Total Pageviews

Thursday, September 4, 2014

Shri Sai Baba Archana (108 Names)

11. Aum Kaalaaya Namah!
Prostrations to Him, Who is impartial Kala, the all destroying Death!
(Chanting this Nama 108 times everyday diminishes the fear of death).


12. Aum Kaala kaalaaya Namah!
Prostrations to Him, Who subdues even the All Powerful Kaala or Yama! 
No being on earth refuse the power of Kaala or Yama. But BABA stopped the death of Ramachandra Patil. He stopped & pulled the death of Tatya towards Him. When Buti was warned by Dengale on danger to his life, Baba challenged that let us see how the death comes to him.


13. Aum Kaala Darpa Damanaaya Namah!
Prostrations to Him, Who humbles the pride of Kaala, the eternal time spirit i.e. Death.
GK Rege, Tahasildar of Indore & his wife were ardent devotees of Sai. Due to serious illness, their youngest daughter, Prema died in her mother's lap. The couple prayed Sai wholeheartedly. Rege took the girl into his arms & put Ganga water mixed with Baba's UDI into the dead girl's mouth repeatedly. After some time the dead girl came back to life. She was obviously snatched from the jaws of death by Baba's grace. Thus He is Kaala Darpa Damana.


14. Aum Mrutyunjayaaya Namah!
15. Aum Amartyaaya Namah!
Prostrations to Him, Who has conquered Death.
Prostration to Him, Who is Immortal, Eternal & Imperishable. 
(These two Nama could be explained together).
Though walked on earth while in physical form, Sai was always seemed to belong to the extra terrestrial spheres. He took a human form to fulfil a mission & after fulfilling it He passed into eternity to which He always belonged as per Ch 43, 45 Sri Sai Satcharita. He is therefore called rightly Mrutyunjaya.
Thousands of devotees experience the veracity of His 11 Assurances. SAI is even now giving darshan in dreams or in His Subtle Form.


16. Aum Martyaabhaya Pradaaya Namah!
Prostrations to Him, Who is bestower of freedom from the fear of death.
Baba counselled Smt Kulkarni to face the last moments of her husband. Advised Kaka Dixit to accept death as inevitable when his daughter died.
17. Aum Jeevaadhaaraaya Namah!
18. Aum Sarvaadhaaraaya Namah!
These two namas like 14 & 15 should be explained together as both the Namas lay emphasis on Sai being the 'aadhaara' (Support) of animates & inanimates. Nama 17 speaks of Sai being the sustainer of all animate things, i.e all living beings & plant life while Nama 18 describes Sai as the Support of all in the manifested Universes including the galaxies, stars, planets, Solar Systems, comets, subtle elements, living beings, plant lie as well as inanimate objects.
To Satyabhamabai Tarkhad & Lakshmibai Shinde He said He was the dog, to M W Pradham He said He was the crow, to Nana Chandrorkar He said He was ant & as a Bhil quenched his thirst.
Prostrations to Him, Who is the sustainer of All Animates & Inanimates as well.

19. Bhaktaavana Samarthaaya Namah!
Prostrations to Him, Who is ever competent to attend to the welfare of His devotees.
Baba's hand of protection for the welfare of His devotees is evident in many cases. His response to the devotees' call for help is as eager, as ardent & as urgent as the devotees' call itself. He protects His devotees life after life so as to help them to attain eternal peace & bliss.

20. Aum Bhaktaavana Pratijnyaaya Namah!
Prostrations to Him for His Vow of Protection to His devotees.
Baba used to tell His devotees 'You are My children. I am your Father. I have come to take care of you. Sit quiet. UGE MUGHE. I will do the needful. I shall take to the end'. Provided what he wanted to Dasganu, pension to Raghunath Tendulkar were some of the instances. Baba' protection to GS Khaparde, Nana Chadorkar is well known. Why should you fear, when I am here was His assurance even after Maha Samadhi.

Instances of Him making the food more than
 sufficient when the invited guests exceed are recorded in Satcharita.
Under instructions from Sai Purandhare prepared food for 5 fakirs & they came. While taking leave they informed Purandhare that 20 more fakirs would follow. Unrelented Purandhare put some UDI & served.
There was another such incident in 1943 when A B Chogule, a senior Sub Judge & ardent Sai Devotee was saved from the similar situation. Thus Sai is provider of Anna (FOOD) & Vastra (CLOTHING).
On way to My Guide, My Guru & My God's abode, Shirdi.


Wednesday, September 3, 2014

బాబాకు ఇవ్వగలిగిన దక్షిణ

బాబాకు ఇవ్వగలిగిన దక్షిణ
ఒక టీచరు తరగతిలో ఉన్న విద్యార్ధులందరికీ పాఠాలు చెప్తుంది. అందులో కొందరు విద్యార్ధులు టీచరు చెప్పిందల్లా చేస్తారు, చక్కగా రోజు హోంవర్క్ చేస్తారు, తరగతిలో మౌనంగా ఉంటారు, ఎవరితోనూ గొడవపడరు. కొందరు బాగా అల్లరి చేస్తారు. హోంవర్క్ చేయరు, చదవరు. అందరితోనూ గొడవపడతారు. కాకపోతే రోజుకు పదిసార్లు పొగుడుతున్నారుకోండి, టీచరు ఎవరిని ఇష్టపడుతుంది?......... తన చెప్పినట్టుండే వారంటే ఎక్కడలేని ప్రేమ చూపిస్తుంది. ఆకతాయిల మాటలను పట్టించుకొకపోగా, అవన్నీ వట్టిమాటలని కొట్టిపారేస్తుంది.

దేవుడు కూడా అంతే.తన చెప్పినట్టు జీవించకుండా, నిత్యం ఎన్ని పూజలు చేసిన పెద్దగా పట్టించుకోడు. తను చెప్పిన మార్గంలో నడిచేవారు, తన చెప్పినట్టుగా జీవించేవారి పట్ల అమితమైన ఇష్టం చూపిస్తాడు, నిరంతరం అనుగ్రహం ప్రసరిస్తాడు. వారు ఒక్క నమస్కారం చేసినా పొంగిపోతాడు.
షిరిడీ సాయినాధుడు సద్గురువు. ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి మానుషరూపంలో భూమికి వచ్చిన మహాపురుషుడు.
బాబా జీవితమే ఒక సందేశం. అందరిని ప్రేమించమన్నారు, దీనులను ఆదరించమన్నారు. బాబా రోజు బిక్ష యాచించి, తీసుకువచ్చి ఒకపాత్రలో వేసి పశుపక్ష్యాది జీవులకు ఆహారంగా అందిచేవారు. సర్వ జీవుల యందూ దయకలిగి ఉండమన్నారు.
రోగంతో ఉన్నవారిని డబ్బు సహాయం చేయలేకపోవచ్చు, కనీసం మాట సాయమైన చేసి ధైర్యం ఇవ్వచ్చు. వారికి మనం ప్రేమను పంచవచ్చు. అసహ్యనించుకోకుంటే చాలు. ఇంతకంటే మన నుండి బాబా ఏమి ఆశిస్తాడు చెప్పండి.
మరి మనం చేస్తున్నదేంటి? మన చుట్టు నిత్యం అనేక జీవరాశులు నీరు, ఆహారం లేక మరణిస్తుంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో చాలా తీవ్రంగా ఉంటుంది పరిస్థితి. మనం రోజు వాటికి కాసిన్ని నీరు త్రాగడానికి అందుబాటులో పెట్టలేమా? మిగిలిపోయిన అన్నం చెత్తబుట్టలో పడేస్తాం కదా. అలా వృధా చేసేకంటే మన ఇంటిముందున్న వీధికుక్కకు ఆ అన్నంలో కొంచం పాలో, మజ్జిగో కలిపి పెట్టచ్చు కదా. వాటి మీద కాసింత ప్రేమ చూపించవచ్చు కదా. ఊర్లో ఉన్న అన్నిటికి పెట్టక్కర్లేదు, మన పరిసరాల్లో ఉన్నవాటి జీవనానికి సాయపడచ్చు.
ఇలా బాబా మనకు చెప్పిన సందేశాలను ఆచరించి ఒక్కసారి బాబా ముందుకెళ్ళి నిల్చుని "నువ్వు చెప్పినట్టుగానే చేస్తున్నా బాబా" అని చెప్పండి. ఎంత ఆనందపడతాడు, ఎంత సంతోషిస్తాడు. మనస్ఫూర్తిగా చేస్తే ఆశీర్వదిచడమే కాదు, తప్పకుండా దర్శన భాగ్యం కూడా ఇస్తాడు. ఇచ్చి తీరుతాడు.
మనం బాబాకు ఇవ్వగలిగిన దక్షిణ "సహనం, శ్రద్ధ". ఆయన మార్గంలో మనస్ఫూర్తిగా నడవడమే ఆయనకు ఇచ్చే గౌరవం.
ఓం శ్రీ సాయినాధాయ నమః

Shri Sai Baba Archana (108 Names)

1. AUM SHRI SAINATHAYA NAMAH.
Dressed as a Faqir when came to Shirdi with a marriage party nobody knew anything about HIS birth, religion or caste. The priest of Khandoba Temple called him YA SAI. Since then HE is called as SAI, the peace incarnate. Reciting HIS name is as purifying as a dip in the holy Ganges. (Those who wish to have SAI DARSHAN @ Shirdi chants this name constantly surely have HIS DARSHAN @ Shirdi).


2. Aum Shri Lakshmi Narayanaya Namah!
Prostrations TO Him, Who has the wondrous form of Goddess Lakshmi with Lord Narayana.
(Chant this nama everyday to overcome Finance Problems).


3. Aum Krishna Rama Shiva Maruthyadhi Rupaya Namah!
Prostrations to Him, Who appears in the Divine Form of Lord Krishna, Rama, Shiva & Hanuma to prove that He allows worship as desired by devotee.


4. Aum Seshasaine Namah!
Prostrations to Him, Who has His Yogic Sleep on Divine Serpent - Adi Sesha!
(Chanting this Nama 108 times everyday before embarking on any new venture would lead in right path & success).


5. Aum Godhavarithata Shiladii Vaasine Namah!
Prostrations to Him, Who has taken Shirdi near the shores of the Holy river Godavari as His Abode!



6. Aum Bhaktha Hridayalayaya Namah!
Prostrated to Him, Who is seated in heart of HIS devotees, which is as holy as temple.



7. Aum Sarvahrunnilayaya Namah!
Prostration to Him, Who is the Universal Self in all the hearts of all beings.


8. Aum Bhoothaavaasaaya Namah!
Prostrations to Him, Who dwells in all beings - animate & inanimate.


9. Aum Bhootha Bhavishyadhbhava Varjithaya Namah!
Prosrations to Him, Who is bereft of Past, Future & Present.


10. Aum Kaalaatheethaaya Namah.
Prostrations to Him, Who is the eternal time & greater than the dutiful & munificent, Kaala.

SAI BABA ASHTOTTARA SATA NAMAVALI – TELUGU

ఓం సాయినాథాయ నమః
ఓం లక్ష్మీ నారాయణాయ నమః
ఓం శ్రీ రామకృష్ణ మారుత్యాది రూపాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం గోదావరీతట శిరడీ వాసినే నమః
ఓం భక్త హృదాలయాయ నమః
ఓం సర్వహృద్వాసినే నమః
ఓం భూతావాసాయ నమః
ఓం భూత భవిష్యద్భావవర్జతాయ నమః 
ఓం కాలాతీ తాయ నమః || 10 ||
ఓం కాలాయ నమః
ఓం కాలకాలాయ నమః 
ఓం కాల దర్పదమనాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః 
ఓం అమర్త్యాయ నమః
ఓం మర్త్యాభయ ప్రదాయ నమః
ఓం జీవాధారాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం భక్తా వన సమర్థాయ నమః
ఓం భక్తావన ప్రతిఙ్ఞాయ నమః || 20 ||
ఓం అన్నవస్త్రదాయ నమః 
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః 
ఓం ధన మాంగల్యదాయ నమః
ఓం బుద్ధీ సిద్ధీ దాయ నమః 
ఓం పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః 
ఓం యోగక్షేమ మవహాయ నమః
ఓం ఆపద్భాంధవాయ నమః
ఓం మార్గ బంధవే నమః
ఓం భుక్తి ముక్తి సర్వాపవర్గదాయ నమః
ఓం ప్రియాయ నమః || 30 ||
ఓం ప్రీతివర్ద నాయ నమః
ఓం అంతర్యానాయ నమః 
ఓం సచ్చిదాత్మనే నమః
ఓం ఆనంద దాయ నమః
ఓం ఆనందదాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం ఙ్ఞాన స్వరూపిణే నమః
ఓం జగతః పిత్రే నమః || 40 ||
ఓం భక్తా నాం మాతృ దాతృ పితామహాయ నమః 
ఓం భక్తా భయప్రదాయ నమః 
ఓం భక్త పరాధీ నాయ నమః
ఓం భక్తానుగ్ర హకాతరాయ నమః 
ఓం శరణాగత వత్సలాయ నమః
ఓం భక్తి శక్తి ప్రదాయ నమః
ఓం ఙ్ఞాన వైరాగ్యదాయ నమః
ఓం ప్రేమప్రదాయ నమః 
ఓం సంశయ హృదయ దౌర్భల్య పాపకర్మవాసనాక్షయక రాయ నమః
ఓం హృదయ గ్రంధభేద కాయ నమః || 50 ||
ఓం కర్మ ధ్వంసినే నమః 
ఓం శుద్ధసత్వ స్ధితాయ నమః
ఓం గుణాతీ తగుణాత్మనే నమః
ఓం అనంత కళ్యాణగుణాయ నమః
ఓం అమిత పరాక్ర మాయ నమః 
ఓం జయినే నమః 
ఓం జయినే నమః
ఓం దుర్దర్షా క్షోభ్యాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం త్రిలోకేసు అవిఘాతగతయే నమః 
ఓం అశక్యర హితాయ నమః || 60 ||
ఓం సర్వశక్తి మూర్త యై నమః
ఓం సురూపసుందరాయ నమః
ఓం సులోచనాయ నమః 
ఓం మహారూప విశ్వమూర్తయే నమః 
ఓం అరూపవ్యక్తాయ నమః
ఓం చింత్యాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం సర్వాంత ర్యామినే నమః
ఓం మనో వాగతీతాయ నమః 
ఓం ప్రేమ మూర్తయే నమః || 70 ||
ఓం సులభ దుర్ల భాయ నమః
ఓం అసహాయ సహాయాయ నమః 
ఓం అనాధ నాధయే నమః 
ఓం సర్వభార భ్రతే నమః 
ఓం అకర్మానే కకర్మాను కర్మిణే నమః
ఓం పుణ్య శ్రవణ కీర్త నాయ నమః
ఓం తీర్ధాయ నమః 
ఓం వాసుదేవాయ నమః
ఓం సతాంగ తయే నమః
ఓం సత్పరాయణాయ నమః || 80 ||
ఓం లోకనాధాయ నమః
ఓం పావ నాన ఘాయ నమః 
ఓం అమృతాంశువే నమః
ఓం భాస్కర ప్రభాయ నమః
ఓం బ్రహ్మచర్యతశ్చర్యాది సువ్రతాయ నమః
ఓం సత్యధర్మపరాయణాయ నమః
ఓం సిద్దేశ్వరాయ నమః
ఓం సిద్ద సంకల్పాయ నమః 
ఓం యోగేశ్వరాయ నమః
ఓం భగవతే నమః || 90 ||
ఓం భక్తావశ్యాయ నమః
ఓం సత్పురుషాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం సత్యతత్త్వబోధ కాయ నమః
ఓం కామాదిష డైవర ధ్వంసినే నమః
ఓం అభే దానందానుభవ ప్రదాయ నమః
ఓం సర్వమత సమ్మతాయ నమః
ఓం శ్రీదక్షిణామూర్తయే నమః
ఓం శ్రీ వేంకటేశ్వర మణాయ నమః
ఓం అద్భుతానంద చర్యాయ నమః || 100 ||
ఓం ప్రపన్నార్తి హరయ నమః
ఓం సంసార సర్వ దు:ఖక్షయకార కాయ నమః
ఓం సర్వ విత్సర్వతోముఖాయ నమః
ఓం సర్వాంతర్భ హిస్థితయ నమః
ఓం సర్వమంగళ కరాయ నమః
ఓం సర్వాభీష్ట ప్రదాయ నమః
ఓం సమర సన్మార్గ స్థాపనాయ నమః
ఓం సచ్చిదానంద స్వరూపాయ నమః
ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః || 108 ||

Saturday, August 30, 2014

శ్రీ సాయి సత్ చరిత్ర-----------బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన యభయప్రధానవాక్యములు

హేమాడ్ పంతు మనకొక కొత్తరకము పూజావిధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుట కానందబాష్పములనే వేడినీళ్ళ నుపయోగించెదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢవిశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్త్వికభావము లనెడు ఎనిమిది తామరపుష్పములు సమర్పించెదముగాక. ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించెదముగాక. భావమను బక్కా వారి శిరముపై జల్లి భక్తియనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటనవ్రేళ్ళపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో నలంకరించి మన సర్వమును వారికి సమర్పింతుముగాక. వేడిని తొలగించుటకు భక్తియనే చామరమును వీచెదముగాక. అట్టి యానందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించెదముగాక.

"మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివయిపు పోవునటుల జేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును దెలిసికొను శక్తి దయచేయుము. ప్రపంచవస్తువులందు మాకు గల యాసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును, ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖ దుఃఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీన మందుంచుకొనుచు నీ యిష్టము వచ్చినటుల చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక.”
"ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. నీ గురునియందే యాశ్రయము నిలుపుము; ఎల్లప్పుడు నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి యుండుము." పంతు ఈ మాటలయొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు తన జీవితములో బాబా చేసిన యీ మేలును మరువలేదు.
బాబా పాదములకు వినయముతో సాష్టాంగనమస్కారము చేసి వారి పాదముల నొత్తుచు కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన యుపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో నిట్లనియె. "నీ యాలోచనలు, సంశయములు, భయోత్పాతములు, ఇప్పుడు చల్ల బడినవా? ఎవరికయితే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును." దేవునివలె యోగీశ్వరులు కూడ తమ భక్తులపయి నాధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను, మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. "గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు. నీ యనుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి, బాధ యనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాల మేల నీకర్మ ననుభవించరాదు? గత జన్మముల పాపముల నేల తుడిచివేయ రాదు? దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము."
మానవుడు సముద్రములో మునుగగానే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానముచేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందముల నాశ్రయింపగనే, త్రిమూర్తులకు (బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు) నమస్కరించిన ఫలముతోపాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితముకూడ లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రము, మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగ జేయునట్టి శ్రీ సాయిమహారాజునకు జయమగు గాక. ఓ సాయీ! నీ కథలందు మాకు శ్రద్ధను కలుగజేయుము. చాతకపక్షి మేఘజలము త్రాగి యెట్లు సంతసించునో, అటులనే నీకథలను చదువువారును, వినువారును, మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు విను నప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్వికభావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించగాక; వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక; వారి ప్రాణములు స్థిరపడుగాక; వారి మనస్సులు ఏకాగ్రమగుగాక; వారికి గగుర్పాటు కలుగుగాక; వారు వెక్కుచు ఏడ్చి వణకెదరుగాక; వారిలోగల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో, గురువుగారి కటాక్షము వారి పైన ప్రసరించినదను కొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు, గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధములనుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకశరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే యాపని చేయగలరు. సర్వజీవకోటియందును భగవంతుని చూచునట్లు చేయగలరు.
"ఓ శ్యామా! యీ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది, కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధ పడితిని, నా హృదయము కొట్టుకొనెను. నా జీవిత మపాయములో నుండెను. అట్టి సందిగ్థస్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా! అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని యనుకొంటిని. అందుచే దీనిని నీ కిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజున కొక నామము చదివినను మేలు కలుగజేయును." విష్ణుసహస్రనామ పారాయణము చిత్తశుద్ధి కొక విశాలమయిన చక్కటి మార్గముగురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించు చున్నది. ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసికొనవలెను. వారిద్దరికి మధ్య భేదము లేదు. ఇద్ద రొకటే. ఒకరు లేనిదే మరియొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద బెట్టుట, బాహ్యదృశ్యమేగాని, యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య బేధము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును.
సాయి యనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతము సకలజీవులందు నివసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు, ఆత్మాసాక్షాత్కారవిద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్య ముండుటచే వారు సద్గురువు లనిపించు కొనుటకు సమర్థులు. పండితులయినప్పటికి శిష్యుల నెవరైతే ప్రేరేపించి యాత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగ తండ్రి శరీరమును పుట్టించును. పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని, సద్గురువు చావుపుట్టుకలను రెంటిని దాటింతురు కాబట్టి వారందరికంటె దయార్ద్రహృదయులు.

సాయిబాబా యనేకసారు లిట్లు నుడివిరి. "నా మనుష్యుడు ఎంత దూరమున నున్నప్పటికి, 1000 క్రోసుల దూరమున నున్నప్పటికి, పిచ్చుక కాళ్ళకు దారము కట్టియీడ్చినటుల అతనిని షిరిడీకి లాగెదను." ." బాబా తిరిగి యిట్లు జవాబిచ్చెను. "ప్రవేశించుటకు నాకు వాకిలి యవసరము లేదు. నాకు రూపము లేదు. నేనన్నిచోట్ల నివసించుచున్నాను. ఎవరయితే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి యుందురో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను."
బాబా యామె కిట్లనెను. "నాయందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రికశాస్త్రజ్ఞుల పలుకు లోకప్రక్కకు ద్రోసి, తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంతమనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచు మనుము. నిరుత్సాహము చెందవద్దనుము." గ్రహములు వ్యతిరేకముగా నున్నను, బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును; మనల పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో, మన ప్రయత్నములన్నియు తుదకు విజయవంతమగును. వరికేది క్షేమమో వారికే తెలియును.

దయామయుడు, భక్తవత్సలుడునగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శనమాత్రమునే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణస్వరూపులైనను, భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తుల కాత్మసాక్షాత్కారము కలిగించుటే యోగుల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమ మైనది, తప్పనిసరి యైనది. వారి పాదముల నాశ్రయించిన వారి పాపము లెల్ల నశించును. అట్టివారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రములనుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి, గాయత్రీమంత్రమును జపించెదరు. దుర్బలులము, పుణ్యహీనుల మగుటచే భక్తి యనగా నేమో మనకు దెలియదు. మనకింత మాత్రము తెలియును, ఇతరులు మనలను విడిచి పెట్టునప్పటికి సాయి మాత్రము మనలను విడువరు. వారి కృపకు పాత్రులైనవారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్యవివేకములను పొందెదరు.

భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వానిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది, కృతజ్ఞతతో నుండెదరు. కాని మేము వారికి సాష్టాంగనమస్కారము చేసి, వేడు కొనెదము. మా తప్పులన్నియు క్షమించి సాయి మా యారాటములన్నియు బాపుగాక. కష్టములపాలై సాయి నీవిధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి, బాబా కటాక్షముచే వారు సంతుష్టి నొందెదరు.

దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగెనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత యెంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము గాని, శ్రమగాని కానరాకుండెను. తన వాక్కును, కలమును గూడ ప్రేరేపించుటకు శక్తివంత మగు జ్ఞానమనే వెలుతురుండగా నతడు సంశయము గాని, ఆరాటము గాని పొందనేల? అతడు వ్రాసిన యీ పుస్తకరూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది యతని గత జన్మల పుణ్యపరంపరచే ప్రాప్తించెను. కావున నాతడదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను.

ఈ క్రింది కథ సాధారణ కథ కాదు; స్వచ్ఛమైన యమృతము. దీని నెవరు త్రాగెదరో, వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును దెలిసికొందురు. వాదించు వారు, విమర్శించువారు ఈ కథలను చదువనక్కరలేదు. దీనికి కావలసినది యంతులేని ప్రేమ, భక్తి; వివాదము కాదు. జ్ఞానులు, భక్తివిశ్వాసములు గలవారు లేదా యోగులసేవకుల మనుకొనువారు, ఈ కథల నిష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మకథ లనుకొందురు. అదృష్టవంతులయిన సాయిభక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువుల కిది సాధనగా నుపకరించును
ఎవరయిన యోగీశ్వరుని చూడవలె ననుకున్నచో, ఆ యోగియేగాక దైవముకూడ అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యధార్థముగా యోగియు, భగవంతుడును నొకరే వారిలో నేమియు భేదము లేదు. ఎవరైన తానై పోయి యోగిని దర్శించుటన్నది యుత్తబూటకము. యోగి సంకల్పించనిదే వారిని జూడగలుగు వారెవరు? అతని యాజ్ఞ లేక చెట్టు ఆకు గూడ కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తివిశ్వాసములు జూపునో, యంత త్వరగాను, బలముగాను, అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగతసన్నాహము లొనర్చును. కాకాజీ విషయములో అట్లే స్వాగతసన్నాహము లొనర్చెను.
'ఏమి ఈ యద్భుతశక్తి, బాబా యేమియు పలుకలేదు. ఉత్తరప్రత్యుత్తరములు కూడ జరుగలేదు. ఆశీర్వచనముల నైన పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శనమాత్రముననే నామనశ్చాంచల్యము పోయినది. అంతరంగమున ఆనంద ముద్భవించినది. ఇదియే దర్శనభాగ్యము.' అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని, యతని సంతోషమున కంతులేకుండెను. బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన యానందమును పొందెను.

Thursday, August 28, 2014

సాయినాథునికి శతకోటి వందనాలు

సద్గురు సాయినాథునికి శతకోటి వందనాలు. జీవితంలో అనుక్షణం ఏవో కష్టనష్టాలు ఎదురౌతుంటాయి. అందుకే సంసారాన్ని సాగరంతో పోల్చారు. నిరంతర అలల తాకిడిని పోలిన చీకూచింతలు ఉంటాయి. ఆటుపోట్ల సమస్యలు వస్తుంటాయి. తిమింగలాల్లాంటి పెద్ద ఆపదలు పొంచి ఉంటాయి. అంతమాత్రాన జీవితం నుండి పారిపోలేం. పలాయనవాదం పనికిరాదు. ఇలాంటి ఆపద సమయాల్లో భక్తులు సాయిబాబాను స్మరించుకుంటారు. బాబా భక్తసులభుడు. వెంటనే అనుగ్రహిస్తాడు.
కొండంత ధైర్యాన్ని ఇస్తాడు. కష్టాలనుండి గట్టెక్కిస్తాడు. ఆపదల నుండి బయటపడిన భక్తులకు బాబా పట్ల ఎనలేని విశ్వాసం కుదురుకుంటుంది. అడుగడుగునా బాబా లీలలు కనిపిస్తాయి. అణువణువునా బాబా రూపం అనుభూతికొస్తుంది. అన్నిటినీ మించి ప్రశాంత చిత్తాన్ని ఇస్తాడు. ఇంతగా మనల్ని కనిపెట్టుకుని ఉండే సాయినాథునికి శతకోటి వందనాలు

Wednesday, August 27, 2014

Mataji Sai Leelamma (17th August 1923 - 25th August 2014)





 
 
Mataji Sai Leelamma (17th August 1923 - 25th August 2014)
Born on 17th August 1923 at Vijayawada to Rao Saheb Dr Dharmapuri Govindarajula Naidu & Tulasibayamma (Rukmini) as a 2nd child Maatha Sai Leelamma married to Shri Dukka Venkata Rama Rao in the year 1941, Chief Engineer in Railways left for Kolkata with husband. Photographs of Mathaji preparing Baba's murty with flowers, Mathaji's parents, her 1st visit to Dwaraka Mai & Samadhi mandir in 1948, Aum on her hands, her longest hair & her residence cum mandir at Old Alwal, Hyderabad are shared hereunder.
Love SAI; Live in SAI.


సహజ జాతేస్తు బింబ, వర్ణాంతర సిద్ధిజాతుం పూర్ణ
పూర్ణాంతర గుహ్య బ్రహ్మాంబితా, చరణౌ సాధుమాంబ నిరతౌ సాధుతా

సహజమైన, సంపూర్ణమైన, రహస్యమైన బ్రహ్మ తత్త్వముతో నిండియుండి జ్యోతిస్వరూపవర్ణములతో వెలుగొందుతున్న శ్రీ మాతాజీ సాయిమాంబ చరణ సన్నిధానమున చేరు
కున్నవారందరూ ఆ తల్లి అనుగ్రహం చేత నిరంతరము సంపూర్ణమైన సాధుగుణములతో వర్దిల్లెదరు గాక!

(శ్రీమతి పి. శారదగారు, మణికొండ 2-1-2006 ధ్యానములో నుండగా శ్రీ సాయిబాబా మాతాజీ శ్రీ సాయిలీలమ్మ గారి గురించి స్పురింపచేసిన సంస్కృత శ్లోకము).

ఎక్కడ విశ్వాసం వుంటే, అక్కడే ప్రేమ వుంటుంది
ఎక్కడ ప్రేమ వుంటుందో, అక్కడే శాంతి వుంటుంది
ఎక్కడ శాంతి వుంటుందో, అక్కడ భగవన్ సాయి వుంటాడు
ఎక్కడ సాయి వుంటాడో, అక్కడ సమస్తము వుంటుంది.
- మాతాజీ సాయిలీలమ్మ.