Total Pageviews

Thursday, August 15, 2013

’చాగంటి మహాశయా! ఇది మీకు తగునా?’

 
చాగంటి మహాశయా! ఇది మీకు తగునా?’ ఆగస్టు సంచిక కవర్ కధనం సాయి భక్తుల మనోభావాలను ప్రతిబింబించింది. ఒక విధంగా చెప్పాలంటే పీఠాధిపతులతో సరి సమానమైన స్థాయిలో కూచుని ప్రవచించే వారు కోట్లాదిమంది పారాయణ చేసే గ్రంధం గురించి అటువంటి వ్యాఖ్యానాలు చేయడం వారి మాటలలోనే చెప్పాలంటే వారికి అత్యంత గౌరవనీయులైన శంకర భగవత్పాదులు కూడా ’అసహ్యించుకుంటారు’. సాయి తత్త్వమ్ పేరిట వారు చేసిన ప్రవచనం లో ’లోపలికి వస్తూ బాబా వారి పుస్తకం లొ ఒక పేజీ ని అలా తిరగేసాను, ఈకధ వచ్చింది’ అనడంలో  వారి పాండిత్యాన్ని ప్రదర్శించాలన్న తపనా, మరియూ ఒకసారి చూస్తే చాలు మొత్తమ్ చెప్పెయగలను అన్న భావనా వినిపించాయి. విమర్శిస్తున్న భావన రానీయకుండా తన పాండిత్యంతో ’అసహ్యం, తాడూ బొంగరమ్ లేని కధలూ, పాపం, పారాయణ వలన ఏమి లాభం’ వంటి పదాలను అలవోకగా వాడేసారాయన. ఆకలేసిన వాడికే అన్నం విలువ తెలుస్తుంది. అనుభవించిన వారికే సచ్చరిత్ర పారాయణ ఫలం అర్దమవుతుంది.
ఓంసాయి రామ్
సచ్చరిత్ర
ను విమర్శించడం మహా పాపం సాయి భక్తులకు సచ్చరిత్ర భగవద్గీత శ్రీ చాగంటి గారు కోరికలతో సచ్చరిత్ర ను పారాయణ చేయకూడదు అన్నారు . కోరికలు లేని మానవుడు గాలి ని ప్రదేశం విశ్వం లో ఎక్కడలేదు సచ్చరిత్ర మన మానవ జీవితం లో ప్రతి సమస్యకి పరిష్కారం ఒక్క సచ్చరిత్ర లో లభిస్తుంది  ఇది  చాల మంది సాయి భక్తుల అనుభవం సాయి కి సత్చరిత్ర కు తెడా లేదు సత్చరిత్ర ని విమర్శించడం సాయి ని విమర్శించి నట్లీ సతి మనిషిని విమర్శించడం పాపం అని సాయి చెప్పారు   వారికీసరి అయిన సమాధానం సాయి నుండి తప్పక వస్తుంది సత్చరిత్ర తో సాయి భక్తుల అనుభవాలు సేకరించి సాయి సన్నిధి లోప్ర చు రంచడం సాయి భక్తులందరికీ ఉపయోగారకం ఉంటుందని నా ప్రార్ధన చాగంటి గారు విమర్శించినంతమాత్రమున సత్ చరిత్రని పారాయణం  నిజ మయిన సాయి భక్తులు మానరు సత్చైత్ర ఇంట్లో వుంటే     సాయి వున్న ట్లీ
సాయి ఆశ్రితురాలు శ్రీ లక్ష్మి సుకన్య
నెల్లూరు

0 comments:

Post a Comment