Total Pageviews

Tuesday, June 24, 2014

కాకాసాహెబు దీక్షిత్ (1864 - 1926)


మధ్యపరగణాలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణకుటుంబములో హరిసీతారామ్ ఉరఫ్ కాకాసాహెబు దీక్షిత్ జన్మించెను. ప్రాథమికవిద్యను ఖాండ్వాలో హింగన్ ఘాట్ లలో పూర్తి చేసెను, నాగపూరులో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్ స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యెను. న్యాయవాది పరీక్షలో కూడ ఉత్తీర్ణుడై లిటిల్ అండు కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంతన్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను.

1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబు దీక్షిత్ కు తెలియదు. అటుపిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లొనావ్లాలో నున్నప్పుడు, తన పాతస్నేహితుడగు నానాసాహెబు చాందోర్కర్ ను జూచెను. ఇద్దరును కలిసియేవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబు తాను లండనులో రైలుబండి ఎక్కుచుండగా కాలుజారిపడిన యపాయమునుగూర్చి వర్ణించెను. వందలకొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను. కాలు నొప్పియు, కుంటితనమును పోవలెనన్నచో, అతడు సద్గురువగు సాయివద్దకు పోవలెనని నానాసాహెబు సలహా నిచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా "నా భక్తుని సప్తసముద్రముల మీద నుంచిగూడ పిచ్చుక కాలికి దారముకట్టి యీడ్చినట్లు లాగుకొని వచ్చెదను." అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే నాకర్షింపబడడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతయు విని కాకాసాహెబు సంతసించి, "సాయిబాబా వద్దకుపోయి, వారిని దర్శించి కాలుయొక్క కుంటితనమునకంటె నా మనస్సుయొక్క కుంటితనమును బాగుచేసి శాశ్వతమైన యానందమును కలుగజేయమని వేడుకొనెద"నని నానాసాహెబుతో చెప్పెను.

కొంతకాలము పిమ్మట కాకాసాహెబు అహమద్ నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్ లేటివ్ కౌన్సిల్ లో వోట్లకై సర్దార్ కాకాసాహెబు మిరికర్ యింటిలో దిగెను. కాకాసాహెబు మిరీకర్ కొడుకు బాలాసాహెబు మిరీకర్. వీరు కోపర్ గాం కు మామలతుదారు. వీరు కూడ గుఱ్ఱపు ప్రదర్శన సందర్భములో అహమద్ నగరు వచ్చి యుండిరి. ఎలక్షను పూర్తియైన పిమ్మట కాకాసాహెబు షిరిడీకి పోవ నిశ్చయించు కొనెను. మిరీకర్ తండ్రీకొడుకులు వీరిని ఎవరివెంట షిరిడీకి పంపవలెనాయని యాలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. ఆహమద్ నగరులో నున్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదనియు, శ్యామాను తన భార్యతో గూడ రావలసినదనియు టెలిగ్రామ్ యిచ్చిరి. బాబా యాజ్ఞను పొంది శ్యామా అహమద్ నగరు చేరి తన అత్తగారికి కొంచెము నయముగా నున్నదని తెలిసికొనెను. మార్గములో గుఱ్ఱపు ప్రదర్శనమునకు బోవుచున్న నానాసాహెబు షాన్షె, అప్పాసాహెబు గద్రేయు శ్యామాను గలిసి, మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబు దీక్షితుని కలసి, వారిని షిరిడీకి తీసికొని వెళ్ళుమనిరి. కాకాసాహెబు దీక్షితుకు మిరీకరులకు శ్యామా అహమద్ నగరు వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామా మీరీకరులవద్దకు పోయెను. వారు శ్యామాకు కాకా సాహెబుదీక్షిత్ తో పరిచయము కలుగజేసిరి. శ్యామా కాకాసాహెబు దీక్షితుతో కోపర్ గాం కు ఆనాటి రాత్రి 10 గంటలకు రైలులో పోవలెనని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే యొకవింత జరిగెను. బాబాయొక్క పెద్దపటము మీది తెరను బాలాసాహెబు మిరీకరు తీసి దానిని కాకాసాహెబు దీక్షితుకు చూపెను. కాకాసాహెబు శిరీడీకి పోయి యెవరినయితే దర్శించవలెనని నిశ్చయించుకొనెనో, వారే పటము రూపముగా నచట తనను ఆశీర్వదించుటకు సిద్ధముగా నున్నట్లు తెలిసి యతడు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ పెద్దపటము మేఘశ్యామునిది. దానిపై యద్దముపగిలినందున నాతడు దానికింకొక యద్దము వేయుటకు మిరీకరులవద్దకు బంపెను. చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబు శ్యామాలద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి.

10 గంటల లోపల స్టేషనుకు పోయి టిక్కెట్లు కొనిరి. బండి రాగా సెకండుక్లాసు క్రిక్కిరిసి యుండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబు స్నేహితుడు. అతడు వారిని ఫస్టుక్లాసులో కూర్చుంటబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్ గాం లో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగా నున్న నానాసాహెబు చాందోర్కరును జూచి మిక్కిలి యానందించిరి. కాకాసాహెబు, నానాసాహెబు కౌగలించుకొనిరి. వారు గోదావరిలో స్నానము చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా, కాకా సాహెబు మనస్సు కరగెను. కండ్లు ఆనందబాష్పములచే నిండెను. అత డానందముచే పొంగిపొరలుచుండెను. బాబా కూడ వారికొరకు తాము కనిపెట్టుకొని యున్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకే శ్యామాను బంపినట్లును తెలియజేసెను.

పిమ్మట కాకాసాహెబు బాబాతో నెన్నో సంవత్సరములు సంతోషముగా గడపెను. షిరిడీలో నొక వాడాను గట్టి దానినే తన నివాసస్థలముగా జేసికొనెను. అతడు బాబావల్ల పొందిన యనుభవములు లెక్కలేనన్ని గలవు. వాని నన్నిటిని ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదము. బాబా కాకాసాహెబుతో "అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకుపోయెదను" అన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరము జూలై 5వ తేదీన అతడు హేమడ్ పంతుతో రైలు ప్రయాణము చేయుచు బాబా విషయము మాట్లాడుచు, సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరమును హేమడ్ పంతు భుజముపై వాల్చి యే బాధయు లేక, యెట్టి చీకాకు పొందక ప్రాణములు విడిచెను.

SHRADHA & SABURI

No matter what kind of problems are you facing..if you have SAI with you..every problem will vanish soon..
For He knows where you are right now..he hasn't forgotten about you..and he has never left your side.. he will carry you through..

So keep the candle of SHRADHA & SABURI ever burning in your heart.

Baba’s Miraculous Udi

Sai Sister Payal from India says: Sai ram to everyone, my name is Payal and i am from New Delhi. I want to share my recent experience. From some days i was having a little pain in my left eye but i did not want to go to the doctor. So i prayed to Sai Baba that You are my doctor, please cure my pain from Your Udi. I had not told this thing to my family also. I applied Udi for many days on my eyes and also drank with water. After some days my pain slowly went away. I am very thankful to my Sai Baba. Please bless my family and everyone with good health, wealth and prosperity.

Saturday, June 21, 2014

SHRI SAI BABA RECEIVING BHIKSHA :-

In the very beginning, Sai Baba was in the habit of going to a few houses in the neighbourhood to beg for food. At times Baba would scold a grudging housewife by saying – “Mother you have so many Chapaties, so much rice and this or that vegetable in your pots, why refuse a bit of food to a fakir”! This gentle chastisement and the accuracy of the strange fakir’s prouncement would remove the veil of maya from these women who would then rush to put their all at his feet, as an as an offering of love.

Sai Baba Museum - Shirdi Sansthan

A small museum of Sai Sansthan at Shirdi (housed in Samadhi temple) where an old portrait of Sai Baba and His modest possessions like a long robe - Kafani, begging bowls (tin pots), clay pipes - Chillum, sacred staff - Satka, leather slippers - Paduka are displayed. Besides this there are few other silver articles which were in use in the Palki procession as well as formal worship of Baba in those days.

Wednesday, June 18, 2014

సింహపురి షిరిడి సాయిదర్బార్

 
 
 

సింహపురి షిరిడి సాయిదర్బార్
పిలిస్తే పలికే దైవం షిరిడి సాయిబాబా. కష్టాల్లో భక్తులకు వెన్నుదన్నుగా నిలిచేవాడు సాయిబాబా ఒక్కడే. బాబాకు భజనలంటే అమిత ఇష్టం. నగరంలోని పుట్టవీధిలో మధుసూదన్‌రావు ఇంటిలో సాయిబాబా భజనలు, సత్సంగం లు కోసం భక్తులు చేరేవారు. భజనలు చేస్తూ బాబాను కొలిచేవారు. 2000 ఫిబ్రవరి 24న సాయి భక్తురాలి పుట్టిన రోజున సందర్భంగా ఈ భజనలు ప్రారంభించారు. ఈ భజనలు రోజురోజుకు పెరుగుతూ ఆ గృహం దేవాలయంగా మారింది. 2001న కొందరు భక్తులు గురుపూర్ణిమ సందర్భంగా షిరిడిలోని ఆచారాల ప్రకారం రోజు నాలుగు వేళలు అభిషేకాలు, షిరిడి హారతులు చేయడం చేశారు.దీంతో భ క్తుల్లో సాయి మందిరం నిర్మించాలన్న ప్రేరణ కలిగింది. అలా అంతా కలిసి పద్మావతినగర్‌లో స్థలం కొనుగోలు చేశారు. 2012 జూన్ 27న పుట్టవీధి నుంచి పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించి సాయిదర్భార్‌గా నామకరణం చేశారు. అనంతరం ద్వారకామయిలో బాబా వెలిగించిన ధుని నుంచి అఖండ జ్యోతిని తెచ్చి 2003 ఫిబ్రవరి 6న సాయిదర్భార్‌లో ధుని నిర్మాణం ప్రారంభించారు. అప్పటి నుంచి నిరంతరాయంగా «వెలుగుతూనే ఉంది.
భక్తులే కూలీలు..
షిరిడి సాయిబాబా విగ్రహం పద్మావతినగర్‌కు చేరుకోవడంతో ఈ ప్రాంతంలో పెద్ద మందిరం నిర్మించాలన్న సంకల్పం పెరిగింది. వేదమంత్రాల మధ్య బాబా పాదాల వద్ద చీటీలు పెట్టి అనుగ్రహం కోసం భక్తులు ప్రార్ధించారు. పెద్ద మందిరానికి బాబా అనుమతి లభించింది. షిరిడిలో బాబా సమాధి, మందిరం కొలతలు ప్రకారం మందిర నిర్మాణంలో భక్తులే కూలీలుగా మారారు. అందుకే ఈ సాయిదర్భార్‌ను భక్తులు నెల్లూరు షిరిడిగా కొలుస్తారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక పనివాళ్లను పిలిపించి సాయిదర్భార్ లోపలి భాగం అంతా సీలింగ్, గోడలు, దిమ్మెలు అద్దాలతో అలంకరించారు. అందులో బాబా లీలల దృ శ్యాలు, వివిధ దేవతల గాథలు స్మరించేలా దృశ్యాలు తీర్చిదిద్దారు. సాయిదర్భార్ అద్దాల మందిరంగా తీర్చిదిద్ది 2005 జూన్ 1న జైపూరు నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన బాబా విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ అద్దాల సాయిదర్బార్ మందిరం దర్శనీయ, ఆధ్యాత్మిక నిలయంగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయింది.

ప్రత్యేకతలు
ప్రతినిత్యం భజనలు, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, సచ్చరిత్ర పారాయణం, ప్రతి మంగళవారం సాయిచరిత్ర సంపూర్ణ పారాయణం, షిరిడి హారతులు, ఉదయం క్షీరాభిషేకాలు, హారతులు జరుగుతాయి. ప్రతీనిత్యం భక్తుల సహకారంతో అన్నదానం జరుగుతున్నది.
సాంప్రదాయ పండుగలు
సాయిదర్భార్‌లో నిర్వహించే పండుగలన్నీ షిరిడి సాంప్రదాయంలోనే నిర్వహిస్తారు. నూతన సంవత్సర వేడుకలు, శ్రీరామనవమి, గురుపౌర్ణమి, సాయినాధుని నగరోత్సవం, గంధమహోత్సవం, విజయదశమిరోజు నక్ష త్ర హారతులు, సమాధి కీర్తనలు, దత్తజయం తి, ముక్కోటి, మహాశివరాత్రి, దీపావళి, వినాయకచవితి పండుగలు వేడుకగా జరుగుతాయి.
* ప్రతివారం సాయితత్వంపై సత్సంగాలు
* శ్రీసాయిదర్భార్ ఆధ్వర్యంలో ఏడాదికి ఒకసారి భక్తులు షిరిడియాత్ర చేస్తారు.
* ఈ సాయిదర్భార్‌లో ధ్యానమందిరం ఉంది. బాబా స్మరణకు ఈ కేంద్రం ఎంతో మందికి ఉపయోగపడుతోంది.

కలియుగం లో భగవన్నామ స్మరణే మోక్షమార్గం,

కలియుగం లో భగవన్నామ స్మరణే మోక్షమార్గం, అనేక రకములైన యజ్ఞాలు ఉన్నవి కదా, వాటిని నిర్వహించుట చాల శ్రమతోటి, ఖర్చుతోటి కూడుకోన్నట్టిది. ఏ మాత్రం ఖర్చు, శ్రమ లేనట్టిది, ఎవరైనా సులువుగా ఆచరించ దగినది నామజపము. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా యజ్ఞ యాగాదులన్నిటి లోను నేనే నామజప యజ్ఞాన్ని అని సెలవిచ్చాడు. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే చెప్పడం వలన నామజపము అతి పవిత్రమైన క్రతువుగా చెప్పబడింది. "నా నామాన్ని ప్రేమతో ఉచ్చరించే వారి కోరికలు నేను తీరుస్తాను" అని చెప్పారు బాబా. ఇంకా ఏమన్నారంటే, ఎవరైతే నన్నే మదిలో తలచుకొని నా నామాన్ని జపిస్తారో, నా కధలే వింటారో, నా లీలలను గానం చేస్తారో, వారిని కష్టాల కడలి నుండి గట్టేక్కిస్తాను. మృత్యువు నుండి కాపాడతాను. అత్యంత విశ్వాసంతో నన్ను ఆశ్రయించిన వారి ప్రారభ్ద కర్మల నుండి అధిగమింప చేస్తాను. నన్ను నమ్మండి. ఈ పకీరు ఎన్నడూ అబద్ధం ఆడడు."
నన్నాశ్రయించిన వారిని, శరణు జొచ్చిన వారిని నిరంతరమూ రక్షించుటయే నా కర్తవ్యము అని బాబా భక్తులకు మాట ఇచ్చారు. సాయి ఎన్నడు మాట తప్పదు అని భరోసా కూడా ఇచ్చారు. మనం చేయవలసినది ఏమిటంటే అత్యంత విశ్వాసంతో సాయిని నమ్మి ఎంత పెద్ద ఆపద వచ్చినా ధైర్యం కోల్పోకుండా గుండె నిబ్బరంతో సమస్యను ఎదుర్కొని పోరాడాలి. ఎటువంటి విపత్కర సమయములో నైనా సాయిని స్మరిస్తూ " ఓ బాబా! నేను కష్టాలలో ఉన్నాను. నీవే నాకు రక్షా. నీవు తప్ప నాకు ఎవరు లేరు. రక్షించు తండ్రీ అని శరణాగతి వెడితే మనలను కష్టాల కడలి నుండి సురక్షితంగా బయట పడేస్తారు సాయి. ఇందులో సందేహం ఏమాత్రము లేదు.