Total Pageviews

Thursday, March 20, 2014

మనోనిగ్రహము గురించి బాబా నానాకు బోధించుట:


ఒకనాడు బీజాపూరు నుంచి ఒక మహమ్మదీయ కుటుంబము బాబా దర్శనార్ధమై వచ్చెను. వారిలో ఇద్దరు ఘోషా స్త్రీలు కలరు. వారు మసీడులోనికి వచ్చి బాబా ఎదురుగా మోములపై గల ముసుగు తొలగించి నమస్కరించిరి. వారిలో ఒకామె చక్కదనాల చుక్కవలె అత్యంత సుందరంగా ఉండెను. బాబాకు ప్రక్కనే కూర్చున్న నానా యొక్క మనస్సు చలించెను. ఆమెను ఇంకోక్కసారి చూడాలనిపించెను. అది గమనించిన బాబా నానా తొడపై చేతితో కొట్టెను. వారు వేల్లిపోయిన తరువాత బాబా నానాతో “నిన్నేలకొట్టితిని” అని ప్రశ్నిస్తాడు. నామనోవికారమును గుర్తించి మీరు నన్ను కొట్టారని నానా జవాబిస్తాడు. అవును నీవు చూచిన యువతి మిక్కిలి సౌందర్యవతి. ఆమెను భగవంతుడు అంత మనోహరంగా సృష్టించాడు. భగవంతుడు సృష్టించిన ఆమె అంతా అందంగా ఉంటె, ఆమెను సృష్టించిన భగవంతుడు ఎంత అందంగా ఉంటాడో ఆలోచించావా!
మనం ఆలోచించవలసినది అందమైన ఈ సృష్టిని నిర్మించిన నిర్మాతనుగాని ఇందులో గల వస్తువులను కాదు. గుడికి పోవునది దేవుని కొరకుగాని గుడిపై గల శిల్పాల కొరకు కాదు. మనస్సు ఇంద్రియములతో ఐక్యమైనప్పుడే అది చలిస్తుంది. ఈ శరీరం ఒక రథంలాంటిది. బుద్ధి రథసారధి. ఇంద్రియాలు గుర్రాలు. గుర్రముల పగాలను రథసారధి గట్టిగా పట్టుకున్నచో గుర్రములు సరిగా ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరగలడు. అట్లు గాక సారధికి గుర్రములపై అదుపు తప్పినచో వాటి ఇష్టము వచ్చినట్లుగా ప్రయాణించును. గమ్యస్థానము చేరలేము. బుద్దితో ఇంద్రియాలను అదుపు చేయగలవారు మాత్రమె ఆధ్యాత్మికంగా ముందుకు పోగలరు.
ఓం నమో పరమాత్మయే నమః

0 comments:

Post a Comment