Total Pageviews

Tuesday, July 5, 2016

ఆమె వాల్వు మార్పిడి గురించి బాబా కు తెలుసు

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
(రాబోయే రెండు లీలలలో సునీతను బాబా వాల్వు మార్పిడి ఆపరేషన్ సమయంలోనూ, ఆ తరువాతా ఎలా కాపాడారో చదువుతాము)
సునీతా అరోటే తన భర్తతోనూ కూతురుతోనూ బొంబాయిలో నివసిస్తుండేది. కొంతకాలంగా ఆమె బాగా అలసిపోతోంది మరియూ ఊపిరి తక్కువవుతోంది. పరీక్షలకోసం ఆమె బొంబాయిలోని ఒక ఆసుపత్రిలో చేరింది. సంపూర్ణమైన పరీక్షల అనంతరం అక్కడి వైద్యులు ఆమె భర్తతో సునీతకి గుండెకి సంబంధించి ఎడమవైపు వాల్వు సరిగా పనిచేయడం లెదనీ, దానిని మార్చాల్సి వుంటుందనీ చెప్పారు. అయితే ఆమె ప్రస్తుతమున్న పరిస్థితులలో వాల్వుమార్పిడి ఆపరేషన్ వలన ప్రమాదముందనీ, కానీ ఎంత తొందరలో చేస్తే అంతమంచిదనీ చెప్పారు.
సునీత భర్త ఈ వార్త ని ఆమెకి చాలా సున్నితంగా చెప్తూ జాగ్రత్తగా చూసికోడానికి బాబా వున్నారని విశ్వాసాన్ని కలిగించాడు. సునీత కన్నీరు మున్నీరయ్యింది, కానీ నిర్ణయం తీసికోక తప్పని పరిస్థితులలో వాల్వుమార్పిడి చికిత్సకి తేదీని నిర్ధారించారు. రెండురోజుల ముందు ఆసుపత్రిలో చేరింది. తనతో పాటుగా చిన్న సైజు బాబా ఫొటోగ్రాఫ్ తెచ్చుకుంది. మంచం పక్కనే వున్న బల్లమీద ఆ ఫోటోని పెట్టుకుంది. బాబా విభూతిని తెచ్చుకుంది. అష్టోత్తర శతనామావళి ని కూడా తెచ్చుకుంది. అష్టోత్తర శతనామావళి ఆమె ప్రతిరోజూ చదుగుతుంది.
ఆపరేషన్ కి ముందురోజు రాత్రి ఆమె ఒక స్పష్టమైన స్వప్నాన్నిగాంచింది. ఎందరో రోగులున్న అతి పెద్ద వార్దులో ఆమె ని చేర్చారు. అక్కడ ఎందరో వున్నారు, అందరినీ ఆమె నిశ్సబ్దంగా గమనిస్తోంది. ఇంతలో ఒక ఎనిమిది సంవత్సరాల బాలుడు ఆ జనాన్ని దాటుకుంటూ ’ఇక్కడ షిరిడీనుండొచ్చిన అరోటే ఎవరు’ అని అరుచుకుంటూ వచ్చాడు. సునీత వివాహానికి ముందు షిరిడీలో వుండేది. అందువలన ఆమె చేయెత్తి నేనే షిరిడీనుండొచ్చిన అరోటేను. అంది.  అప్పుడు ఆ కుర్రవాడు ’బాబా నన్ను పంపించారు. నీకు ఏ వాల్వు మార్చాలి, కుడిదా? ఎడమదా?’ అని ప్రశ్నించాడు. ఆమె జవాబు విన్న వెంటనే అంతే వేగంగా ఆ కుర్రవాడు వెళ్ళిపోయాడు. ఆమె భర్త వచ్చినప్పుడు ఆమె తన స్వప్నానుభవం గురించి అతనితో చెప్పింది. అతనామెకి బాబా కి ఆమె ఆపరేషన్ గురించి పూర్తిగా తెలుసునని నమ్మకాన్ని వ్యక్త పరిచాడు. అప్పుడు సునీతకు బాబా తనతో ఎప్పుడు వుంటాడనీ తనకు అపకారం జరగదనీ విశ్వసించింది.
ఆపరేషన్ జరగాల్సిన రోజు ఉదయాన్నె లేచి బాబా ని ప్రార్దించింది. అష్టోత్తర శత నామావళి చదువుకుంది. బాబా ఉనికి అనే సుగంధం తో ఆమె గదంతా పరిమళించసాగింది.  బాబా తనతోనే ఆ గదిలో వున్నారని సునీత విశ్వసించింది. ఆమె ఆపరేషన్ విజయవంతమైందని వేరేగా చెప్పాలా?
సాయిప్రసాద్ పత్రిక (దీపావళి సంచిక) 1998.
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 8270077374

బాబా మళ్లీ మళ్ళీ హనుమాన్ చాలీసా పఠించమన్నారు

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
న్యాయవాది ఎస్ సుబ్బారావు 1946 జూలై పదిహేడవ తేదీన మరల అస్వస్థతకి గురయ్యారు. ఉదయం నిద్రనుండి లేవడమే జ్వరంతో లేచాడు. అంతకు ముందురోజు కూడా వంట్లో బాగుండక పోవడం వలన కేవలం ద్రవ ఆహారమే తీసికున్నారు. ఆ రాత్రి నిద్రపోయేముందు బాబాని ధ్యానించి బాబా కృపనర్దించాడు. బాబా ఆయన ప్రార్దనని మన్నించి స్వప్న సాక్షాత్కారమిచ్చి హనుమాన్ చాలీసాను మళ్ళీ మళ్ళీ పఠిస్తూ వుండమన్నారు. ఒక్కో హనుమాన్ చాలీసా పఠనం పూర్తవగానే సుబ్బారావు కొద్ది కొద్దిగా నెమ్మళించసాగాడు. మొత్తము మీద ఆరోజు చివరి సారి హనుమాన్ చాలీసా పఠనం పూర్తయే సరికి సుబ్బారావు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది.
పద్దెమిదవ తేదీ రాత్రి మళ్లీ బాబా స్వప్న దర్శనమిచ్చారు. స్వప్నంలో బాబా మరియూ సుబ్బారావు ఒకచోట జరిగే డిన్నర్ పార్టీకి అహ్వానించబడ్డారు. బాబా ఒక న్యాయవాది రూపంలొ సుబ్బారావు పక్కనే కూచుని సుబ్బారావు క్షేమాన్నడుగసాగారు. బాబా సుబ్బారావుని హనుమాన్ చాలీసా ను పఠించవలసిందిగా ప్రోత్సహించసాగారు. బాబా చూపిన ప్రేమాభిమానాలకి సుబ్బారావు చలించిపోయాదు. బాబా తనకి ఎదురైన చిన్నా పెద్దా సమస్యలను తొలగించారని సుబ్బారావు చెప్పుకొచ్చాడు. బాబా మరియూ హనుమంతుడు వేర్వేరు కాదనీ, ఒక్కరే అనీ పై స్వప్న దర్శనం ద్వారా ఋజువైందని సుబ్బారావన్నాడు.
ఇక్కడొక ఆసక్తికరమైన ఉపాఖ్యానం గుర్తుకు వస్తోంది. శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం లోని నలుబై అయిదవ అధ్యాయంలో ఈ ప్రస్తావన వస్తుంది. రామనామ ధ్యానం లో లీనమైపోయిన హనుమంతులవారిని శ్రీపాద శ్రీ వల్లభులు కలుస్తారు. వారిరువురి నడుమ ఈ దిగువ సంభాషన జరిగింది. శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతము నుండి యధాతధంగా ఆ సంవాదాన్ని పఠితుల సౌకర్యార్దము ముందుంచుతున్నాను. ’నాయనా! అగ్ని బీజమైన ’రాం’ అనుదానిని ఎన్నికోట్లసార్లు జపించితివో లెక్కకే అందుటలేదు. ఎంతటి స్వల్ప కాలమైనను కూడా అంత స్వల్పకాలంలో కూడా ’రాం’ భీజమును ఉఛ్ఛరించుచుంటివి. నీ లెక్క వ్రాయుటకు చిత్రగుప్తుల వారే తేల్ల మొగము వేయుచున్నారు. మహా అనంతమైన మహా శూన్యకాలమున కూడా కోటానుకోట్ల రామ నామమును ఉఛ్ఛరించుచున్నావు. అందుకే నీవు కాలాతీతుడవైనావు. కాలాత్మకుడవైనావు. నీ వయస్సు ఎన్ని లక్షల సంవత్సరములని వ్రాయటకు చిత్రగుప్తునికి తోచుట లేదు. ఈ కలియుగమున ఒక పర్యాయము నీవు అవతారము ధరించవలెను. ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపజేయు సమర్ధుడవగుటచే నీవు సాయీ నామమున విఖ్యాతుడువయ్యెదవు గాక’ అన్నారు శ్రీ పాద శ్రీ వల్లభుల వారు.
అందుకు హనుమ ’ప్రబూ! ’రాం’ బీజము అగ్ని బీజమే, నాకు అగ్ని సిద్ధి అయిన మాటయూ వాస్తవమే! నేను అగ్ని యోజనమున పరిపూర్ణుడనైతైననినదియునూ వాస్తవమే! దేహబుద్దిచేత నేను మీ దాసుడను. జీవబుద్ధి చేత మీ అంశమును. ఆత్మ బుద్ది చేత మీరే నేనయి వున్నాను. నేను ఏ రూపమున అవరతింపవలయునో తెలియజేయవలసింది’ అని వేడుకున్నాడు. శ్రీ పాదుల వారు మందహాసంతో ఇట్లనిరి ’నీవు శివాంశ సంభవుడైననూ రామభక్తుడవయితివి. భళీ! అరబ్బీ భాషలో అల్ అనగా శక్తి. అహ్ అనగా శాక్త, శక్తిని ధరించిన వాడు. అందుచేత అల్లాహ్ అనగా శివ శక్తుల సంయుక్త స్వరూపమని అర్దము. ఇంతకాలమూ జానకీ వల్లభ రూపమున నన్ను ఆరాధించిన నీవు మ్లేఛ్ఛజనులకు అంగీకారయోగ్యమైన, శివశక్తి స్వరూపమైన అల్లా నామమును స్మరించుచూ నన్ను శివశక్తిగా ఆరాధించుము’.అంతట హనుమ ఇట్లనెను “ప్రభూ! నాకు భరధ్వాజ మహర్షి త్రేతాయుగమున సవితృకాఠక చయనమును పీఠికాపురమున చేసెదననునది తెలియును. ఆనాడిచ్చిన వరము వలన మీరు భరద్వాజ మహర్షి గోత్రమున జన్మించిన విషయమునూ తెలియును. నేను మీ నుండి ఎట్టి పరిస్థితులలోనూ విడిపోయి ఉండదలుచుకోలేదు. మీ గోత్రమే నా గోత్రము కావలెను. నేను మీ బిడ్డను కాదా’ ఆన్నాడు.
అంతట శ్రీ పాదుల ’నాయనా! హనుమా! నీవు ధరించు దేహము భారద్వాజ గోత్రమునందే కలుగును గాక’ అనిరి. హనుమ మరల ఇట్లనెను ’అల్లామాలిక్! అనగా అల్లాయే యజమాని అని అర్దము’ శ్రీ పాదుల వారు హనుమను కౌగలించుకొనిరి, ’హనుమా! నీవు దేహబుద్దిని వీడుమ, నీవు నా అంశవు’. అనెను. అంతట హనుమ ’ప్రభూ! నేను మీ అంశనని అంగీకరించుచున్నాను. అయితే అంశావతారాలు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తర్వాత మూల తత్త్వములో కలిసి పోవును. అప్పుడు అంశావతారములకు విలువయే లేకుండా పోవును. అందువలన నేను ధరించెడ అంశావతారము మూల తత్త్వముతో నిరంతరమూ కలిసియుండియూ, ఆది మూలమైన మీ తత్త్వములోని శక్తి సంపద అంతయును ధరించి ఉండవలెను’ అని విన్నవించుకున్నారు. అంతట శ్రీ పాదుల వారు’ నాయనా! హనుమా! నీవు కడుంగడు బుద్ధిమంతుడవు. ఏ శక్తి ప్రాభవములు నా యందుకలవో అవన్నియునూ నీ యందు కూడా నెలకొనియుండుగాక. నేను నృశింహసరస్వతి రూపమున శ్రీశైలము నందలి కదళీ వనములో గుప్తముగా మూడువందల సంవత్సరములు యోగ సమాధిలో వుండెదను. అంతట ప్రజ్ఞాపురమున స్వామి సమర్ధుడనెడి పేరుతో విఖ్యాతుడునయ్యెదను. నేను శరీరము వదిలెడి సమయము ఆసన్నమైనప్పుడు, సాయి రూపమున వున్న నీలోనికి అవతరించెదను, సుస్పష్టముగా నా అవతారము నీలొ వున్నదని ప్రకటించెదను. నీవు నాయొక్క సర్వ సమర్ధ సద్గురు అవతారముగా విఖ్యాతి నొందెదవు’ అని ఆశీర్వదించిరి. ’ప్రభూ! దేహబుద్దితో మీ సేవకుడను కావున అల్లా మాలిక్ అని సంచరించెదను. జీవాత్మ బుద్దితో మీ అంశనై గురుస్వరూపమున ప్రవర్తిల్లెదను. కానీ శ్రీ చరణులు దత్త ప్రభువులు కదా! మీకునూ,నాకునూ అంతరముండుట భావ్యమా? నేను మీరుగా, మీరే నేనుగా మారిన యెడలనే కదా అద్వైతము సిద్ధించును. అందువలన మీరు నాకు దత్త సాయిజ్యమును ప్రసాదింపుడు’ అని హనుమ వేడుకొనెను.
శ్రీ పాద శ్రీ వల్లభుడు కాల పురుషుని తమ వద్దకు హాజరు కావల్సిందని శాసించిరి. కాల పురుషుడు చేతులు కట్టుకుని నిలబడి యుండేను. అంతట శ్రీ మహా ప్రభువులు ’కాల పురుషా! ఈ హనుమ, కాల పురుషుడవైన నిన్ను అధిగమించి కాలాతీతుడైనాడు. ఇతనికి నా సాయిజ్యమును ప్రసాదించదలిచితిని. ఇతనికి నాధ శబ్దమును కూడా ఇచ్చుచున్నాను. ఇంతటినుండీ ఇతడు సాయినాధుడని పిలువబడు గాక. నేడు దత్తజయంతి గా నేను నిర్ణయించుచున్నాను. హనుమలో చైతన్యమును తదనుగుణముగా మార్చి దత్తస్వరూపము చేయవలసింది’ అని ఆజ్ఞాపించిరి.
సుబ్బారావు అనుభవము సాయిసుధ సంపుటి: 7, భాగం: 4 సెప్టెంబరు 1946 నుండి (శ్రీ పాద, హనుమల సంవాదం శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతము, అధ్యాయం: 45 యధాతధముగా)
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి

source from  http://saileelas.com/telugu/2016/07/04/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE-%E0%B0%AE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80-%E0%B0%AE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%80-%E0%B0%B9%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D/

స్వప్న దర్శనంలో విభూతిని తినమని బాబా అతనికి చెప్పారు

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
1942 జూన్ మాసం లో గూటికి చెందిన న్యాయవాది ఎస్. సుబ్బారావు తరచు విపరీతంగా తల తిరిగేది. ఈ కారణం చేత ఎక్కడైనా ఎప్పుడైనా పడిపోయే పరిస్థితి ఏర్ఫడింది. అరవై ఆరు సంవత్సరాల వయసులో ఇలా జరగడం వలన బయటకు వెడితే పడిపోతారేమొనని భయపడాల్సివచ్చింది. కర్రపట్టుకుని నడిచే ప్రయత్నం చేద్దామనుకున్నారు, కానీ అదికూడా రెండుమూడు సార్లు కర్రవున్నా రోడ్డుమీద పడడంతో పనిచెయలేదు. దాంతో సుబ్బారావు తను ఇంటికే పరిమితం అయిపోవాల్సివస్తుందని భయపడ్దారు. పరిస్థితి 1946 జూలై 4 నాటి రాత్రికి విషమించింది. అతను ఇంట్లో పడుకునివుండగా విపరీతంగా తలతిప్పింది. తను బయటకు పోవడానికి భయపడుతూ వుండడంతో బాబా ను మనస్పూర్తిగా ప్రార్దించాడు,
తెల్లవారుఝామున బాబా స్వప్న దర్శనమిచ్చారు. బాబా న్యాయమూర్తిగా ఒక ఎత్తైన ఆసనం మీద కూర్చుని వుంటే సుబ్బారావు ఆయన ముందు నిలబడి వున్నాడు. బాబా సుబ్బారావుకి ఒక పెద్ద విభూతి ప్యాకెట్టు ఇచ్చి దానిని పెద్ద సంఖ్యలో తినమన్నారు. ఆ తరువాత సుబ్బారావు ఇంటికి తిరిగి వస్తూండగా ఒకభక్తుడు అతనికి ఒక చిన్న విభూతి పొట్లం ఇచ్చాడు. ఆ విభూతి పొట్లాన్ని ఆ భక్తుడు సుబ్బారావు పై జేబులో పెట్టాడు. సుబ్బారావుకి ఈ స్వప్నం వలన అర్దం అయినదేమిటంటే విభూతి ని అత్యధికంగా వాడితే తన తలతిప్పువ్యాధి తొలగిపోతుందని. అప్పటినుండి తన జేబులో చిన్న విభూతి పొట్లాన్ని సుబ్బారావు వుంచుకునేవాడు. సుబ్బారావు కోలుకున్నాడు తన పనులకి హాజరవసాగాడు.
సాయ సుధ, సంపుటి:7, భాగం: 4, సెప్టెంబరు 1946.
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com, csai@saimail.com.
whatsapp 7033779935, 9178265499
Voice call: 9437366086, 8270077374