీరిపోతాయని అర్ధం వచ్చేటట్లుగా మరాఠీలో ఒక పాట పాడాడు. అతను మమ్మల్ని రూ.5/-అడిగాడు. మేమతనికి 5 రూపాయలు యిచ్చాము. అతను మమ్మల్ని దీవించి మిగిలినవారెవరినీ ఏమీ అడగకుండా వెళ్ళిపోయాడు.
షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొన్న తరువాత నాభార్యకు ఆపరేషన్ జరిగింది. అదే సమయంలో నాకు టైఫాయిడ్ వచ్చి జ్వరం తీవ్రంగా ఉంది. మంచం మీదనించి లేవలేని పరిస్థితి. ఆస్పత్రికి వెళ్ళి నాభార్యకు సపర్యలు చేయడానికి ఎవ్వరూ లేరు. అప్పుడే బాబావారి విశేషమైన అధ్బుతమైన దయ, అనుగ్రహం మామీద ప్రసరించింది. ఎవ్వరూ అడగకుండానే ఒక నర్సు వచ్చింది. ఆనర్సు నాభార్య దగ్గరే ఉండి రాత్రంతా ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకుని సపర్యలు చేసింది. పేషెంట్ అయిన నాభార్యకు యివేమీ తెలియవు. మరునాడు ఉదయం 7గంటలకు నర్సు తాను పేదరాలినని తాను చేసిన సేవకు డబ్బు యిమ్మని అడిగింది. కాని నాభార్య వద్ద డబ్బు లేకపోవడంతో నర్సును మరుసటి రోజు రమ్మనమని తప్పకుండా డబ్బు యిస్తానని మాట యిచ్చింది. అపుడా నర్సు నాభార్యను తలనుంచి పొట్టవరకు చేతితో తాకి దీవించి వెళ్ళిపోయింది. ఆతరువాత ఆనర్సు మరలా రాలేదు. ఆమె మాకెక్కడా కనపడలేదు కూడా.
తరువాత డాక్టర్ వచ్చి తనవద్ద అటువంటి నర్సు ఎవరూ పని చేయటల్లేదని చెప్పాడు. మేము 26వ.తారీకున ఆస్పత్రినించి వచ్చేశాము. నర్సు మరలా రాలేదు.

ఎవరూ లేని పరిస్థితిలో బాబాయే నర్సు రూపంలో వచ్చి ఒంటరిగా ఉన్న నా భార్యకు సపర్యలు చేశారని మాకు గట్టి నమ్మకం కలిగింది.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(పాఠకులకు ఒక మనవి: పత్రికలో రచయిత వ్రాసిన ప్రకారం ఆయన బాబాకు 5ప్. అని ప్రచురితమయి ఉంది. అయితే అవ్ 5 పైసలా? లెక 5 రూపాయలా? పీ.అని పొరపాటుగా ప్రచురితమయిందో తెలీదు. కాని 1980 దశకంలో 5 పైసలు చలామణీలో లేవు కాబట్టి 5 రూపాయలుగా నేను భావించి రాయడం జరిగింది. పతికలో ఈ లీల 61వ.నంబరు నర్సు రూపంలో వచ్చిన సాయిగా ప్రచురితమయింది.)

సచ్చరిత్ర - బాబా గారు ఇచ్చే సందేశములు సేకరణ http://telugublogofshirdisai.blogspot.in/

సచ్చరిత్ర - బాబా గారు ఇచ్చే సందేశములు
మన సాయి బంథువులందరికి కూడా బాబా గారే మనకు, తల్లి, తండ్రి, గురువు, దైవం. మన ఇంటిలో బాబా గారి ఫోటో, లేక విగ్రహమున్నా బాబా గారు మన ఇంటిలో ఉన్నట్లే.
బయటకు వెళ్ళేటప్పుడు, బాబా ఊదీ నుదుట పెట్టుకుని, బాబా గారి, ఫొటొ ముందుగాని, విగ్రహం ముందు గాని నిలబడి , బాబా వెళ్ళి ఒస్తానని చెప్పి వెళ్ళండి. మన యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు. వచ్చాక మళ్ళీ వచ్చాను బాబా అని చెప్పండి. ఇప్పుడు మన ఇంటిలో పెద్దవారు అంటే, తండ్రిగాని, తాతగారు గాని, లేక అమ్మకి గాని యెలా చెప్పి వెడతామో అలాగే, బాబా గారికి కుడా మనము చెప్పి వెళ్ళాలి. మన సాయి బంథువులందరూ ఇది అలవాటు చేసుకోవాలి.
మనకి యేదయినా సమస్య వచ్చినప్పుడు బాబా చరిత్రని చేతిలో పెట్టుకుని మనసమస్య మనసులో బాబాకి చెప్పుకుని పరిష్కారము చూపించమని అడిగి, పుస్తకము తెరవాలి. మన సమస్యకి పరిష్కారము ఆయనే చూపిస్తారు.
కాని నాకు, సమస్య అడగకుందానే జరగబోయే సంఘటన తెలియచేశారు. బాబా లీలలు నిగూఢంగా ఉంటాయి.
ఈ రోజు 2009 సం.లో నాకు కలిగిన అనుభూతి గురించి వివరిస్తాను.
నేను చదువుకునే రోజులలో యెప్పుడైనా డిక్ షనరీ తీసి మూసిన పుస్తకంలోనుంచి యేదొ ఒక పేజీ తీసి యే మాట వస్తుందో చూసేవాడిని. ఇది నేను చాలా తక్కువ సార్లే చేశాను.
యెప్పుడైనా పుస్తకాల ఎక్జిబిషన్ కి కి వెళ్ళినప్పుడు యేదొ పేజీ తీసి విషయము బాగుంటే వెంటనే కొనడం అలవాటు.
నా దగ్గర శ్రీ ఓరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు వ్రాసిన శ్రీ సద్గురు సాయిబా జీవిత చరిత్ర - నిత్య పారాయణ గ్రంథం ఉంది. ఈ పుస్తకము నా స్నేహుతుడు యెప్పుడొ ఇచ్చాడు. అతను కొన్ని సంవత్సరాల క్రితం కాలుకి ఫ్రాక్చర్ అయ్యి ఇంటిలో ఉన్నప్పుడు అతనికి నేను ఇటువంటి పుస్తకం ఇచ్చి పారాయణ చేయమని ఇచ్చాను. అతనికి బాబా పరిచయం ఈ పుస్తకము ద్వారానే అయింది మొదటిసారిగా. అప్పటినుంచి అతను తనకు తెలిసినవారికి ఇటువంటి పుస్తకం కొని ఇస్తూ ఉన్నాడు.
అసలు విషయానికి వస్తాను. ఈ పారాయణ పుస్తకం నా కంప్యూటర్ టేబులు మీదే పెట్టుకున్నాను. ఒకసారి 2009 మార్చ్ నెలకి ముందు ఈ పుస్తకము చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకుని యేదో ఒకపేజీ తీసి ఒపేజీలొ ఒకచోట వేలుపెట్టి కనులు తెరచి చదివాను.
అది 97 పేజీ. అందులొ నేను వేలు పెట్టిన చోట ఇలా ఉంది>
" ఈ రోజు నీకు దుర్దినం. నీ ప్రాణానికే ప్రమాదం జాగ్రత్త" ఇది చదవగానే ఇంక మిగతా పేరా చదవకుండా పుస్తకం మూసేశాను. భయం వేసి మిగతాది చదవలేదు. ఇలా ఆ నెలలో చాలా సార్లు యెప్పుడు తీసిన ఇదే పేజీ ఇదే పేరా రావడం జరిగింది. యేమిటి ఇలావస్తొంది అనుకున్నాను. బాబా గారి మీద పూర్తి విశ్వాసం ఉంది , కాని యేమిటి ప్రతీసారి ఇలా వస్తోంది అనుకున్నాను.
అసలు విషయమేమంటే ఆ అథ్యాయంలో నానా సాహెబ్ డెంగ్లీ శ్రీ మాన్ బూటీని ఇలా హెచ్చరించాడు. బూటీ భయపడిపోయాడు. తరువాత బాబా గారు బూటీని చూస్తూ "యేమిటి, డెంగ్లీ యేమంటున్నాడు? నీకు చావును సూచిస్తున్నాడా? భయపడకు థైర్యంగా ఉండు, నాకె ప్రమాదం లేదని అతనితో గట్టిగా చెప్పు. నువ్వు ద్వారకామాయి బిడ్డవు. " ఆ పేరాలో ఉన్న మొత్తము విషయము అది.
ప్రతీసారి అదేపేజీ రావడానికి నేను ఆ పుస్తకాని ప్రతీరొజు పారాయణ చెయ్యటల్లేదు. మరి యెందుకని అదే వస్తోందొ నాకు అర్థము అవలేదు.
మార్చ్ నెలలో మా ఆవిడ బంథువులతో షిరిడి వెళ్ళడం జరిగింది. అక్క్డ డినించి శ్రీప్రత్తి నారాయణరావు గారిచే రచింపబడిన శ్రీ సాయి సచ్చరిత్రము పుస్తకము తెచ్చింది.
ఒకరోజు నేను ఇంతకుముందు చెప్పిన పుస్తకములో యెప్పుడూ కుడివైపు పేజీ మాత్రమే చూస్తున్నాను, అనుకుని ఈ సారి ప్రత్తి నారాయణరావు గారి పుస్తకము తీసాను. ఆ పుస్తకము చేతిలోకి తీసుకుని కళ్ళు మూసుకుని తెరిచి యెడమవయిపు పేజీ తీసి వేలు పెట్టి చూసాను. అది 22 అథ్యాయములోని చివరి పేరా. అందులో కూడా పాము గురించి ఉంది. ఆ పేరాలో "పాములు, తేళ్ళతో సహ సక ల ప్రాణులు భగవదాజ్ఞను శిరసా వహించును " అన్న వాక్యములు ఉన్నాయి.
14.03.2009 న శనివారమునాడు మా ఇంటిలో బాబా గారి విగ్రహము ముందు నిలబడి " బాబా నేను జ్ఞానిని కాదు, పుస్తకము తెరవగానే వచ్చే ఈ వాక్యముల అర్థము తెలియటల్లేదు, అంధు చేత ఈ రోజు నా కలలోకి వచ్చి దీనికి నివారణ చెప్పు" అని ప్రార్థించాను. ఆ రోజున మా సత్సంగములో ని ఒకరిని ఈ విషయము గురించి అడిగాను కాని వారుకూడా యెమి చెప్పలేదు.
నేను స్టేట్ బ్యాంకులో పని చేస్తున్నాను. అందులో నేను ఎస్.బీ. ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటేటర్ గా ఉన్నాను. 16.03.2009 న మరలా శ్రీ ఓరుగంటి రామకృష్ణప్రసాద్ గారి పుస్తకము తీసి, కళ్ళు మూసుకుని పేజీ తెరవగా, మరల అదే విషయము వచ్చింది. ఆ రోజున నేను స్కూటర్ మీద మా నరసాపురము నుంచి 15 కి.మీ. దూరములో ఉన్న మొగల్తూరు బ్యాంక్ కి ఇన్సూరెన్స్ పని మీద వెడుతున్నాను. నేను యెప్పుడు , బైక్ మీద వెళ్ళేటప్పుడు సాయి నామ స్మరణ చేసుకుంటూ ఉంటాను. అల్లా వెడుతుండగా సడన్ గా పైన ఆకాశంలో ఒక పక్షి వెళ్ళడం, కింద రోడ్డుమీదయేదో పడడం చూశాను. నా బైక్ కి కొంచెము దూరములోనే పడింది. చూసేటప్పటికి అది పాము, రొడ్డుమీద పడి కొంచెం తలయెత్తి ఉంది. నేను రోడ్డుకు కుడివైపున వెడుతున్నాను అది రోడ్డు మీద యెడమ ప్రక్కన పడింది . రోడ్డుకి యెడమవయిపు కాలవ, కుడివయిపు పంట పొలాలు ఉన్నాయి. నాకు శరీరంలో దడ పుట్టింది. ఆ వేగంలో పక్కనుంచి వెళ్ళిపోయాను. డ్రైవింగ్ లొ కొంచెం ముందుకు వెళ్ళి ఉంటే, అది నామీద కనక పడి ఉంటే? ఇది తలుచుకోగానే ఊహించడానికే భయము వేసింది. బాబా గారిని ఇలా ప్రార్థించాను, బాబా, నాకు ఇన్సూరెన్స్ పాలసీలు రాకపోయినా ఫరవాలేదు, ఈ రోజు నాప్రాణాల్ని, కాపాడావు, అదే చాలు అనుకుని నామస్మరణ ఆపకుండా
వెళ్ళాను. యే సత్సంగము ద్వారానయితే నాకు బాబాగారి తత్వము అవగాహనకు వచ్చిందో, ఆ సత్సంగానికి 116/- సమర్పించుకున్నాను. ఆయన చేసిన సహాయానికి 116/- కూడా తక్కువే, యేమిచ్చినా కూడా."
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Monday, January 27, 2014

YOU CAST YOUR burden on Me, I shall surely bear it - baba says

However intimate people are, they might be willing to share our pleasure and wealth but would not like to bear our burdens. Baba assured, He would become everything of theirs and bear their burdens, saying "You keep all your unbearable burdens on Me and be cool. I shall bear them all". Here, 'burden' means 'weight' which means 'above our capacity to bear'.
Baba spoke with motherly love 'cast your entire burden on Me'. Sri Sai assures us that He would bear the burden of those devotees who have unshakable faith and all-enduring patience, who have chosen the path of devotion seeking freedom from attachment to the fruits of one's effort. But, people who indulged in earthly pleasures and attracted by assets and bonds, going into prayer room only when they get into trouble, will not get rid of problems. All of a sudden reaching Shirdi, standing before Samadhi Mandir and demanding "you promised to bear my burden, hence, instantly remove it", will not do! How will it? Whatever life that we get by the deeds of our previous lives, we should be faithful and earnestly pray to Baba, "Lead us to Your presence, Father!" To Baba, the Almighty One, who bears the gigantic burden of this Vast Universe and guides its varied operations, it is but child's play to Him to bear our burdens. Knowing it, we remain cool by casting our burden on Baba.

Saturday, January 25, 2014

''Why fear when I am here?''acknowledge that it is from saileelas.org


Online లో చదవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి | Click Below Link to View / Read Online
https://drive.google.com/file/d/0ByOMsv7nnAWELTBTWVA2R0hQbmM/edit?usp=sharing


Wednesday, January 22, 2014

Sai Divya Paduka (Khadav) Maha Darshan--------Saibaba Chaganty

Sai Divya Paduka (Khadav) Maha Darshan at Jatni, in Odisha for the 2nd day today.
 Sai Divya Paduka (Khadav) Maha Darshan at Jatni, Odisha for the 2nd day today. Tomorrow is the last day.

Sai Divya Paduka (Khadav) Maha Darshan at Jatni, Odisha for the on 22nd Jan. 23rd January is the last day.

Old Photo of Dwarkamai


Monday, January 20, 2014

MAY SAI BABA BLESS US ALL from.saileelas.org


online లో చదవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి | Click Below Link to View / Read Online

https://drive.google.com/file/d/0ByOMsv7nnAWEbjFocjdLczZmYjA/edit?usp=sharing
 క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి | Download From The Below Link
https://docs.google.com/uc?export=download&id=0ByOMsv7nnAWEbjFocjdL


Sunday, January 19, 2014

is SAI BABA LIVING AND HELPING NOW FROM Saileelas.org

 
  
online లో చదవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి | Click Below Link to View / Read Online

https://drive.google.com/file/d/0ByOMsv7nnAWERFZGN3ZtQlROaG8/edit?usp=sharing 

క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి | Download From The Below Link

https://docs.google.com/uc?export=download&id=0ByOMsv7nnAWERFZGN3ZtQlROaG8

shirdi sai baba sermons


   Online లో చదవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి | Click Below Link to View / Read Online

https://docs.google.com/document/d/1nZZqcEz1wNjwEE1EKLL9rW6ykXpk1AeLxpv3AfkwogY/edit?usp=sharing

Monday, January 13, 2014

Masilapuram Manickem, fondly called as UDI BABA by numerous devotees across Tamilnadu merged in SAI a few hours ago at Vellore, Chennai email recieved fromSaibaba Chaganty

 
 
Most Revered Masilapuram Manickem, fondly called as UDI BABA by numerous devotees across Tamilnadu & all, merged in SAI a few hours ago at Vellore, Chennai. He was 60 & retired as Assistant Registrar of Societies (DIG) under Government of Tamilnadu. Known for his healing abilities UDI used to apply UDI on the forehead of Chronic Patients suffering from various diseases. He has established a Charitable Organisation, which distributes sewing machines to needy & distressed & women every year. On 1st January He was in Shirdi for New Year & offered prayers to Baba.

Monday, January 6, 2014

SAI SANNIDHI - Baba Monthly Magazine | సాయి -సన్నిధి. బాబా భక్తుల ఆత్మీయ మాస పత్రిక

 సాయి  -సన్నిధి. బాబా భక్తుల ఆత్మీయ మాస పత్రిక  |SAI SANNIDHI - Baba Monthly Magazine


Online లో చదవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి | Click Below Link to View / Read Online

Read / View Book Online


 క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి | Download From The Below Link

[File size : 21.7 MB]

Thursday, January 2, 2014

Launching Sai Ichchha Book Services recived mail from Hetal Patil Rawat

Dear Sai Devotee,

Do you want to feel closer to Sai? Do you want to dive into an ocean where nothing but only Lord Sai Baba's teachings and stories prevail? So how this can be materialized? It is obvious that one has to read literature on life and teachings of Lord Sai Baba to know more. But how can these books reach you when there are not many outlets in your own city? What if all these books be delivered at your door step with just a few clicks from your comfort zone? Sai Ichchha Book Services makes this possible.

Visit us at http://books.shirdisaibabaservices.in and explore a gallery of books on Lord Sai Baba with all details and notes from authors. We will be having an extensive collection of books from authors and publishers spanning across India. We also promote new and upcoming authors who are in search of good publishers and worrying about selling their books.

Right now we are launching our new blog with two products i.e. Shri Sai Baba Blessing Cards and Sai Katha Sagar Book. We will offer great variety of books and e-books to suit your interests at most economical rates as we grow further. Make this new year more lively and pious with Lord Sai Baba books. We deliver books all over India. Sorry to devotees residing outside India. We are working on it and we will coming up soon in abroad too.
 
We will be providing a generous discount on bulk orders and book sets. So what are you waiting for? Check out this link for details and discounts available.
 
Five early birds ordering today will get upto 5% OFF. Offer valid only for today!!! So Hurry!!!
 
You are just few clicks away from happiness, spirituality and divine bliss. Please feel free to circulate this email to your family and friends.


Happy Reading,

Regards
Sai Ichchha Book Services
contact@saiichchhacreatives.com
 
Read Shri Sai Satcharitra... Live Shri Sai Satcharitra!!!
Completely Surrendered to My Lord's Feet
Shri Sai Nath Arpanamastu
 
Jai Sai RamHetal Patil Rawat

Shirdi Sai Baba Blogs
Stories of Shirdi Sai Baba -
www.shirdisaibabastories.org
Experiences of Shirdi Sai Baba - www.shirdisaibabaexperiences.org
Bhajans of Shirdi Sai Baba - www.shirdisaibababhajans.com
Sai Tere Hazaaron Naam - www.saiterehazaaronnaam.com
Shirdi Sai Baba ServicesFree Shri Sai Satcharitra - ssc.shirdisaibabaservices.in
Free Udi Seva - udi.shirdisaibabaservices.in

Share Experiences - submission.shirdisaibabaservices.in
Prayer to Shirdi - prayers.shirdisaibabaservices.in

Wednesday, January 1, 2014

బాబా ప్రవచనములు:


1. భక్తులకు కావలసినది మంత్రోపదేశం కాదు: భగవంతునిపై లేదా తన గురువుపై స్థిరమైన విశ్వాసం. (శ్రద్ధ) , మరొకటి సంతోషం, పట్టుదలతో కూడిన ఓరిమి (సబూరి). ఈ రెండు దేవునిపై లేదా గురువుపై నిలిపిన నాడు వారి మనోద్రుష్టి భక్తునిపై నిలిపి భక్తుని ఉద్దరిస్తారు.
2. శ్రద్ధ, ఓరిమి ఉన్ననాడు వేరే విజ్ఞానం, శాస్త్రాలు అవసరం లేదు.
3. ఆత్మజ్ఞానానికి నిరంతర ధ్యానం అవసరం. ధ్యానం వలన మనసు స్థిరమౌతున్ది. ధ్యానించే నివే, ధ్యానింపబడే నేను, ధ్యానం అనే క్రియ వేరే వేరేగా కాక సర్వగతమైన చైతన్యం అనుభవం అవుతుంది.
4. ఇతరుల దోషాలు ఎంచకు. ఆలా చేస్తే భగవంతుడు నీ దోషాలు ఎంచుతాడు. సాటివారిని కొద్దిగా నిందించినా, నరకంలో శిక్షలు తప్పవు.
5. సుఖదు:ఖాలు మనోకల్పితాలు. సర్వం ఈశ్వర మయము అని, ఈశ్వర ప్రసాదం అని తలచేవాడు ఏ పరిస్తితిలో అయినా ఆనందంగా ఉంటాడు.
6. చేసిన కర్మకు అనుభవించక తప్పదు. కష్టాలకు భయపడి ముందే చావాలి అనుకుంటే, చేసిన పాపాలకు తోడు ఆత్మహత్య పాతకం కూడా తోడు అవుతుంది.
7. అర్హత లేని వారికీ ఆత్మజ్ఞానం లభించదు . లౌకిక విషయాల పైన మోహం నశిస్తే కానీ ఆత్మజ్ఞానం లభించదు.
8. జ్ఞానం కావాలంటే, పంచ ప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ది, అహంకారము -- విటన్నిటిని భగవంతుడికి సమర్పించాలి.
9. సద్గురువు మిద ప్రీతీ పెరిగిన కొద్ది, భక్తులకు ధనమ్ మిద ప్రీతీ తగ్గుతుంది.
10. నా వద్దకు ఎవరు వారికి వారు రాలేరు. నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను.
11. నా వద్దకు మొదట అందరు కోర్కెల తోనే వస్తారు. కానీ, కోరికలు తీరి ఒక స్థాయికి వచ్చాక, నన్ను అనుసరించి మంచి మార్గానికి వస్తారు.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.