Total Pageviews

Friday, July 31, 2015

ఆత్మజ్ఞాన౦ కలిగించే సాయితత్వం...

భక్తి, జ్ఞానం ఒక్కటి కావు. భక్తికి పై మెట్టు జ్ఞానం. మనం భక్తి దగ్గరే ఆగిపోతున్నాం. నిరంతరం భగవంతుని పైనే మన దృష్టి . మన కోరికలు తీరిస్తే మనల్ని భగవంతుడు అనుగ్రహి౦చాడని సంబరపడతాం.తీరకుంటే ''మన ఖర్మ'అనుకుని బాధపడతాం.భగవంతునికి , భక్తునికి ఉన్నా సంబంధం అంత వరకేనా ? భక్తిలోని భావం ఇదేనా ?! భక్తిభావం నిస్సందేహంగా గొప్పదే తీరిక లేని జీవితంలో కాసేపు ఓపిక తెచ్చుకుని భగవంతునిపై దృష్టి పెట్టగలుగు తున్నామంటే అది మరీ గొప్ప విషయం .అసలు మనలో భక్తి కేవలం భగవంతుడిని కొలవటానికే పరిమితం కాకూడదు భగవదారాధన భక్తి వరకే పరిమితమైతే దైవత్వంలో ఇమిడి ఉన్నా విశిష్టతను తెలుసుకోలే౦. దైవం ఏం చెప్పిందో గ్రహించలేం . భక్తి ముక్తిదాయకమైనదే . అయితే దానికి పైన్నున జ్ఞానమనే పై మెట్టు ఎక్కితేనే మోక్షం. అదే ఆత్మజ్ఞానం కృషితో ఆత్మజ్ఞానాన్ని సాధించిన మనిషి ఋషి అవుతాడు . Athma Gnanam Kaliginche Saitathvam
ఆత్మజ్ఞానం అంటే ఏమిటి ?ఆత్మజ్ఞానం అంటే మరేమిటో కాదు. మన గురించి మనం తెలుసుకోవటమే .మనలోని శక్తుల్ని సాధన మార్గం వైపు మళ్ళించు కోవటమే .ఈ జ్ఞానం కలగటానికి భగవంతుడిని సాధనగా చేసుకోవాలి . భగవంతుని రూపలావణ్య లను మాత్రమే కాక అయన చుట్టూ వలయంలా అల్లుకున్న దివ్యత్వాన్ని చూడాలి .ఆ దివ్యత్వంలో వేలవేల ఉపదేశాలు , ప్రబోధాలు .మహిత సత్యాలు వలయాల్లా పరిభ్రమిస్తూ ఉంటాయి . వాటిని ఒడిసి పట్టుకోవాలి . వాటిని నిత్య జీవితంలో ఆచరించాలి .ఏది మంచి ?ఏది చెడు?ఏది ప్రగతికారకం? ఏది ప్రతిబ౦ధకం ?అనేది తెలియాలంటే భగవంతుని ఉపదేశాలు మరీ ముఖ్యంగా వాటిలో నీతిని గ్రహించాలి . అప్పుడే మంచి నడవడికను నేర్చుకోగలుగుతాం. ఆదర్సనియమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిదుకోగలుగుతాం .మనకు ఏది కావాలో ?ఏది వద్దో ? తెలుస్తుంది .మన లక్ష్యాలేమీటో స్పష్టంగా కనిపిస్తాయి . వాటిని సాధించుకోవటానికి చేసే ప్రయత్నాలు విజయవంతంమవుతాయి .అప్పుడే మానవ జన్మకు సార్ధకత.
సాయి తన అవతార కాలమంత ఎన్నో ఉపదేశాలు ప్రబోధిస్తూ మానవ జీవితంలోని మహిత సత్యాలను చాటారు.కానీ, సాయిని మనం కోరికలు తీర్చే కల్పవృక్షంగానే కొలుస్తాం . అంతే తప్ప సాయి ఉపదేశాల్లోని సారాన్ని ఆచరించే ప్రయత్నం చెయ్యట్లేదు .మనిషి ఉన్నతిని సాధించటానికి సాయి చూపించిన మార్గం ఎంతో విశిష్టమైనది .పూజలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ముఖ్యంకాదని , చేసే పనిని మనస్సు పెట్టి చేయటం కూడా భక్తీ యోగామేనని , అదే ప్రతి మనిషి ప్రథమ కర్తవ్యం కావాలని ఉపదేశించారు. వాటిని తెలుసుకుని ఆచరిస్తే మానవ జీవిత పరమార్ధం నెరవేరుతుంది .
సాయి ఒక సందర్భంలో '' నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని వాగ్ధానం చేశాను ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పై మెట్టు ఎక్కటానికి ప్రయత్నిస్తాడు .ఏది మంచి ?ఏదిచెడు?తెలుసుకునే విచక్షణా జ్ఞానాన్ని పొందుతాడు.అప్పుడే జ్ఞానం కలుగుతుంది '' అంటారు. సాయి కృప వలన మనందరి కోరికలు తీరుతాయి కాబట్టి ,ఇక సాయి ఏం చెప్పారో , సాయి ఉపదేశాల్లోని సారమేమిటో తెలుసుకుందాం వాటిని నిత్యజీవితంలో ఆచరిద్దాం రండి... సాయిపథంలో నడిచి మన బతుకుల్ని తీయబరుచుకుందాం .'సాయి'ని మనస్పూర్తిగా తీసుకుని బాబా చెప్పిన మంచి చెడులను ఆచరించి పుణ్యాని ముటకట్టుకుందాం.

శిరిడీ సాయిబాబా బోధనలు...

శిరిడీ సాయిబాబా బోధనలు.........

గురుర్‌ బ్రహ్మ గురుర్‌ విష్ణూః
గురుర్‌ దేవో మహేశ్వరః
గురుర్‌ సాక్షాత్‌ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువే నమః
‘గు’ అంటే చీకటి, అజ్ఞానం. ‘రు’ అంటే వెలుగు, జ్ఞానం. తన వద్దకు చేరిన శిష్యూని మనస్సులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానం అనే వెలుగును చూపించే వాడు గురువు. అందుేక గరువు సృష్టి. స్థితి, లయ కారులైన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణూ, మహేశ్వరులు ఏకరూపం దాల్చిన పరబ్రహ్మ స్వరూపంగా పేర్కొనబడినారు. శిరిడీ సాయిబాబా సద్గురువు, గురువులకు గురువు. ఆత్మసాక్షాత్కారాన్ని అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారు. బ్రహ్మజ్ఞానం పొందినవారు, సమాజానికి దూరంగా ఉంటూ, ఏకాంతంలో కాలం గుడుపుతుంటారు. భవ బంధాలతో సంబంధాలను వదల్చుకొంటారు.

శిరిడీ సాయిబాబా అటువంటివారు కాదు. బ్రహ్మ జ్ఞాని అయినా, సమాజంలో ఉంటూ ప్రజలందరితో కలసి మెలసి, వారి సాధక బాధకాలను గ్రహిస్తూ, వారి క్షేమం కోసం పరితపిస్తూ, మంచి మార్గాన నడవడం కోసం సముచిత బోధనలు చేస్తూ, తన మాటల విలువకోసం, విశ్వాసం కోసం కొన్ని అద్భుత కార్యాలను చేసి చూపించారు.ఆయన భూతభవిష్యత్‌ వర్తమాన కాలజ్ఞానాన్ని గుప్పిట బట్టినవారు. బాబా జీవితమూ, బోధనలూ, ప్రవర్తనలూ, చేసిన కార్యాలూ అన్నీ నవరస సమ్మిశ్రీతమనపిస్తాయి. సాధారణ మానవునిలో, సహజ గుణాలు, అసహజ విధానాలు, ప్రవర్తనలు ఏ రీతిలో నిక్షిప్తమై ఉండి, ఏయే పరిస్థితుల్లో ఏవిధంగా బహిర్గతమవుతుంటాయో, శక్తు లను కూడా ప్రదర్శించారు. ఇవన్నీ ఆయన ప్రజాశ్రేయస్సు కోసం, విశ్వశాంతి నెలకొల్పడం కోసం చేసినవే.సముద్రంలో ప్రయాణం చేసే వారికి మార్గదర్శకంగా ఉండేవి - ఎత్తయిన దీపస్తంభాలు. ఆ దీపస్తంభాల నుం డి వెలువడే వెలుగు, ప్రయాణీకులకు తామేదిశగా పోతున్నామో, ఎటువైపు పోవాలో సరైన మార్గమేదో తెలియజేస్తుంది. శిరిడీ సాయిబాబా అలాంటి ఉన్నత దీపస్తంభం లాంటివారు. బాబా గాథలూ, బోధనలూ ప్రపంచమనే మహాసముద్రంలో పయనించే వారందరికీ మార్గనిర్దేశం చేస్తాయి. జీవనసాగర యాత్రను సులభతరం చేస్తాయి.

శిరిడీ సాయిబాబా గాథలు, బోధనలు మన చెవుల ద్వారా హృదయంలోకి ప్రవేశించేటప్పుడు దేహ స్పృహ ను, అహంకారాన్న ద్వంద్వ భావాలనూ నిష్ర్కమించే టట్లు చేస్తాయి. అవి ఆశ్చర్యాన్నీ, అద్భుతాలనూ మన కనుల ముందు ఆవిష్కరిపంజేస్తాయి. మనోవికలత పొందిన వారికి, విచార గ్రస్తులకు, శాంతిని సమకూర్చి ఆనందం కలిగిస్తాయి. ఇహపరాలకు కావలసిన జ్ఞానాన్ని, బుద్ధినీ కలుగజేస్తాయి. బాబా ప్రబోధాలను విని, వానిని మననం చేసుకుంటే, భక్తులు కోరుకొనే అష్టాంగ యోగ ప్రావీణ్యం, ధ్యానానందమూ పొందగలరు.శిరిడీ సాయిబాబా వంద సంవత్సరాలప్పుడు అందరి ముందు తిరుగాడిన సజీవమానవతామూర్తి, ‘మనుష్యు లై పుట్టినందుకు సత్యం తెలుసుకొన్నప్పుడే జన్మసార్థక మవుతుంది. సూక్ష్మంగా గమనిస్తే సత్యమే ఈశ్వరుడని తేలుతుంది. నదులన్నీ సముద్రంలో కలసి ఒకటైనట్లు జీవాత్మ పరమాత్మతో కలిస్తే అది సత్యవస్తువే అవుతుంది. అప్పుడు ‘నేను’ అనే అహంకారం తొలగిపోతుంది. మనకు దేహధారణకు కావలసిన దానికంటె ఎక్కువ గ్రహించడం దొంగతనం అవుతుంది. ఎక్కువ గ్రహిం చకపోవడం అపరిగ్రహం. ఇది వేదాంత నియమం’
- సాయి సూక్తి.

ఆయన భూతభవిష్యత్‌ వర్తమాన కాలజ్ఞానాన్ని గుప్పిటబట్టినవారు. బాబా జీవితమూ, బోధనలూ, ప్రవర్తనలూ, చేసిన కార్యాలూ అన్నీ నవరస సమ్మేలనమనపిస్తాయి. సాధారణ మానవునిలో, సహజ గుణాలు, అసహజ విధానాలు, ప్రవర్తనలు ఏ రీతిలో నిక్షిప్తమై ఉండి, ఏయే పరిస్థితుల్లో ఏవిధంగా బహిర్గతమవుతుంటాయో, శక్తులను కూడా ప్రదర్శించారు. ఇవన్నీ ఆయన ప్రజాశ్రేయస్సు కోసం, విశ్వశాంతి నెలకొల్పడం కోసం చేసినవే.

వెలుగును ఇచ్చే దీపం అంటే సాయిబాబాకు చాలా ఇష్టం. దేవాలయాలలోనూ, మసీదులోనూ పుష్కలంగా దీపాలను వెలిగిస్తుండేవారు. ఆ దీపాలకు కావలసిన నూనెను శిరిడీలోని వర్తకులను అడిగి తెస్తుండేవారు. అలాతెచ్చిన నూనెను ప్రమిదలలో పోసి అందులో ఒత్తులు వేసి వెలిగిస్తూ ఉండేవారు. ఆయన రాత్రులందు పాడుబడిన మసీదులో పడుకొనేవారు. అక్కడ రాత్రంతా దీపాలు వెలుగుతుండేవి. ఒకరోజు వర్తకులందరూ మాట్లాడుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని కట్టడి చేసుకొన్నారు. బాబా వారిని నూనె అడిగి లేదనిపించుకొని, నవ్వుకొంటూ మసీదుకు చేరాడు. సాయంత్రం దీపపు ప్రమిదలలో ఒట్టి ఒత్తులను మాత్రమే పెట్టాడు. డొక్కు పాత్రలో నీళ్ళు పోసి ఆ నీటిని పుక్కిట పడుతూ ప్రమిదలలో ఉమ్మివేయసాగాడు. బాబా ఉమ్మి నీటితో ఉన్న ఒత్తులను వెలిగించాడు. బాబా చర్యలను వర్తకులు గుట్టుగా గమనించసాగారు. బాబా నీటితో వెలిగించిన దీపాలు రాత్రంతా, తెల్లవారే వరకూ వెలుగుతూనే ఉన్నాయి. వర్తకులకు తమ తప్పు తెలిసి పశ్చాత్తాపం కలిగింది. వెంటనే బాబా వద్దకు వచ్చి ‘క్షమించండి’ అని వేడుకొన్నారు.

అప్పుడు సాయిబాబా పైసూక్తి వారికి తెలిపాడు. క్షమాగుణం సత్ప్రవర్తనకు, సత్వర్తనకు మార్గదర్శకమవుతుందని తెలిపాడు.భక్తులకు బాబా దానం గురించి బోధించారు. ఇలా బోధించడానికి ప్రత్యేక కారణం, తాత్విక చింతనా ఉంది. ‘ధనమందు గల అధికేచ్చనూ, అభిమానాన్నీ పోగొట్టి భక్తుల మనస్సులను శుభ్రపరచడానికి దక్షిణరూపంలో ధనం మొదలైనవి గ్రహించాలి’. అలా పుచ్చుకొన్న దానికి వందరెట్లు తిరిగి ఇవ్వాలనేది ధర్మం.సాయిబాబా అలాగే ప్రవర్తించారు. అందుకు ఎన్నో సంఘటనలు, భక్తులెందరో ప్రత్యక్షంగా అనుభవించారు. గణపతిరావు బోడెస్‌ అనే గొప్ప నటుడుండేవాడు. అతడిని ఒకరోజు బాబా గడియ గడియకూ దక్షిణ అడిగే వాడు. ఇది అతనికి ఇబ్బందిగా తోచి తన దగ్గర అప్పుడున్న ధనపు సంచిని బాబా ముందర కుమ్మరించాడు. దీని ఫలితంగా ఆనాటి నుండీ అతడు జీవితమంతా ధనానికి లోటు లేకుండా గడిపాడు. ఈ సంగతిని ఆయనే తన జీవితచరిత్రలో వ్రాశాడు. దక్షిణ అనేది ధన రూపంలో కాకుండా మరో విధంగా కూడా ఉండేది. బాబా దర్శనం కోసం వచ్చిన ప్రొఫెసర్‌ జి.జి. నార్కే ‘ప్రస్తుతం నా దగ్గర దమ్మిడీ కూడా లేద’ని అన్నాడు.

బాబా అప్పుడు ‘ఆ సంగతి తెలుసు. మరో రకమైన దక్షిణ అడుగుతున్నాను నేను, నీవిప్పుడు యోగవాసిష్టం అనే గ్రంథం చదువుతున్నావు కదా! దాని నుండి నాకేదైనా ఇవ్వు చాల’న్నాడు. దీని భావం ఏమంటే ‘గ్రంథం నుండి నీవు నేర్చుకొన్న విషయాలను జాగ్రత్తగా హృదయంలో దాచుకో. అలా చేయడమే నాకు దక్షిణ ఇచ్చినట్లవుతుంది’.

‘మనుష్యులై పుట్టినందుకు సత్యం తెలుసుకొన్నప్పుడే జన్మసార్థకమ వుతుంది. సూక్ష్మంగా గమనిస్తే సత్యమే ఈశ్వరుడని తేలుతుంది. నదులన్నీ సముద్రంలో కలసి ఒకటైనట్లు జీవాత్మ పరమాత్మతో కలిస్తే అది సత్యవస్తువే అవుతుంది. అప్పుడు ‘నేను’ అనే అహంకారం తొలగిపోతుంది. మనకు దేహధారణకు కావలసిన దానికంటె ఎక్కువ గ్రహించడం దొంగతనం అవుతుంది. ఎక్కువ గ్రహించకపోవడం అపరిగ్రహం. ఇది వేదాంత నియమం’ - సాయి సూక్తి.

Wednesday, July 29, 2015

షిర్డీ సాయి తత్వానికి ప్రతిబింబం గురుపూర్ణిమ...!

 
గురువు అంటే ఒక తత్వం గురువు అంటే నడిచే విజ్ఞానభాండం గురువు మన బుద్ధిలో నిద్రానమైన చైతన్య శక్తిని మేల్కొలిపే దివ్య చైతన్యం. అటువంటి గురువుకు నీరాజనంగా మనం అందరం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే మహోత్సవమే గురుపూర్ణిమ. వ్యాసుడి జనన తిధి ‘ఆషాడ పూర్ణిమ’ ను గురు పూర్ణిమ గా మన పురాణాలు చెపుతాయి. లోకానికి భగవద్గీత ను అందించిన శ్రీకృష్ణుడు జగద్గురువైతే, శక్తివంతమైన సంస్కృతికి అవసరమైన విశాల వాజ్ఞ్మయ౦ మహాభారతాన్ని అందించిన వ్యాసుడు కూడా లోకానికి గురువే. అందుకే “గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వరా” అంటారు. ఈ దేశంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావులకు గురు స్థానంలో ఉన్న గొప్ప వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. వారందరి లోకి గురుస్తానీయుడు వేదవ్యాసుడు. అందరి గురువులకు గురు స్థానంలో ఉన్న మహోన్నత వ్యక్తి వ్యాసుడు. అందుకే ఆయన పుట్టిన రోజు ‘గురు పూర్ణిమ’ గా మన హైందవ సంస్కృతిలో జరుపుకుంటాం. గురు పూర్ణిమ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది షిర్డీ సాయి నాధుని నామం. షిర్డీ బాబా కు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగలలో గురు పూర్ణిమ ఒకటి. ఆయన జీవించినంత కాలం షిర్డీ లో ఈ గురు పూర్ణిమ ను అత్యంత ఘనంగా నిర్వహించే వారు. ఇప్పటికీ షిర్డీ సంస్థానంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సాయి ఆలయాలలో ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అందుకే ఈరోజు బాబా ఆలయాలు అన్నీ సాయి నామస్మరణతో జ్ఞాన యజ్ఞాలతో హోరెత్తిపోతాయి. “నటిస్తే నీవు దేనినీ గురువు నుండి పొందలేవు – హృదయ పూర్వకంగా గురువు ను ఆరాధిస్తేనే జ్ఞానాన్ని పొంధగలుగుతావు” అంటారు సాయి. అందుకే ఈ గురుపూర్ణిమ నాడు మనకు జన్మనిచ్చిన తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకోవడమే కాకుండా మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువును సత్కరించే కార్యక్రమాలు ఈరోజు దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకొంటు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. షిర్డీ బాబా తన భక్తులను ఎప్పుడూ తనను భగవంతుడిగా చూడవద్దని, ఒక సద్గురువుగా చూడమని ఉపదేశించేవారు. తను చెప్పిన మాటలను హృదయ పూర్వకంగా ప్రేమతో, శ్రద్ధతో పాటించమని అప్పుడే తన అనుగ్రహాన్ని తన భక్తులు పొందగలుగుతారు అని బాబా తరచూ చెపుతూ ఉండేవారు. ఈ విషయం మనకు బాబా ఆత్మీయ భక్తుడు దాసగణు అనుభవం నుండి మనకు అవగతం అవుతుంది. నేటికీ మన పుణ్య భారత భూమి ఆధ్యాత్మిక శక్తితో శోబిస్తోంది అంటే అందుకు కారణం జగద్గురువుల మార్గధర్శకమే. ఈ మార్గధర్శకత్వంతో వేలాది సంవత్సరాల క్రితమే చక్కటి సమాజాన్ని రూపొందించారు మన గురువులు. ఈ సమాజం సుస్థిరంగా, సుభిక్షంగా దినదినాభివృద్ధి చెందడానికి ఐదు కీలక అంశాలను గుర్తించి వాటిని మనకు మన గురువులు తెలియజేశారు. అవే కుటుంబం - విద్యా – వైద్యం - ఆర్ధిక – రాజకీయ వ్యవస్థలు. ఈ ఐదింటికి ఆధ్యాత్మిక శక్తిని కేంద్రభిందువుగా చేసి ఎన్నో విషయాలు మన ఆధ్యాత్మిక గురువులు మన హైందవ ధర్మంలో తెలియజేశారు. ఆమాటలను గుర్తుకు చేసుకొనే పుణ్య తిధి గురుపూర్ణిమ. రకరకాల అశాంతులతో, సంక్షోభాలతో నేడు నలిగిపోతున్న 120 కోట్ల భారతావనికి ఈ పుణ్య తిధి గురుపూర్ణిమ సకల మానసిక, శారీరిక సుఖ శాంతులను కలగజేసి, మన భారతదేశానికి పూర్వ వైభవం వచ్చేలా ఈ గురుపూర్ణిమ పుణ్యతిధి అఖండకోటి బ్రహ్మాండనాయకుడు సాయి నాధుడు మన అందరినీ ఆశిర్వాధించాలని మనస్పూర్తిగా కోరుకుందాం.


Guru Purnima Celebrations @ ShirdiThe Gurupurnima festival originated during Lord Buddha’s time when the monks used to take Initiation at the beginning of the rainy season. This practice was then followed by the Jain tradition and later the Hindus. According to the Hindu Purans, worshiping the ‘Guru’ on this day started at the time of ‘Vyas’ writer of the 'Mahabharata'. Once, in 1908, Tatyasaheb Noolkar came to Shirdi and stayed in Chavadi. One day Baba told Madhavrao to tell him to worship that post (pillar). The post Baba showed was near the Dhuni and Baba used to lean on it. That was the day when he was glad to have chance to worship at least the post in Masjid. Then Madhavrao Deshpande went into the Masjid. Baba told him to worship the same post along with Noolkar. But Madhavrao refused and insead requested to allow him to worship Baba himself. After a thought, at last Baba gave the permission. Dadasaheb Kelkar was unaware of this Puja. Tatya Kote Patil was called from the farm. People gathered the ‘Puja’ material. Dhoti was brought and people put the Dhoti on Baba, and worshiped him. Baba had no use of clothes but he gave permission in order to start the routine of Vyas puja. Thus this Puja was started at Baba’s time and now has taken form of Festival lasting for three days. Various religious activities are arranged. Great number of people flock to Shirdi during this Festival.

Monday, July 27, 2015

Where should we address our prayers to be assured that they reach God?

Where should we address our prayers to be assured that they reach God? The Lord's abode is described in various ways as Vaikuntha, Kailasa, etc. All these are fanciful names. Which is the abode of God? The Lord told Sage Narada: "I reside wherever My devotees sing My glories." The Lord dwells in the hearts of devotees; this is His main address. All other places are ‘branch offices!’ Any message addressed to the Divine as Indweller in your heart is bound to reach God. What is meant by Ekadashi? It should not be regarded as some special place or time. The form of Ekadasa Rudra is made up of the five organs of perception, the five organs of action and the mind. Rudra is a resident of the human body, which is full of numerous divine potencies. Remind yourself, today and every day that these special potencies, including the Divine Himself dwell deep within your heart. Prayer alone makes life happy, harmonious and worth living in this universe. - Baba

Saturday, July 25, 2015

How can we lead a blessed life?

How can we lead a blessed life? Though your body may be inactive, your mind will be very busy, committing acts on its own. People with such minds fall prey to fate or karmic consequences easily! When one has the mind fixed on contemplation of God and the pursuit of truth, though the body and senses do acts that are of service to the world, they won’t be affected by karma; though they do actions, they are free from the fruits of the action. This is the lesson from Bhagavad Gita. The heart of the person who doesn’t strive to cultivate the mind with holy thoughts is definitely the paradise of evil and wickedness. Bear this in your mind: Until you see Divinity in everyone and everywhere, continue to meditate and repeat the Lord’s name. Also, devote your time to the service of the world, regardless of the fruits thereof. Carry on this until your mind is free from the waves of feelings and is full of Divinity. Then you will become blessed. If you take one step towards Me, I take hundred steps towards you. - Baba

Friday, July 24, 2015

ఒక శిఖరం కూలిపోయింది!

ఒక శిఖరం కూలిపోయింది!
తెలుగు రాష్ట్రాలలో సాయి భక్తి ని వ్యాపింపజేసిన మహోన్నత మానవతా మూర్తి ఇకలేరు!
హైదరాబాద్ నగర శివార్లలోని కీసర గుట్ట సమీపంలోగల రామవరం మండలం, రామలింగంపల్లి గ్రామంలోని ’సాయిధామం’ వ్యవస్థాపకులు, శ్రీ సాయి సేవా సమితి ట్రస్టు ద్వారా అనేక సామాజిక, ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలను గత 3 దశాబ్దాలుగా నిర్వహించి, సచ్చిదానంద సద్గురు సాయి వాణి అనే తెలుగు మాసపత్రికకు గత దశాబ్ద కాలంగా గౌరవ సంపాదకునిగా వ్యవరించిన పూజ్యశ్రీ సత్య పదానంద ప్రభూజీ గురువారం వుదయం సాయిలీనులయ్యారు. వారి అంత్యక్రియలు ఈ వుదయం సాయిధామం ఆశ్రమంలో వారి ఆశ్రయంలో పెరిగిన దత్తపుత్రుడు శ్రీ రాము నిర్వహించారు.
సాయి భక్తి ప్రచారంలోనే గాక సాయి ధామం ఆశ్రమం చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలకి వారు చేసిన గ్రామ కళ్యాణోత్సవం, గ్రామ ధర్మజ్యోతి సేవలు చిరస్మరణీయం.
వారి ఆశ్రమంలో ద్వారవతి పేరుతో శ్రీ సాయిబాబా ఆలయం, ధుని, ఉష పేరిటి బాలికల శిశుమందిరం, ప్రత్యూష పేరిట బాలుర శిశుమందిరం, సంధ్య పేరిట అరక్షిత వృద్దాశ్రమం, ప్రశాంతి పేరిట వానప్రస్ధ విభాగం, అన్నపూర్ణ పేరిట నిత్యాన్న దాన మందిరం, ఆరోగ్య పేరిట ప్రకృతి, హోమియో మరియూ యోగ వైద్యశాల, భారతి పేరిట గ్రంధాలయం, సాయి విద్యాధామం, సురభి అన్న గోశాల, సాయి కళ్యాణి అనే ఆడిటోరియం నిర్వహించబడుతున్నాయి. సర్వతోభద్ర పేరిట గుంటూరు జిల్లాలో శ్రీ సాయినాధ ఆలయం, సత్తెనపల్లిలో కోదండ రామసాయి సన్నిధానం కూడా వారు స్థాపించినవే.
ఈ వుదయం జరిగిన మహపురుషుని మహాభినిష్క్రమణ యాత్రలో సాయి తత్త్వంలో తలలు పండాయి అనుకునే పెద్దలెవరూ లేకపోయినా, ప్రభూజీ ఆదరణలో, ఆశ్రయంలో పెరిగిన పిల్లలతో అంతిమ యాత్ర కొనసాగింది. ఎందరో యువతీయువకులు, పిల్లలూ, వారి ఆశ్రితులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
సాయిధామం ధర్మాధికారిణి, సచ్చిదానంద సద్గురువాణి సంపాదకురాలు మాతా శుకవాణి, మరియూ ఆశ్రమవాసులందరికీ సాయి టీవి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నది.
పూజ్యశ్రీ సత్యపదానంద ప్రభూజీ కి వినయపూర్వక సుమాంజలి!
LAST JOURNEY OF PUJYASHRI SATYA PADANANDA PRABHOOJI AT SAIDHAMAM THIS MORNING.
PHOTOS: SAI TV.

Thursday, July 23, 2015

దుఃఖాలను పోగొట్టే ద్వారకామాయి (Shirdi Dwarakamai)

 
దుఃఖాలను పోగొట్టే ద్వారకామాయి
(Shirdi Dwarakamai)
Saibaba of Shirdi is known for his excellency in attracting the people across the world of diff religions, cast and creed..The steps that he has followed are unremarkable and are the base stones for the "Universal Family" where people belongs to all religions will closely move with each other and Pray together ..
One such a step that Saibaba has taken is - Naming to his Demolished Maszid where he has stayed for more that 58 years-- That is "DWARAKA MAI".
As called by many Great people across the world, Considering the INDIA as Holy Mother of earth, Even this "DWARAKA MAI" is the icon of heritage for this HOLY MOTHER. This is a Love of Ocean and symbol of Compassion.
The meaning of the word "DWARAKA MAI" is -The Place which is Well opened the doors for all people irrespective of religion, cast and creed - and blessed with the CHATURVIDHA PURUSHARDHA'S.
Here if you speak about these words individually-
MAI the word stands for - MOTHER
DWARAKA the word stands for - ENTRANCE..
షిర్డీలో సాయిబాబా నివాసమున్న మసీదు ద్వారకామాయి. ప్రస్తుతం ద్వారకామాయి ఫోటో ఉన్న స్థలంలో బాబా కాళ్ళు బారజాపుకుని కూర్చునేవారు. అలా కూర్చున్నప్పుడు వారి కాళ్ళు ముందున్న స్తంభం వరకూ వచ్చేపట. గురుస్థానం నుంచి బాబా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మసీదు శిధిలావస్థలో ఉంది. బాబా ఇక్కడ ధునిని ప్రతిష్టించారు. ఇటుకలు, మట్టి రాలిపడుతూ ఉండేవి. ఇక్కడ బాబా స్నానానికి ఉపయోగించే స్నానపు రాయి ఉంది. ఇక్కడ ఉన్న బాబా చిత్రానికి చాల మహత్తు ఉంది. విల్లీపార్లేకి చెందిన శ్యాంరావు ఆర్.వి. జయకర్ ఈ చిత్రం గీశాడు. బాబా ఆశీస్సులతో ఆ పటాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజలో పెట్టుకుందామనుకుని బాబా వద్దకు ఆ పటం తీసికెళ్ళాడు. నేను నిష్క్రమించాక ఈ పటం ద్వారా నేను నా భక్తుల శ్రేయస్సు చూస్తుంటాను. ఈ ఫోటో ఇక్కడే ఉండనీ’ అన్నారట సాయిబాబా.
అనేకమంది భక్తులు నేటికీ తాము తమ నివాసాలకు వెళ్లేందుకు బాబా అనుమతి ఇక్కడి నుంచే పొందుతారు. ఇక్కడనుంచే చాలామందికి బాబా నుంచి ఆదేశాలు అందుతుంటాయి. ఇక్కడ ఓ పక్కన బస్తాలో గోధుమలుంటాయి. బాలాజీ పాటిల్ నెవాస్కర్ అనే భక్తుడు తన పంటను బాబాకు సమర్పించి బాబాకు తనకు తిరిగి ఇచ్చిన దానితోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈయన తరువాత ఆయన కొడుకు కూడా అలాగే చేసేవాడు. అతని స్మృతికి చిహ్నంగా ఓ గోధుమల బస్తాను నేటికీ అక్కడ ఉంచుతూ ఉంటారు. షిరిడీలో రెండు తిరగళ్ళు మనకు కనిపిస్తాయి. ఒకటి ఇక్కడ, మరొకటి సమాధి మందిరంలో. బాబా వీటితో గోధుమలు విసిరేవారట. మసీదులో ఓక పక్కన జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఈ జ్యోతి ఉన్న స్థానంలో బాబా నీటితో దీపాలు వెలిగించారు. ఇక్కడ గల ఒక కుండలో నీటిని బాబా ఎంతోమందితో తాగించేవారు. అయినా అందులో నీరు తరిగేది కాదు. ఇప్పటికి చాలామంది భక్తులు అందులోని నీరు తాగుతారు.
ద్వారకామాయి దక్షిణం వైపు రెండు పాదాలు ఉన్నాయి. రోజూ ఆరతి అయ్యాక బాబా ఇక్కడ కొద్దిసేపు కూర్చునేవారు. ధుని నుంచి ఊదీ తీసి భక్తుల నుదుట పెట్టేవారు. ''మీకు శుభం జరుగుతుంద''ని ఆశీర్వదించేవారు. 1886లో మూడు రోజులపాటు శరీరాన్ని విడిచిపెట్టి బాబా తిరిగి వచ్చిన అద్భుత ఘటన జరిగిన స్థలమిది. అందుకు గుర్తుగా ఇక్కడ తాబేలు బొమ్మ ప్రతిష్టించారు.
శ్యాంసుందర్ అనే గుర్రాన్ని బాబా అమితంగా ప్రేమించేవారు. హారతి సమయంలో దానిని చక్కగా అలంకరించి ఇక్కడ నిలబెట్టేవారు.
భక్తులకోసం బాబా వంటచేసే సమయంలో ఇక్కడ ఉన్న గుంజకు ఆనుకుని కూర్చునేవారు. తమ గురువుకు గుర్తుగా సాయి ఇక్కడ అగ్నిని ప్రజ్వలింపచేశారు. దీనిని ధుని అంటారు. అది నేటికీ అఖండంగా వెలుగుతూనే ఉంది. దీనిలోని భస్మాన్ని ఊదీ అంటారు. ఈ ఊదీని ధరిస్తే అనారోగ్యాలు పోతాయి.
ద్వారకామాయి గురుకులం లాంటిది, ఎందరో ఇక్కడ జ్ఞానసిద్ధి పొందుతుంటారు.సాయిచరిత్ర చదివితే ఇక్కడ బాబా లీలలు ఎన్నో జరిగినట్లు తెలుసుకోవచ్చు. బాబా సమాధికి ఒక వారం రోజుల ముందు ఒక పులి సద్గతి పొందింది. 1969 దీని విగ్రహాన్ని మసీదులో ప్రతిష్టించారు. ఈ విగ్రహం పక్కనే ఉన్న రాయి మీదనే సాయంత్రం వేళ సాయిబాబా కూర్చునేవారు.
ద్వారకామాయిని దర్శించుకుంటే చాలు దుఖాలు పోయి సుఖసంతోషాలు సొంతమౌతాయి.

గురు పౌర్ణమి( వ్యాసపూర్ణిమ)(31-07-2015)

 
 
గురు పౌర్ణమి( వ్యాసపూర్ణిమ)(31-07-2015)
--------------------------------------------------------------------------------
"గురుబ్రహ్మ, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరఃగురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"
దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు. అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవరూ రక్షించలేరట. అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు, జ్ఞనాన్ని అందించే గురువుకు సేవచేసి, గురుకృప పొంది మహనీయులైనవారు ఎందరో వున్నారు
ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి ని జరుపుకుంటాము . ఆ రోజు వ్యాస మహర్షి పుట్టిన రోజు కావడం.పూర్వ కాలం లో ఆ రోజు నుండి 4 నెలలు వర్ష కాలం కావడం తో అందారు ఆశ్రమాలలో ,గురుకులాల్లో ఉంది విద్యని అభ్యసించేవారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.
గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా, చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని, బ్రహ్మదేవుడిని, వసిష్ఠులవారిని, శక్తిమునిని, పరాశరుడిని, వ్యాసులవారిని, శుకమహామునిని, గౌడపాదులవారిని, గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.
ఈ రోజునే చాతుర్మాస్యవ్రతాన్ని ఆరంభిస్తారు. ఆచార్యులవారిని అంటే గురుదేవుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా ఆరాధించాలనేది ఋషివచనం. విజ్ఞానానికి మూలం విద్య. ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి.
వేదాలను నాలుగు భాగాలు గా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడు గా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవత తో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలోఒకడు.
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Tuesday, July 21, 2015

బాబానే నమ్ముకోండి - అనుభూతులు పొందండి(article from http://telugublogofshirdisai.blogspot.in/2015/04/blog-post.html)

బాబా నాకు విద్యనిచ్చారు 

మనజీవితాలకి మార్గదర్శకుడు సాయిమాత.  ఆయన మనలని సరియైన మార్గంలో నడిపిస్తూ దిశానిర్దేశం చేస్తారు.  బాబాతో నా అనుభవాలని వివరిస్తాను.  నేను 12వ.తరగతి చదువుతుండగా సాయి గురించి తెలిసింది.  నేను ఎప్పుడూ భగవంతుడిని ప్రార్ధిస్తూ ఉంటాను.  కాని గాఢమైన నమ్మకం, భక్తి మాత్రం లేదు.  కాని బాబాని పూజించడం ఎప్పుడయితే మొదలుపెట్టానో ఆయనతో నా అనుబంధం తొందరలోనే బాగా ఎక్కువయింది.  బాబా లేకపోతే నేనే లేను అన్నంత ధృఢంగా  ఆయన మీద భక్తి కలిగింది. 


బాబా దయవల్ల నాకు 12వ.తరగతిలో మంచి మార్కులు వచ్చాయి.  మాకుటుంబంలోని వారే కాదు స్నేహితులు కూడా చాలా ఆశ్చర్యపోయారు.  ఆతరువాత నేను యింజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు చేశాను. కౌన్సిలింగ్ లో నాకు మంచి కాలేజీలో సీటు వచ్చేలా చేయమని బాబాని ప్రార్ధించాను.  మేము ఉంటున్న ఊరిలోనే సీటు వచ్చేలా చేయమని బాబాని ప్రార్ధించాను.  ఉన్న ఊరిలోనే  కాలేజీలో సీటు రాకపోతే ఏమిచేయాలా అని అందరం ఆలోచనలో పడ్డాము.  నాతల్లిదండ్రులకు నేను ఒక్కతినే అమ్మాయిని.  అందుచేత మానేజ్ మేంటు కోటాలోనయినా యింజనీరింగ్ లో చేర్పిద్దామనుకొన్నారు.  కాని అది చాలా ఖర్చుతో  కూడుకున్న వ్యవహారం.  నాకొచ్చిన మార్కులు చూసి ఫీజు ఒక్కటే కట్టమన్నారు కాలేజీవారు.  మొదటి సంవత్సరం మా అమ్మగారు ఫీజు కట్టారు.  ఒకసంవత్సరం గడిచిపోయింది.  ఇక్కడి కాలేజీలో చదివేలా ఎందుకు చేశావని బాబా మీద కోపంగా ఉండేది.  కాని తరువాత ఆవిషయం గురించి ఆలోచించకుండా బాబాని ఎప్పటిలాగే పూజిస్తూ వచ్చాను. 

రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టగానె కాలేజీ ఫీజు కట్టవలసి వచ్చింది.  బస్సు చార్జీలు, ఫీజులు అన్ని కలుపుకొని దాదాపు లక్షరూపాయలు కట్టాలి.  మా అమ్మగారికి ఏమిచేయాలో తోచలేదు.  చాలా ఆదుర్దాపడిపోయింది.  నగలన్నిటినీ బ్యాంకులో తాకట్టుపెట్టి లక్షరూపాయలు తీసుకొని వచ్చింది.  ఫీజు చెల్లించడానికి కాలేజీకి వెళ్ళింది.  అప్పుడు సాయి చేసిన అధ్బుతం చూడండి.  ఫీజు కడుతూండగా "మీ అమ్మాయికి స్కాలర్ షిప్ వచ్చింది ఫీజు కట్టనవసరం లేదు" అని కాలేజీవాళ్ళు చెప్పారు.  మా అమ్మగారికిది నమ్మలేని విషయం.  నాకు కూడా నమ్మబుధ్ధి కాలేదు.  కారణం నాకు మేనేజ్ మెంటి కోటాలో సీటు వచ్చింది.  ఇదెలా జరిగిందో తెలీక చాలా ఆశ్చర్యపోయాము.  తరువాత మూడు సంవత్సరాలు నేను ఫీజు కట్టలేదు.  బాబా అనుగ్రహమే లేకపోతే యిది సాధ్యమయేదే కాదు.

                బాబా ఇప్పించిన ఉద్యోగం

కాలేజీలో చదువుకునే రోజులలోనే, చదువు పూర్తవగానే నాకు మంచి ఉధ్యోగం యిప్పించు బాబా అని ప్రార్ధిస్తూ ఉండేదానిని.  ఆఖరి సంవత్సరం లో మా కాలేజీ, విద్యార్ధులకు ఉద్యోగంలో నియామకాలు ఏర్పాటు చేసింది.  కాని నాకు ఉద్యోగం రాలేదు.  ఏంచేయాలో నాకేమీ అర్ధం కాలేదు.  నాస్నేహితులందిరికీ ఉద్యోగాలు వచ్చాయి.  తరచుగా నాముందే వాళ్ళంతా తమకు వచ్చిన ఉధ్యోగాల గురించి మాటలాడుకుంటూ వుండేవారు.  దాంతో నాకు మరీ నిరాశ ఎక్కువయింది.  బాబా ముందు ఏడిచేదానిని.  ఎటువంటి మార్పు లేకుండా రోజులు గడిచిపోతున్నాయి.  అనుకోకుండా మా సోదరుడు పనిచేసే పాఠశాలలోనే పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కలుసుకోవడం తటస్థించింది.  తనంతట తానే నా ఉద్యోగం గురించి అడిగాడు.  అతను కూడా బాబా భక్తుడని ఆ తరువాత తెలిసింది.  బాయే అతనిని పంపించాడనిపించింది.  అతని దయవల్ల నాకు ఉద్యోగం వచ్చింది.  ఆఖరి సెమిస్టర్లో పరీక్షల సమయంలో యింటర్వ్యూ జరిగింది.  నేను కోరుకొన్నట్టుగానె యిక కాలేజీ ఆఖరయే ముందు ఆఫర్ లెటర్ వచ్చింది.  యివన్నీ బాబా దయవల్లే జరిగాయి.


నాకు కడుపులో అల్సర్ (పుండు) ఉంది.  ఆ బాధతో కారాలు ఏవీ లేకుండా ఆహారం తీసుకొంటున్నాను.  కడుపులో పుండు తగ్గిపోయి ఉంటుందిలే అనుకొని ఒకరోజు రాత్రి అన్నంలో ఊరగాయ వేసుకొని తిన్నాను.  తరువాత నిద్రపోయాను.  కాని అర్ధరాత్రి కడుపులో బాగా మంట, నొప్పి విపరీతంగా బాధపెట్టసాగాయి.  అంత రాత్రివేళ ఏమిచేయాలో నాకు పాలుపోలేదు.  అప్పుడు బాబా ఊదీ గుర్తుకు వచ్చింది.  మా అమ్మగారు బాబాని ప్రార్ధించి చిటికెడు ఊదీ నానోటిలో వేశారు.  మరునిమిషంలోనే అద్బుతంగా  నొప్పి తగ్గసాగింది.  రాత్రి హాయిగా నిద్రపోయాను.  బాబా అనుగ్రహంతోనే యిది సాధ్యమయింది.  ఆయన నాకు చేసిన వైద్యం మాటలలో వర్ణించలేను.  

                   అన్నింటికీ బాబాయే ఉన్నారు

ఎప్పుడయినా నామనసు చికాకుగాను, విచారంగాను ఉన్నపుడు బాబా గుడికి వెడుతూ ఉంటాను.  కోయంబత్తూర్ లో నాగసాయి మందిరం ఉంది. నేను మందిరానికి వెళ్ళేంతవరకు మనసంతా అస్థిమితంగా ఉంది. మందిరంలోకి అడుగుపెట్టిన మరుక్షణం అన్నీ మరచిపోయాను.  మనసంతా ప్రశాంతంగా హాయిగా ఉంది.  ఈ విధంగా ఎలా జరుగుతోందో నాకు తెలీదు. సాయి అందరినీ కనిపెట్టుకొని ఉంటారు.  ఆయన తన బిడ్డలనెప్పుడూ కష్టాల బారిన పడనివ్వరు.
                                                   
మనమంతా మానవమాత్రులం.  అందరికీ సమస్యలు సహజంగానే ఉంటాయి.  కాని మనందరికీ సాయి మాత ఆశీస్సులు ఉన్నాయి.  నేను మీ అందరినీ కోరేదేమిటంటే మీకెప్పుడు మనసు ఆందోళనగా ఉన్నా బాబాని స్మరించుకోండి.  వీలయితే బాబా మందిరానికి వెళ్ళి ఆయనను దర్శించుకోండి.  లేకపోతే యింటిలోనయినా ఆయనని ప్రార్ధించండి.  ఈవిధంగా చేస్తే బాబా మీతోనే ఉన్నాడన్న అనుభూతి కలుగుతుంది.  ఇక ఎటువంటి చింతా ఉండదు.  బాబా మీద మనకి అత్యంత భక్తి ప్రప్రత్తులు, నమ్మకం ఉన్నాయి.  ఆయనని ఒక్కసారి స్మరించుకోండి.  నా అనుభవం ప్రకారం మనం కోరుకొన్నది బాబా మనకి ప్రసాదించరు.  మనకి ఏదిమంచో దానినే మనకు ప్రసాదిస్తారు.  మనం కోరుకునేదానికి, మనకేదయితే మంచి చేస్తుందో దానికి, ఈరెండిటికీ చాలా భేదం ఉంది.  అదిమాత్రం గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ సాయిని స్మరిస్తూ ఉండండి.  అది మనలో ఆత్మస్థైర్యం పెరగడానికి దోహద పడుతుంది.    

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Sunday, July 19, 2015

శ్రీ షిరిడీసాయి వైభవం మన సమస్యలు - శ్రీసాయి సత్ చరిత్ర సమాధానాలు9article from https://www.blogger.com/blogger.g?blogID=3618206558150917369#editor/target=post;postID=6391465669859772834)

దీ గ్లోరీఆఫ్ షిరిడీసాయి పాతసంచిక అక్టోబరు 2009 వ.సంవత్సరం లోని ఒక బాబా లీల చదవండి. 

శ్రీ షిరిడీసాయి వైభవం 
మన సమస్యలు - శ్రీసాయి సత్ చరిత్ర సమాధానాలు

శ్రీసాయి సత్ చరిత్ర ఒక మహిమాన్విత గ్రంధమని మన సాయి భక్తులందరికీ అనుభవమే.  శ్రీ సాయి సత్ చరిత్ర, బాబా, వేరు కాదు.  సాయి సత్చరిత్రలో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి.   ప్రతీ మాట, పదం అన్నీ కూడా బాబా వారు స్వయంగా చెప్పిన మధుర వాక్కులు.  సత్ చరిత్రను ప్రతీ రోజు పారాయణ చేసేవారు తమ సమస్యలకు బాబా వారి సమధానాలను కూడా సత్ చరిత్ర ద్వారానే తెలుసుకుంటూ ఉంటారు.  ఏదయినా సమస్య ఎదురయినప్పుడు కనులు మూసుకొని బాబాని మనస్పూర్తిగా ప్రార్ధించి పరిష్కారం చూపించమని చరిత్రలోని ఏదో ఒకపేజీ తీసి చూస్తే ఆ సమస్యకు పరిష్కారం కనపడుతుంది.


ఈ రోజు మీరు చదవబోయేది అటువంటి సంఘటనే.  ఇక చదవండి.

ఇది శ్రీహరికిరణ్, హైదరాబాదు వాస్తవ్యులు గారు వ్రాసిన అనుభవం.  

ఈ మధ్యనే నాభర్తకు కలిగిన అనుభవాన్ని వివరిస్తాను. ప్రతిరోజు నేను నా భర్తకన్నా ముందుగానే నిద్రనుండి మేల్కొంటాను.  ఒకరోజు ఉదయాన్నే ఆయన నాకన్నా ముందే నిద్రలేచి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నారు.  తను మాట్లాడే మాటలవల్ల నాకర్ధమైందేమిటంటే ఒక కంపెనీకి సంబంధించిన షేర్లలో పెట్టుబడి పెట్టడానికి తన స్నేహితునితో సంప్రదిస్తున్నారు.  ఆయన స్నేహితుడు ఒక షేర్ బ్రోకరు.  నాభర్త షేర్లలో పెట్టుబడి పెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు.  ఆ కంపెనీలో పెట్టుబడి పెడితే త్వరలోనే ఆ కంపెనీ షేరు విలువ బాగా పెరిగి లాభాలు విపరీతంగా  వస్తాయని ఆతరువాత నాతో చెప్పారు.  

నా భర్తకి బాబా అంటే చాలా నమ్మకం.  కొద్ది రోజులుగా సాయి సత్ చరిత్ర పారాయణ కూడా మొదలు పెట్టారు.  ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే సత్ చరిత్రలోని ఏదో ఒక పేజీ తీసి చదువుతారు.  ఆరోజున స్నానం చేసిన తరువాత పూజా మందిరం లో కూర్చొని సత్ చరిత్ర చేతిలోకి తీసుకొని ఒక పేజీ తెరిచారు.  ఆశ్చర్యం, అది 25వ. అధ్యాయం.  ఆ అధ్యాయంలో దామూ అన్నా ప్రత్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అధిక లాబాలను గడిద్దామని, దాని కోసం బాబా సహాయం కోరదలచిన సంఘటన ఉంది.  దామూ అన్నా మాధవరావుకు ఉత్తరం వ్రాశాడు.  మాధవరావు బాబాకు ఆ ఉత్తరం చదివి వినిపించగానె బాబా " ఉన్నదానితో తృప్తి పడమను.  అతనికి యింటిలో ఏలోటూ లేదు.  లక్షల కోసం వెంటపడవద్దని చెప్పు" అన్నారు.  నాభర్త ఆ అధ్యాయాన్ని చదివిన తరువాత అది బాబా యిచ్చిన సలహాగా భావించారు.  అసలు ఆరోజున చాలా పెద్ద మొత్తంలో తను అనుకున్న కంపెనీ షేర్ లలో పెట్టుబడి పెడదామనుకున్నారు.  ఈ సంఘటన బాబా చేసిన హెచ్చరిక అనుకొని, పెట్టుబడి పెట్టకూడని నిర్ణయించుకొన్నారు.  కాని ఆయన స్నేహితునికి నా భర్త అటువంటి నిర్ణయం తీసుకోవడం నచ్చలేదు.  అతను చాలా హతాసుడయ్యాడు.  కనీసం కొద్ది మొత్తమయిన పెట్టుబడి పెట్టమని బలవంతపెట్టి ఒప్పించాడు.  రెండురోజులలోనే ఆ షేరు విలువ బాగా పడిపోయి, పెట్టుబడి పెట్టినవాళ్ళందరూ బాగా నష్టపోయారు. 
 ముందే అనుకున్న ప్రకారం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఉంటే మేము బాగా నష్టపోయి కష్టాలు పడేవాళ్ళం.  ఎప్పటికీ పూడ్చలేని నష్టాలను అనుభవించి ఉండేవాళ్ళం.  అటువంటి కష్టానికి లోనుకాకుండా సమయానికి సలహా యిచ్చిన బాబావారికి ఎంతో ఋణపడి ఉన్నాము.  బాబా హెచ్చరించినా కూడా నా భర్త తెగించి పెట్టిన కొద్దిపాటి మొత్తం నష్టాన్ని మిగిల్చింది.  బాబా యిచ్చిన సలహాని నాభర్త పూర్తిగా పాటించలేదు.  మానవుడు ఒక్కసారిగా శిఖరాగ్రం నుండి ఏవిధంగా కిందకు జారిపోతాడొ నిరూపిస్తుంది ఈ సంఘటన.  ఇది ఒక కనువిప్పు.       

కావలసినదల్లా పూర్తి నమ్మకం.  

ఓం శ్రీ సమర్ధ సద్గురు శ్రీసాయినాధ్ మహరాజ్ కీ జై.

(సాయిదర్బార్ యూ ఎస్ ఏ వారి సౌజన్యంతో)   

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

శ్రద్ధ - సబూరి (article from http://telugublogofshirdisai.blogspot.in/2015/07/blog-post.html)

శ్రద్ధ - సబూరి 

బాబా తనభక్తులను పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాగినట్లుగా తనవద్దకు రప్పించుకుంటానని చెప్పారు.  మొదట్లో సాయిపై నమ్మకం లేకపోయి ఉండవచ్చు.  బాబాకు తన భక్తులు ఎంత దూరంలో ఉన్నా సరే, ఏదో ఒక సంఘటన ద్వారా, వారి మనసులను ప్రభావితం చేసి తన భక్తులుగా మార్చుకుంటారు.  మనసులో కోరుకున్న కోరికలను కూడా వెంటనే తీర్చి మనకి ఆశ్చర్యాన్ని కలుగ చేస్తారు.  ఆ సమయంలో మనకి అది ఒక అధ్బుతమయిన సంఘటనగా కలకాలం గుర్తుండిపోతుంది.  ఆవిధంగానే బాబా వారు నాకు షిరిడీలో ఆయన దర్శనానికి వెడుతున్నపుడు మనసులో బాబాకి ప్రసాదం, కనీసం గులాబీలయినా తీసుకెళ్ళకుండ, ఉత్త చేతులతో వెడుతున్నమని తలచుని బాధపడినప్పుడు వెంటనే నా కోర్కెను తీర్చారు.   (నా మొట్టమొదటి అనుభూతి).  ఆవిధంగా బాబా క్రమక్రమంగా మనకు ధృఢమయిన భక్తి ని కలిగిస్తారు.  మనం ఇక వెనుకకు తిరిగి చూసుకోనక్కరలేదు.  ఈ రోజు సాయిప్రభ మాసపత్రిక డిసెంబరు, 1987 సంచికలోని ఒక అద్భుతమయిన బాబా లీల తెలుసుకుందాము.     

ఓం సాయిరాం    

ఒక నానుడి.

"ఉదారంగా ఉండు.  అప్పుడు ఇతరులలో ఇంకా చనిపోకుండా నిద్రాణస్థితిలో ఉన్న ఔదార్యం నీ ఔదార్యంతో కలవడానికి సిధ్ధంగా ఉంటుంది.  స్థూలంగా చెప్పాలంటే నీ ఔదార్యాన్ని నువ్వెప్పుడూ కోల్పోవద్దు.  నీవల్ల ఇతరులు కూడా ఉదారంగా తయారవుతారు."  

ఇతరులలో అంతర్గతంగా నిద్రాణ స్థితిలో ఉన్న కొద్దిపాటి విశ్వాసాన్ని గాని, నమ్మకాన్ని గాని  బలోపేతం చేయడానికి మనం సహాయం చేయగలిగినపుడు అందరం కలిసి 'సాయి - నమ్మకం' అనే శక్తివంతమయిన ప్రవాహాన్ని సృష్టించగలం.  మనం ఏదయినా విత్తనాన్ని నాటినపుడు అది బలంగా పెరిగి మొక్కవడానికి కావలసిన ఎఱువులను వేస్తాము.  అదే విధంగా సహనం, ఓర్పు, పట్టుదల వీటిని కనక మనం ఎల్లప్పుడూ శ్రధ్ధగా ఆచరణలో పెట్టినపుడు సాయి మీద నమ్మకాన్ని మనం మరింతగా వృధ్ధి చేసుకోవచ్చు.


పైన చెప్పిన వివరణకి అనుబంధంగా, తన భక్తురాలికి సాయి చూపించిన అనుభవాలను, చమత్కారాలను మీకిప్పుడు తెలియచేస్తాను.  

అయిదు సంవత్సరాల క్రితం సుధ, అనే అమ్మాయి మాయింటి ప్రక్కనే ఉండేది.  ఆమెకు క్రొత్తగా పెళ్ళి అయింది.  ఒక రోజు గురువారం నాడు, నేను మాయింటికి తాళం వేస్తుండగా "ఆంటీ! ప్రతీ గురువారం నాడు మీరు ఎక్కడికి వెడుతూ ఉంటారు" అనడిగింది సుధ.  ప్రతి గురువారం నేను 'ప్రసన్న సాయి మందిరానికి  వెడుతూ ఉంటానని చెప్పాను.  "ఓ! అయితే మీకు సాయిబాబా మీద అంత నమ్మకం ఉందన్నమాట" అని మామూలు ధోరణిలో అంది.        అంతకుముందు చాలా కాలం క్రితం ఆమె మాయింటికి వచ్చినపుడు మా యింటిలో ప్రతి గదిలోను సాయిబాబా చిత్రపటాలను చూసింది.  అప్పుడామె "నేను సాయిబాబా గురించి విన్నాను గాని, ఆయనగురించి నాకసలేమీ తెలీదు" అని చెప్పింది.  "నీకంతగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే చాలా మంచిది" అన్నాను.  ఎవరయితే ఆయన లీలలని గానం చేస్తారో, వింటారో వారిపై సాయి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని అన్నాను. 

"అదే కనక నిజమయితే నాకాయన చరిత్ర, కధలు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది" అంది సుధ. అప్పటినుండి ఆమెకు శ్రీ బీ.వీ.నరసిసిం హస్వామిగారు రచించిన 'లైఫ్ ఆఫ్ సాయిబాబా' పుస్తకంలోని బాబా జీవిత కధలు, సంఘటనలు వివరించి చెప్పడం మొదలుపెట్టాను.  ఆమెలో దైవభక్తి, మంచి ఆధ్యాత్మిక గుణాలు ఉండటం వల్ల నేను చెప్పేవన్నీ వెంటనే ఎంతో ఉత్సాహంతో ప్రతి విషయాన్ని త్వరగానె గ్రహించి అర్ధం చేసుకొనేది.  సాయిబాబా మీద ఆమె విశ్వాసం మరింతగా ప్రకాశించింది.

ఒక గురువారం నాడు తనకు కూడా నాతో సాయిమందిరానికి రావాలనుందనే కోర్కెను వెల్లడించింది.  నాతో సాయి మందిరానికి వచ్చిన తరువాత బాబాను చూసి ముగ్ధురాలయి ప్రతి గురువారం బాబా గుడికి రావాలనుందని చెప్పింది.  మేము వెళ్ళిన ప్రతిసారి దారిలో బాబా గురించి ఆయన మహిమల గురించే ఎక్కువగా మాటాడుకునేవాళ్ళం.   

దురదృష్టవశాత్తు ఆమె అత్తగారికి బాబా అంటే యిష్టం లేదు.  ఆవిడకి, సుధ క్రొత్తగా  సాయిబాబాను పూజించడం యిష్టం లేకపోయింది.  ఆవిడనుంచి సుధకు వ్యతిరేకత ఎదురయింది.  సాయిబాబా గురించి వ్యతిరేకంగా అతి కఠినంగా మాట్లాడి సుధకి బాగా చివాట్లు పెట్టింది.  
               

              

ప్రతివారం సాయి మందిరానికి వెళ్ళద్దని హెచ్చరించింది.  నువ్వు సాయిబాబా మందిరానికి వెడుతున్నావంటే అదంతా సాయి యిష్టప్రకారమె జరరుగుతోందని సుధని ఓదార్చాను.  పిచ్చుక కాళ్ళకి దారం కట్టి లాగినట్లుగా బాబా తనభక్తులని తనవద్దకు రప్పించుకుంటారని చెప్పాను.  ఒక్కసారి కనక బాబా ఎవరినయినా తన భక్తునిగా అంగీకరించినట్లయితే యిక వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం లేదని నేను సుధకి నచ్చ చెప్పడంతో ఆమె తన అత్తగారి హెచ్చరికలని, వ్యతిరేక మాటలని లక్ష్యపెట్టలేదు. 

బాబాని పూజించడం మొదలు పెట్టినప్పటినుండి తను  ఒక విధమయిన మానసిక ప్రశాంతతను ఎంతో పొందుతున్నానని ఒక రోజున ఆమె నాతో చెప్పింది. "తొందరలోనే నేను నాలో ఉన్న కోపాన్ని జయించాను.  ఇతరులను క్షమించడం కూడా అలవాటయింది. నాలో ఉన్న మానసిక ఆందోళన, భయం అన్నీ మాయమయ్యాయి.  ఇప్పుడు ఏవిషయాలు నన్ను బాధించడంలేదు.  ఇది చాలా అద్భుతం" అని చెప్పింది సుధ.   

"ఇది నాకేమాత్రం విచిత్రమనిపించటంలేదు.  సాయిబాబా మనకు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తారు.  ప్రాపంచిక చెడుమార్గాలకు మనం లోను కాకుండా, ప్రమాదాల బారిన పడకుండా మనలని తప్పించి కాపాడుతారు" అని చెప్పాను.

"నాకు తెలియని విషయాలకీ, నామదిలో చెలరేగే ప్రశ్నలకి బాబానించి సమాధానాలు కూడా పొందుతున్నానని" చెప్పింది సుధ. 

సుధ సాయిమందిరాన్ని దర్శించేటప్పుడు ఆమెకి కొన్ని చిన్న చిన్న అనుభవాలు కలగటంతో సాయిబాబా మీద ఆమె నమ్మకం మరింతగా ధృఢపడింది.  ఒక గురువారం నాడు 'బాబా మందిరంలో కుంకుమని ప్రసాదంగా ఎందుకివ్వరని" నన్ను ప్రశ్నించింది.  అదేరోజున బెంగళూరునుండి ఒకావిడ మందిరానికి వచ్చి బాబాకి కుంకుమ అర్చన చేయించింది.  ఆరోజున మాకు ఊదీతోపాటుగా కుంకుమ కూడా ప్రసాదంగా  లభించింది.   
                       

ఇంకొకసారి బాబా మందిరానికి వెళ్ళినపుడు ఆమెకు బాబాని బోగన్ విల్లా (కాగితం పూలు) పూలతో అర్చించవచ్చా లేదా అనే సందేహం కలిగింది.  దానిని గురించి తెలుసుకోవాలనుకుంది.  బాబాని సుగంధపరిమళాలు వెదజల్లే లిల్లీ పూల తో (ట్యూబ్ రోజెస్) పూజించడం చూశాను గాని, ఆమె వేసిన ప్రశ్నకు నాకూ సందేహం కలిగింది. 

సరిగా అదేరోజున అప్పుడే బాబాకి తెల్లని లిల్లీ పూలతో అర్చన చేశారు. బాబాకి తెల్లటి లిల్లీపూలతో  అర్చన చేసిన తరువాత ఆయన మీదనుండి రాలిపడిన పూలలో ఎఱ్ఱటి బోగన్ విల్లా పూలు కూడా మాకు కనిపంచాయి. "బాబా నాప్రశ్నకు సమాధానమిచ్చారు" అని సుధ ఎంతో సంతోషపడిపోయింది.  మరొక గురువారం నాడు, మందిరంలో బాబావిగ్రహం వద్ద లక్ష్మీదేవి ఫొటో ఒక్కటి కూడా లేదేమిటి అంది.  మాయిద్దరి మనసులు ఉద్విగ్నతతో నిండి మేము ఆశ్చర్యపడేలా ఆరోజు బాబావారి విగ్రహం ముందు వెండి ఫ్రేముతో చేయబడ్డ లక్ష్మీదేవి ఫొటోను చూశాము.  మందిరంలో ఎవరో ఆఫొటోను తెచ్చి పెట్టారు.    
            

సాయిబాబా ఆవిధంగా క్రమంగా ఆమె మనసును ప్రభావితం చేసి,   ఆమె భక్తి మరింత ధృధపడేలా నాద్వారా  సహాయం చేశారు.  

"ఎవరయితే ప్రేమతో నానామాన్ని స్మరిస్తారో, ఉచ్చరిస్తారో వారి కోరికలన్నీ తీరుస్తాను, వారిలోని భక్తిని పెంపొందిస్తాను" అన్న బాబా మాటలు ఎంత వాస్తవం!

సుధ ఇప్పుడు ప్రతిరోజు సత్ చరిత్ర పారాయణ చేస్తూ, ప్రతీ గురువారం శ్రీసాయి శతసహస్రనామాలు చదువుతుంది.  మొట్టమొదట్లో ఆమె పూజించడానికి సాయిబాబా చిత్రపటాన్ని పూజగదిలో కాక హాలులో పెట్టింది.  కొద్ది నెలలతరువాత పూజగదిలో మిగతా దేవతా విగ్రహాలకి దూరంగా పెట్టింది.  ఇపుడు పూజగదిలో ఉన్న అందరి దేవతామూర్తులతో కలిసి బాబా కొలువై ఉన్నారు. 

క్రమక్రమంగా ఆమెలో ఈ మార్పు వచ్చింది.  ఏదో ఒకరోజున ఆమె బాబాలొనే దేవుళ్ళందరినీ చూడగలగే స్థాయికి చేరుకొంటుందని నేను భావిస్తున్నాను.

నా ప్రభావం వల్లనే తన జీవిత దృక్పధంలో గణనీయమయిన మార్పు వచ్చిందని సుధ నాతో అంటూ ఉంటుంది.  అది నావలన కాదనీ, అంతా సాయి అనుగ్రహంతోనే జరిగిందని చెప్పాను. 

"ఒక్కొక్కసారి మనం చేసిన పనులు చిన్నవే కావచ్చు.  కాని అవి అవతలి వ్యక్తియొక్క జీవితంలో ఎంతో ప్రముఖంగా ప్రభావాన్ని చూపి వారి జీవితంలో మంచి మార్పుని తీసుకొని వచ్చినపుడు అది మనకు శాశ్వతమయిన ఆనందం కలిగిస్తుందని" నాకెక్కడో చదివినట్లు గుర్తు.  సాయిబాబా నాకిటువంటి సంతృప్తిని కలిగించి, ఆయనతో నా సత్సంగాన్ని స్థిరపరిచారు.  
          

శ్రీమతి విజయా గోపాలకృష్ణ  
మైసూర్
సాయిప్రభ డిసెంబరు 1987    
సాయిబంధువులకు ఒక మనవి:  ప్రచురింపబడిన బాబా లీలను చదివారు కదా.  ఆంగ్లంలో బాబాని పూజించిన పూలు ట్యూబ్ రోజెస్ అని వుంది.  ట్యూబ్ రోజెస్ కోసం గూగుల్ లో వెతికినప్పుడు లిల్లీ పువ్వుల చిత్రాలు వచ్చాయి.  అందుచేత లిల్లీ పువ్వులు అని వ్రాయడం జరిగింది. ట్యూబ్ రోజ్ కి సరియైన అర్ధం లిల్లీపూలు సరియైనదేనా? ఒకవేళ తప్పయితే సరిదిద్దుకోవడానికి . ఎవరికయినా తెలిస్తే నా నంబరుకి ఫోన్ చేసి తెలపండి. లేక నా మైల్ ఐ.డి. కి పంపినా సరే. 

ఓంసాయిరాం   
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Friday, July 17, 2015

సాయిపై నమ్మకాన్ని ధృవపరచుకోవడం ఎలా? (collectd by http://telugublogofshirdisai.blogspot.in/2015/07/blog-post_17.html)



సాయిలీలాస్.ఆర్గ్ నుండి సేకరింపబడిన ఈ వ్యాసాన్ని చదివిన తరువాత  మనకు సాయిమీద ఎంత నమ్మకం, శ్రధ్ధ, భక్తి ఉన్నాయో పరిశీలించుకోవాలి.  నమ్మకాన్ని ఇంకా ఇంకా పెంచుకోవడం ఎలా అన్నది అర్ధమవుతుంది. దానికి అనుగుణంగా మనం ఆచరిస్తే తప్పక సత్ఫలితాలను, సాయి యొక్క నిరంతర అనుగ్రహాన్ని పొందగలం.  

సాయిపై నమ్మకాన్ని ధృవపరచుకోవడం ఎలా?

సాయిభక్తులెందరో "ఓ! బాబా, నీపై నాకు నమ్మకం కలిగేలా చేయి" అని ఎంతో ఉత్సహంతో అంటూ ఉంటామని నాతో చెబుతూ ఉంటారు.  ఇటువంటివారెనెందరినో చూశాను.  నాకుమాత్రం యిటువంటి వ్యక్తులతో ఓర్పుగా వ్యవహరించడం కష్టసాధ్యమయిన పని.  ఊరికే కూర్చుని నాకు సాయి మీద విశ్వాసం, భక్తి కుదరాలి అని అనుకున్న మాత్రం చేత ఏర్పడేవి కావు.  మనం కారు డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా, ఈత నేర్చుకోవాలన్నా, ఊరికినే కుర్చీలో కూర్చొని నాకివన్నీ రావాలి అనుకుంటే వచ్చేవు కావు.  కారు డ్రైవ్ చేయాలంటే డ్రైవింగ్ స్కూల్ కి వెళ్ళి నేర్చుకోవాలి.  అలాగే ఈతనేర్పేవారి వద్దకెళ్ళి ఈత నేర్చుకోవాలి.  నేర్చుకున్న తరువాత అభ్యాసం చేయాలి.  అప్పుడే మనం వాటిలోని మెళకువలు నేర్చుకొని ప్రావీణ్యం సంపాదిస్తాము.  
       

అలాగే మన జీవితంలో మనకు సాయిబాబా బలీయమైన స్థానం పొంది స్థిరంగా నిలచిపోవాలనుకున్నా యిదే సూత్రం వర్తిస్తుంది.  

బాబా మనజీవితంలో సుస్థిరంగా నిలచి ఉండాలంటే మొట్టమొదటగా మనం చేయవలసినది జీవితంలో ప్రతిక్షణం మనం సాయిబాబాకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి.  నమ్మకం అన్నది ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది.  కాని,  శ్రీసాయి సత్ చరిత్ర చదవకుండా, షిరిడీ దర్శించకుండా, సాయి అనుగ్రహానికి దూరంగా ఉంటే నీలో నమ్మిక అనేది ఎప్పటికీ రాదు.  అలాగే షిరిడీ వెళ్ళి సాయిని దర్శించుకున్నంత మాత్రం చేత కూడా నమ్మకం ఏర్పడదు.  సాయి శక్తిని మనలోకి ప్రవహింపచేసుకోవాలంటే నిరంతరం శ్రమించాలి.  సాయి శక్తి ఉన్నచోటకి వెళ్ళి నాలో సాయిశక్తి నిండిపోవాలి అని అనుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు.  శరీరం మొత్తం తడవకుండా మైకా కోటు, కాళ్ళకి బూట్లు వేసుకొని, వర్షంలో నిలబడితే శరీరం మీద ఒక్క వర్షపు చుక్క కూడా పడదు.  
ముఖ్యంగా కావలసినది సాయి మీద నమ్మకం.  బాబా చెప్పిన ఏకాదశ సూత్రాలను మననం చేసుకుంటూ ఉండాలి.  "ఆర్తులైన నేమి, నిరుపేదలైన నేమి, ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖసంపదలను పొందగలరు"   "ఈ ఫకీరు చాలా దయామయుడు.  మీ వ్యాధులను బాపి, మిమ్ములను ప్రేమ కరుణలతో రక్షించెదను" అని బాబా చెప్పారు. 


బాబా చెప్పిన ఈ వచనాలను చదివినవారు, (నేను ద్వారకామాయిని దర్శించుకున్నాను, బాబాను దర్శించుకున్నాను) నాకు బాబా చెప్పినట్లుగా ఎటువంటి కష్టాలు  తీరలేదు, నాకేమీ సుఖశాంతులు కలుగలేదు అని అన్నారంటే కుళాయిలోనుండి వచ్చే నీటి ప్రవాహాన్ని, కుళాయి కట్టివేసి ఆపినట్లుగా, మనలోనికి ప్రవహించే సాయి-దయ అనే ప్రవాహాన్ని నిరోధించడమే.  సాయినాధుడు తనతో మనలని అనుబంధం పెంచుకోవాలని కోరుకొంటారు.  నన్నే స్మరించువారిని నేనెల్లప్పుడూ గుర్తుంచుకుంటానని బాబా మాటిచ్చారు.  మనం మనస్ఫూర్తిగా, శ్రధ్ధ సబూరీతో ఆయననే స్మరిస్తూ, నిజాయితీగా ఆయనని ప్రార్ధిస్తూ బాబాపై నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన తప్పక మనకి సహాయం చేస్తారు.    

బాబాపై మనం చూపించే శ్రధ్ధ సబూరీలో మనకే సంతృప్తి లేదనుకోండి.  ఎందువల్ల?   దానికి కారణాలేమిటి అని మనం విశ్లేషించుకోవాలి.  మనకు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి.  మనలో కోపం, ద్వేషం, అసూయ, ఇతరులమీద ఆగ్రహం, భయం, అపరాధభావన, ఇలాంటివేమన్నా మనలో దాగి ఉన్నాయేమో  పరిశీలించుకోవాలి.  
   
    

కొన్ని విలాసాలను కూడా మనం త్యజించాలి.  వాటికి మనం లోబడి ఉండకూడదు.  వాటినుంచి మనం దూరంగా ఉండటానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసినపుడే వాటిని బయటకు తరిమివేయగలం.  అందువల్లనే బాబా "నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండాలని" బోధించారు.   
మనకి మనం ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుంటే, మనలో ఉన్న అవలక్షణాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకోగలుగుతాము.  దానితో మనకి కాస్త నిరాశ, దిగులు కలుగుతుంది.  కాని బాబాపై మనకున్న శ్రధ్ధకన్న, బాబాకు మనయందు విశ్వసనీయమైన ధృఢమయిన శ్రధ్ధ ఉందనే విషయం మనకి నమ్మకంగా తెలుస్తుంది.

"నాయందెవరి దృష్టి ఉన్నదో వారియందే నాదృష్టి" ఇది బాబా చెప్పిన భవిష్యవాణి.  ఒక్కసారి కనక మనము ఆయనకి అవకాశం యిస్తే ఆయన అనుగ్రహం మనలోకి ప్రవేశిస్తుంది. 

      

 బాబా ఏమార్గాన్నెంచుకుంటారు అన్నదాని గురించి నేను మాట్లాడుతున్నాను.  అదే  నమ్మకం.  మనందరికి ఆశక్తి ఉంది.  దానిని ఎలా ఉపయోగించాలన్నదే మనం నేర్చుకోవాలి. 

బాబా మనకు చెప్పిన అమృతతుల్యమయిన, అభయ వచనాలు మనచెవులలో మార్మోగుతూనే ఉన్నాయి కదా!  "నాయందు నమ్మకముంచండి.  ఈభౌతిక దేహానంతరము కూడా నేనప్రమత్తుడనే.  నా సమాధినుండే నామానుష శరీరము మాటలాడును. నా ఎముకలు మాటలాడును.  నన్నాశ్రయించువారిని, నన్ను శరణు జొచ్చువారిని నిరంతరంగా రక్షించుటయే నాకర్తవ్యము". 

బాబా చెప్పిన ఈమాటలు నూటికి నూరుశాతం యదార్ధమని నమ్మకముంచండి.  ఇది వంచనకాదు.  ఆధ్యాత్మికంగా ఆచరించదగ్గవి.  ఆచరణలో పెట్టినంతనే అద్భుతమయిన ఫలితాలను మనం అనుభవించవచ్చు.   

విజ్ఞానశాస్త్రంలో ఒక సిధ్ధాంతాన్ని అది నిజమవునా కాదా అని నిరూపించాలంటే ప్రారంభంలో  ప్రయోగాలు చేసి నిర్ధారించాలి.

ఎన్నోమారులు మరలా మరలా ఆచరణలో పెట్టి ఫలితాన్నిస్తుందని నేను స్వయంగా తెలుసుకున్నాను.  అందుచేత సందేహించేవారికి, చంచల మనస్కులకి నేను చెప్పదలచుకున్నదేమిటంటే, అపనమ్మకం అనేది మనసులో పెట్టుకోకుండా నమ్మడానికి ప్రయత్నం చేయండి. నిజాయితీగా నమ్మకాన్నే ఆచరిస్తూ  దానికి కట్టుబడి ఉండటానికే ప్రయత్నం చేసినట్లయితే మన నమ్మకం యొక్క స్థాయి యింకా యింకా పెరగడం ప్రారంభమవుతుంది.  నమ్మేకొద్దీ యింకా ధృఢతరమవుతుంది.



ప్రముఖ సైకాలజిస్టు విలియం జేంస్ చెప్పిన మాట *"నమ్మకం నిద్రాణమైన స్థితి అన్న కావచ్చు లేదా తీవ్రమైన జ్వరమైనా కావచ్చు" ...సాయిబంధువులకు కావలసినది అదే.   

అద్భుతమయిన బాబావారి ప్రేమ , జ్ఞానం వీటితో  మమేకమై ఉన్న సాయి భక్తులకు యింకేమికావాలి?  ప్రయత్నించి చూడండి.   

(విశ్లేషణ: బాబా చరిత్ర పారాయణ చేసేవారికి, బాబాను దర్శించుకునేవారికి నమ్మకం ఉండబట్టే బాబాతొ సాన్నిహిత్యం ఏర్పడింది.  అందరికీ నమ్మకం అనేది ఉంది.  ఇక్కడ నిద్రాణమైన స్థితి అంటే ఎవరికి  వాళ్ళం ఆత్మ విమర్శ చేసుకోవాలి.  నమ్మకం ఉండబట్టే పారాయణ చేస్తున్నాము.  కాని ఇక్కడ నమ్మకం తీవ్రమైన జ్వరం అని విలియం జేంస్ అన్న దానికి అర్ధం మన మనసులో నమ్మకం తీవ్రంగా ప్రజ్వలిస్తూ ఉండాలి.  అంతటి తీవ్రమైన నమ్మకం ఉన్న సాయి భక్తులు కొంతమంది ఉన్నారు, ఉంటారు.  సాయి సత్ చరిత్ర పారాయణ చేసే వీరు, బాబా చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు.  ఎదటివారిని అందరినీ కూడా సాయీ అనె సంబోధిస్తూ ఉంటారు. ఆఖరికి రైలు లో టీ అమ్మే వానిని కూడా సాయీ టీ పట్టుకురా అని అనడం కూడా నేను చూశాను. ఎదుటివారిలో కూడా సాయే ఉన్నాడనే భావన రావాలి. అంటే ప్రతినిమిషం సాయిని తలచుకుంటూ ఉంటారు.  అంటే సాయిమీద అంత నమ్మకం పెట్టుకున్నారన్నది మనకి అర్ధమవుతుంది.  అందు చేత నిద్రాణస్థితిలో ఉన్న నమ్మకాన్ని తీవ్రతరం చేసుకోవాలి.   (త్యాగరాజు ) 

ఎం.కే.ఎస్.సీతవిజయకుమార్
కిల్ కోటగిరి ఎస్టేట్
కిల్ కోటగిరి - 643216
నీల్ గిరిస్
(సాయిప్రభ జూలై 1987)
    

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)