Total Pageviews

Wednesday, January 1, 2014

బాబా ప్రవచనములు:


1. భక్తులకు కావలసినది మంత్రోపదేశం కాదు: భగవంతునిపై లేదా తన గురువుపై స్థిరమైన విశ్వాసం. (శ్రద్ధ) , మరొకటి సంతోషం, పట్టుదలతో కూడిన ఓరిమి (సబూరి). ఈ రెండు దేవునిపై లేదా గురువుపై నిలిపిన నాడు వారి మనోద్రుష్టి భక్తునిపై నిలిపి భక్తుని ఉద్దరిస్తారు.
2. శ్రద్ధ, ఓరిమి ఉన్ననాడు వేరే విజ్ఞానం, శాస్త్రాలు అవసరం లేదు.
3. ఆత్మజ్ఞానానికి నిరంతర ధ్యానం అవసరం. ధ్యానం వలన మనసు స్థిరమౌతున్ది. ధ్యానించే నివే, ధ్యానింపబడే నేను, ధ్యానం అనే క్రియ వేరే వేరేగా కాక సర్వగతమైన చైతన్యం అనుభవం అవుతుంది.
4. ఇతరుల దోషాలు ఎంచకు. ఆలా చేస్తే భగవంతుడు నీ దోషాలు ఎంచుతాడు. సాటివారిని కొద్దిగా నిందించినా, నరకంలో శిక్షలు తప్పవు.
5. సుఖదు:ఖాలు మనోకల్పితాలు. సర్వం ఈశ్వర మయము అని, ఈశ్వర ప్రసాదం అని తలచేవాడు ఏ పరిస్తితిలో అయినా ఆనందంగా ఉంటాడు.
6. చేసిన కర్మకు అనుభవించక తప్పదు. కష్టాలకు భయపడి ముందే చావాలి అనుకుంటే, చేసిన పాపాలకు తోడు ఆత్మహత్య పాతకం కూడా తోడు అవుతుంది.
7. అర్హత లేని వారికీ ఆత్మజ్ఞానం లభించదు . లౌకిక విషయాల పైన మోహం నశిస్తే కానీ ఆత్మజ్ఞానం లభించదు.
8. జ్ఞానం కావాలంటే, పంచ ప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ది, అహంకారము -- విటన్నిటిని భగవంతుడికి సమర్పించాలి.
9. సద్గురువు మిద ప్రీతీ పెరిగిన కొద్ది, భక్తులకు ధనమ్ మిద ప్రీతీ తగ్గుతుంది.
10. నా వద్దకు ఎవరు వారికి వారు రాలేరు. నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను.
11. నా వద్దకు మొదట అందరు కోర్కెల తోనే వస్తారు. కానీ, కోరికలు తీరి ఒక స్థాయికి వచ్చాక, నన్ను అనుసరించి మంచి మార్గానికి వస్తారు.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.

0 comments:

Post a Comment