Total Pageviews

Thursday, March 24, 2016

అమృతతుల్యమగు బాబా పలుకులు......

దయాదాక్షిణ్యమూర్తి అయిన సాయిబాబా అనేకసార్లు మసీదులో ఈ క్రింది మధురవాక్యాలు పలికారు. "ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు. నేను లేక ఈ జగత్తు అంతా వారికి శూన్యం, నా కథలు తప్ప మరేమీ చెప్పరు, సదా నన్నే ధ్యానం చేస్తారు. నా నామాన్నే ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారు. ఎవరైతే సర్వస్యశరణాగతి చేసి, నన్నే ధ్యానిస్తారో వారికి నేను ఋణగ్రస్తుడిని, వారికి మోక్షాన్ని యిచ్చి వారి ఋణం తీర్చుకుంటాను. ఎవరయితే నన్నే ధ్యానిస్తూ నా గురించే దీక్షతో ఉంటారో, ఎవరయితే నాకు అర్పించనిదే ఏమీ తినారో అలాంటివారిపై నేను ఆధారపడి ఉంటాను. ఎవరయితే నా సన్నిధానానికి వస్తారో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోతారు. కాబట్టి నీవు గర్వం అహంకారం లేశమైన లేకుండా, నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్యశరణాగతి వేడుకోవాలి. ఓం సద్గురు సాయిరాం ॐ 🌿

Wednesday, March 23, 2016

ఎంతెంత దయ నీది ఓ సాయి

ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
తొలగించినావు వ్యాధులు ఊధితో
వెలిగించినావు దివ్వెలు నీటితో
తొలగించినావు వ్యాధులు ఊధితో
వెలిగించినావు దివ్వెలు నీటితో
నుడులకు అందవు నుతులకు పొంగవు
నుడులకు అందవు నుతులకు పొంగవు
పాపాలు కడిగేసే పావను గంగవు
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
భక్త కబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు
భక్త కబీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు
అణువున నిండిన బ్రహ్మాండంలా...ఆ..
అణువున నిండిన బ్రహ్మాండంలా
అందరిలో నీవే కొలువున్నావు
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ప్రభవించినావు మానవమూర్తివై
ప్రసరించినావు ఆరని జ్యోతివై
ప్రభవించినావు మానవమూర్తివై
ప్రసరించినావు ఆరని జ్యోతివై
మారుతి నీవే గణపతి నీవే
మారుతి నీవే గణపతి నీవే
సర్వదేవతల నవ్యాకృతి నీవె
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి
నిన్ను ఏమని పొగడను సర్వాంతర్యామి
ఎంతెంత దయ నీది ఓ సాయి
ఎంతెంత దయ నీది ఓ సాయి

జ్ఞానదీపాలు వెలిగించే సాయిబాబా...

మనం నిత్యం సత్యాన్నే వెంటపెట్టుకుని ఉండాలి. భగవంతునికి ఏదైనా సమర్పించాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా, భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో సహృదయంతో మెలగాలి. బాబాకు సేవ చేస్తున్నామనే ఆలోచన మనసులోకి రానివ్వకూడదు.
సాయిబాబాకు దీపాలంకరణ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ ద్వారకామాయిలో నూనె దీపాలు వెలిగించి దేదిష్యమానం చేస్తూ ఉండేవారు. అందుకు అవసరమైన నూనెను షిర్డీలోని దుకాణదారులను అడిగి తెచ్చుకునేవారు. కొద్ది రోజులకు వ్యాపారుల్లో దుర్భుద్ధి ప్రవేశించి రోజు బాబాకు ఉచితంగా నూనె ఎందుకు ఇవ్వాలి? అనుకున్నారు. బాబా యథావిధిగా వ్యాపారుల వద్దకు వెళ్లి నూనె అడిగారు. ఎవ్వరూ ఇవ్వలేదు. తమ వద్ద నూనె లేదని చెప్పారు. నూనె లేదు కాబట్టి బాబా ఏం చేస్తారో చూడాలనే కుతూహం వారిలో కలిగింది.
బాబా ప్రతిరోజు నూనె తెచ్చుకునే డబ్బాలో నీళ్లును పోసి బాగా కలియత్రిప్పి ఆనీటిని నోటిలోకి తీసుకుని పుక్కిలించి తిరిగి ఆ డబ్బాలోకి పోశారు. ఆ నీటిని ప్రమిదల్లో పోసి దీపాలు వెలిగించారు. రాత్రంతా అవి జ్ఞానప్రకాశాలను విరజిమ్మాయి. ఇదంతా చూసిన వ్యాపారుల కళ్లకు అజ్ఞానపు చీకట్లు ఆ వెలుగులో తొలగిపోయాయి. క్షమించమంటూ బాబా కాళ్ళపై పడ్డారు. అబద్దాలు ఆడవద్దని, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకవలెనని చెప్పి బాబా వారిని పంపించారు.
నిజానికి సూర్యాచంద్రులనే ఆకాశ దీపాలుగా నిలిపిన మహిమాన్వితుడికి నూనె దీపాలు వెలిగించటం ఓ లెక్కా? బాబా దీపాలు వెలిగించాలంటే నూనె అక్కర్లేదు. సంకల్పం చాలు. కానీ, మానవావతారంలో నడిచిన దైవం బాబా. అందుకే మామూలు మనిషిలా నటించి ఎలా బతుకుతాడో జీవించి చూపారు.
బాబా భక్తుల్ని సన్మార్గంలో పెట్టటానికి, వారి పాపాలు, కర్మల్ని ధ్వంసం చేసి మానవజన్మను చరితార్థం చేయడానికి అవతరించిన దివ్య పురుషుడు. మనం భగవంతునికి భక్తితో పాటు ప్రేమను కూడా అర్పించాలి. నిజానికి మనం అడగదల్చుకున్నవన్నీ గ్రహించి కోరకుండానే అనుగ్రహించి భగవంతుడికి మనం అర్పించుకునేది పరిపూర్ణ భక్తిని మాత్రమే. దానిని శ్రద్ధ, విశ్వాసాలతో పాటించటం ముఖ్యం.
ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ్

Monday, March 21, 2016

సాయిబాబా కటాక్షం కోసం ప్రమిదలు వెలిగిస్తే...


షిరిడీ సాయినాధునికి నూనెతో దీపాలు పెడితే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని జ్యోతిష్యనిపుణుల చెబుతున్నారు. పూర్వం ప్రతిరోజూ సాయంత్రం ద్వారకామాయిలో సాయిబాబా దీపాలను వెలిగిస్తుండేవాడు. ఊరిలో ఉన్న వ్యాపారస్తుల వద్దకు వెళ్ళి, భిక్షాటన చేసి, ఆ నూనెతో దీపాలను వెలిగించే వారు. అయితే ఒకరోజు వ్యాపారస్తులందరూ కలిసి బాబాకు నూనెను ఇవ్వడాన్ని మానుకున్నారు. బాబా నూనె కోసం వస్తే అందరూ నూనె లేదని చెప్పడం ప్రారంభించారు. ఈ విషయం గమనించిన బాబా నిరాశ చెందకుండా ద్వారకామాయికి చేరుకున్నారు. కుండలోని మంచినీటిని తీసుకుని గిన్నెలో పోసి, ఆ నీటిని ప్రమిదలలో పోసి దీపాలను వెలిగించారు. ఇది గమనించిన వ్యాపారులకు, సాయిబాబాను పరీక్షించాలనుకున్న కొందరు ప్రజలకు, సాయిబాబా దైవాంశభూతుడన్న నమ్మకం ఏర్పడింది. బాబా ఎప్పుడూ నూనెతోనే మసీదులో దీపాలను వెలిగించేవారు. కిరోసిన్ దొరికేది కానీ, ఏరోజు కూడా బాబా కిరోసిన్‌తో మసీదులో దీపాలను వెలిగించలేదు. నూనెతో వెలిగించిన దీపాలు స్థిరంగా ఉండి వెలగడంతోపాటు, వాటి వెలుగు శాంతంగా, ఆహ్లాదకరంగా ఉండి భక్తుడి మనస్సును ఏకాగ్రతతో భగవంతుడిపైన కేంద్రీకరించడానికి వీలు ఉండటం వల్ల, బాబా ఎప్పుడూ నూనెతోనే దీపాలను వెలిగించేవారు. అందుచేత ప్రతి గురువారం నూనెతో దీపారాధన చేసి సాయిబాబాను ప్రార్థించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఇంకా సాయిబాబా కటాక్షం కోసం గురువారం సాయంత్రం నూనెతో గానీ, నెయ్యితో గానీ దీపారాధన చేస్తే సఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.

Wednesday, March 2, 2016

ఇది ఆపదలో... కష్టాలలో వున్న జీవితానికి భరోసా ఇచ్చి వెలుగుదారిన నడిపిన సద్గురువుల కృపను తెలిపే లీల.

ఇది ఆపదలో... కష్టాలలో వున్న జీవితానికి భరోసా ఇచ్చి వెలుగుదారిన నడిపిన సద్గురువుల కృపను తెలిపే లీల. తన జీవితములో సమర్ధసద్గురువు సాయినాధుడు చూపిన అనుగ్రహాన్ని శ్రీమతి ఝాన్సీలక్ష్మీభాయి గారు తన మాటలలోనే వివరిస్తున్నారు.

1984 నాజీవితములో చీకటినినింపిన సమయము. నాభర్త ఆర్మీలో మెకానికల్ సెక్సన్ లో పని చేస్తూమమ్మల్ని దు:ఖసాగరం లో ముంచి సుదూర లోకాలకు తరలిపోయారు. చిన్నపిల్లలు.ఒక అబ్బాయి.ఇద్దరు అమ్మాయిలు. చిన్నపిల్లలను తీసుకుని నేను మా పుట్టిల్లు గిద్దలూరు చేరాను. మా అమ్మ్గగారిల్లు స్టేషన్ దగ్గరే. పిల్లలను సముదాయిస్తూ నాలో నేను కుమిలి పోతూ గడుపుతున్న రోజులవి.మామూలు మనిషిని కాలేక పోతున్నాను. కానీ పిల్లలభవిష్యత్తు కోసము నన్ను నేను సమాధానపరుచుకొని బ్రతకవలసి వస్తున్నది. ఇంకా ఉద్యోగము కూడా ఇవ్వలేదు ఆర్మీ వాళ్ళు.

అలాంటీ రోజులలో ఒకరోజు గది లో విచారంగా నాలోకములో నేను వున్న సమయములో ఒక గొంతు హిందీ లో ఏదో అడుగుతున్నది. బయట మా పిన్ని గారు ఏదో చెబుతున్నట్లుగావుంటే బయటకు వచ్చాను. ఒక భిక్షుకుడు మావాల్లను టీ కావాలని అడుగుతున్నాడు.వాళ్లకు హిందీ అర్ధం కాక ఏమిటని అడుగుతున్నారు. ఆ కారం చూస్తే పాతగుడ్దలతో సాయిబాబా లా వున్నారు. కానీ నాకప్పటికి సాయిగురించి పెద్దగా వివరాలు కానీ ,భక్తి కానీ లేవు. కాకుంటే యాచిస్తున్నాడు కదా అని ఉండు మాయింట్లోవున్నాయి పెట్టిస్తాను అనిలోపలకు పోబోయాను. మరి నాకిస్తే అక్కడ నాకోసం కాచుకున్నవారికి కావాలికదా? కనుక కొద్దిగా టీపొడిఇవ్వు అన్నాడు. తెచ్చి ఇచ్చాను.మరి చక్కెర కావాలి కదా? అన్నాడు.కొద్దిగా పొట్లం కట్టి తెచ్చాను. బేటీ ఇవి కాగపెట్టాలి కదా ఒక చిన్న గిన్నెఇవ్వు అన్నాడు.తెచ్చి ఇస్తున్నాను.మా సంభాషణ హిందీ లో సాగుతున్నా మా పిన్ని కి అర్ధమవుతున్నందున పాలువద్దా అన్నది వెటకారం గా. వద్దు మేము డికాక్షన్ కాచుకుని తాగుతాము అన్నాడాయన.వెళ్ళి పోయాడు.

మరలా ఒక అర్ధగంటకు వచ్చి నేనిచ్చిన పాత్ర తిరిగిచ్చాడు. మా ఆవిడకు కావాలి ఒక చీర ఇవ్వు అన్నాడు. ఒక చీర దండెం మీదనుంచి తెచ్చి ఇచ్చాను. అప్పూడు నెనొక్కదాన్నే వున్నాను. ఆయన నన్ను చూస్తూ నువ్వు నాకోసం ఇన్నిచ్చావుకదా ? మరి నెను కూడా నీకు ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. నాకేమొద్దు లే వెళ్ళు అన్నాను[మనసులో కొద్దిగా భయం. ఈ సన్యాసులు లాంటివాళ్ళు ఏమి మోసము చేస్తారో అని.] కాదు ఇదిగో చూడు తీసుకోఅని ఆయన నాచేతిలో తనగుప్పిటనుంచి ఏదో పెట్టాడు. నాకసలే భయం గావుంది. కానీ మాట్లాడ లేకపోతున్నాను. అమ్మ నువ్వు దీన్నిక్కడ వద్దు లోపలికెళ్ళీ నీ దేవుని మందిరం లోపెట్టి చూడు అన్నాడు. లోపలకెళుతూ గుప్పిటవిప్పాను. గుప్పున పూలపరిమళం గుభాళించింది. చేతిలో పూలు. చూసావా అన్నారు. ఏమీ లేవు పూలు అన్నాను నేను పెద్దగా .కాదు పూలకింద వున్నదాన్ని చూడు నిన్ను రక్షిస్తుంది దాన్ని భద్రంగా దాచుకో అని పెద్దగా చెప్పాడాయన. ఇదేదో మాయలాగున్నది ఇదినాకొద్దు నీది నువ్వే తీసుకో అని చెప్పి ఇద్దామని బయటకొచ్చాను. కానీ అక్కడాయన లేరు. ఒకవేళ మళ్ళా స్టేషన్ వైపు వెళ్లాలన్న కనీసం రెండు నిమిషాలు పడుతున్నది. కానీ కనుచూపు మేర ఆయన కనిపించలేదు.గుప్పిటలో ఒక తాయెత్తులాంటి వస్తువు వున్నది భయం తో దాన్ని తీసుకెళ్ళీ దేవునున్పటాలముందు పడవేశాను.

ఆ తరువాత మనసుకు కాస్త ఉపశమనముగాను జీవితము మీద పిల్లలమీద ప్రేమ పెరిగాయి బాధ్యతలు నిర్వర్తిమ్చగలననే గుండెనిబ్బరము పెరిగాయి. తరువత గుర్తుకొచ్చి ఎన్ని సార్లు వెతికినా ఆమహాను భావుడిచ్చిన తాయెత్తు కనపడలేదు. వారు సాయిబాబా అనే నమ్మకము నాకుకలిగినది. తరువాత వారిని పూజించసాగాను. నాకు ఆర్మీ లోనే యు.డి,సి. గా పోస్ట్ ఇచ్చారు. సికిందరాబాద్ లోనే పనిచేస్తున్నాను. ముగ్గురు పిల్లలు పెద్దవాల్లయి దేశరక్షణ కోసం వున్నారు. ఇద్దరికి పెళ్ళిల్లు చేశాను. నా ఇష్టదైవమయిన లలితాదేవితో పాటు,సద్గురువు సాయినాధుని గురువుగా మార్గదర్శకునిగా సేవిస్తుంటాను.......

నను దీవించు సాయి! నను దీవించు సాయి

🌹🌻🌹ఓం శ్రీ సాయి నాథాయనమః 🌹🌻🌹
నను దీవించు సాయి! నను దీవించు సాయి
నీ శిశువును దీవించు సాయి
నా మొరలను వినుము
నాలో భక్తిని స్దిరపరచుము సాయి
నను దీవించు సాయి! నను దీవించు సాయి
నా భాదలు తీర్చుము సాయి
ఆనందము నాలో చిలుకుము
నా పాపాల ప్రార్ధన వినుము సాయి
నన్ను దీవించు సాయి! నను దీవించు సాయి
సాయి నామమే జీవనము సాయి స్మరణమే ప్రార్ధనము
సాయి ఆరాదనలే ఆనందము సాయి పలుకులే కీర్తనము
సాయి దర్శనమే భాగ్యము సాయి లోకమే స్వర్గము సాయి
నను దీవించు సాయి! నను దీవించు సాయి
సాయి నామమే పలకరించుట తృప్తి
సాయి మార్గము ఆచరించుటే మనఃశాంతి
సాయి రూపమే భగవంతున్ని ఆవతారము
సాయిరామే అంతము సాయిరామే విశ్వము
సాయిరామే కరుణామూర్తి సాయిరామే వివేకస్పూర్తి సాయి
నను దీవించు సాయి! నను దీవించు సాయి
సాయియే సత్పవర్తన సాయియే మోక్షమార్గము
సాయియే కర్తవ్యం సాయియే పరమ సత్యము
సాయియే యేసుక్రీస్రు సాయియే హిందుమనుజుడు
సాయియే ఇస్లాం దేవుడు సాయియే అంతరాత్ముడు సాయి
నను దీవించు సాయి! నను దీవించు సాయి
సాయియే బ్రహ్మ విష్ణు స్వరూపుడు
సాయియే నిరాడంబరుడు సాయియే మాతా పితా గురుదేవుడు
సాయియే ప్రాణ జీవుడు,సాయియే ఆత్మారాముడు సాయి
నను దీవించు సాయి! ననుదీవించు సాయి
ఓం శ్రీ సాయిరాం
🌹👏 ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ్🌹👏
🌹👏 ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ్🌹👏
🌹👏 ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ్🌹👏 ...

సాయి నామంతో సుఖశాంతులు....!!

భగవంతుని పట్ల మనం ఎంత ఆరాధనాభావంతో ఉండాలో, వినయవిధేయతలు చూపాలో షిర్డీ సాయిబాబా స్వయంగా ఆచరించి చూపారు. దేవునికి వినమ్రంగా చేతులు జోడించాలని, మనల్ని మనం అర్పించుకోవాలని చెప్పేవారు బాబా.
సాయిబాబా అపూర్వ శక్తిసంపన్నుడు అయ్యుండీ తాను దైవాన్ని అని ఎన్నడూ చెప్పుకోలేదు. దేవుడు తనకు అప్పగించిన కార్యాలను నిర్వహించడానికి వచ్చానని చెప్పేవారు. భగవంతుని పట్ల అంతులేని ప్రేమను, వినయాన్ని ప్రకటించేవారు. సృష్టిలో దైవాన్ని మించింది ఇంకేదీ లేదని నిగర్వంగా చెప్పేవారు.
ఒక సందర్భంలో సాయిబాబా "నేను బానిసల్లో బానిసని. నీకు ఎంతగానో రుణపడి ఉన్నాను. నీ అపురూపమైన దర్శనంతో ఎనలేని ఆనందం కలుగుతోంది. సంతృప్తి చెందుతున్నాను. నీ పాదసేవ చేసుకోవడం నా అదృష్టం. ఈ భాగ్యాన్ని నాకు ఎన్నడూ దూరం చేయకు..." అన్నారు.
సాయిబాబా తన నడవడినే మనకు ఆదర్శంగా చేసి చూపారు. మనం ఆయన్ను అనుసరించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఒక్కరోజులో సర్వం వంటబట్టకున్నా క్రమక్రమంగా ఒక్కో లక్షణాన్నీ అలవరచుకోవచ్చు.
భగవంతునికి లేని సంపదలు అంటూ లేవు. ఆయన జ్ఞానానికి, కీర్తికి ఆకాశమే కొలమానం. దేవుడు మహా మహిమాన్వితుడు. భగవంతునికి ఏ ఒక్కరిమీదా ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉండవు. కానీ అందరిమీదా ఔదార్యం చూపిస్తాడు.
మనం ఈ లోకలో అడుగుపెట్టింది జలసాలు, విలాసాలతో కాలక్షేపం చేస్తూ, సమయాన్ని వ్యర్ధం చేసుకోడానిక్కాదు. భగవన్నామస్మరణతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భక్తులు, భగవంతుని చేరుకునే మార్గం సులభమైందేమీ కాదు. అది కొంచెం కష్టంతో కూడుకున్నదే. అభ్యాసంతో తేలికౌతుంది. సద్గురువు చేయి పట్టుకు నడిస్తే మరింత సులభసాధ్యమౌతుంది.
సాయిబాబా తనను దైవంగా చెప్పుకోక గురువుగా భావించమని మాత్రమే అనేవారు. బాబా సద్గురువు మాత్రమే కాదు, భగవంతుడేనని ఆయనతో కలిసి జీవించిన చాలామంది విశ్వసించారు. బాబా లీలలు మనలో చాలామందికి అనుభవమౌతున్నాయి.
సాయిబాబా చూపిన వినమ్రత, దయ, కరుణ, ఔదార్యం మొదలైన అద్భుత గుణాలను మనమూ అలవరచుకుందాం. వ్యర్థ విషయాలతో కాలాన్ని హరింపచేయకుండా, సాయి భగవాన్ నామస్మరణతో సద్వినియోగం చేసుకుందాం. జీవితాన్ని సార్ధకం చేసుకుందాం. సాయి నామం సుఖశాంతులనిస్తుంది.
ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ్