Total Pageviews

Tuesday, February 4, 2014

Brahmashri Karra Subramanya Sarma was know as Peroori Sarma (1925 - 2000)

Brahmashri Karra Subramanya Sarma was know as Peroori Sarma (1925 - 2000). Famed as an authority on Astrology & Vastu in late 50s in & around Kakinada in East Godavari District of Andhra Pradesh, Shri Peroori Sarma's initiation to SAI Path has been nothing short of a legendary fable. His birth in Traditional Brahmin Family made him averse to Saibaba (in the attire of Musalman) & was thinking even that those who worship Saibaba suffers from epilepsy & he was lacking the knowledge that God descends on any form if worships with faith. Even Shri Sarma was expressing his aversion to Saibaba publicly too, resulting in branding him as fallacious. But the year 1957 saw him transformation & on August 12th his elder son Arunikumar was on death bed with meningitis, recovery from which was near impossible. Special Magistrate & friend of Sri Sarma consoled & assured him that SAI will take care of the boy & gave Udi to him. Lo! the boy was recovered.
Sri Peroori Sarma authored Sri Sai Prabha, Sri Shirdi Sainatha Mahatyam, Sri Sainath Sthavana Manjari (in Telugu), Sri Dattatreya Stotram & Sri Gosai Katha (Musical Feature) in between 1958 - 65. His sons now brought out all his literature in one book & though first edition was released some time during last year, new & revised edition was released at Shirdi on 3rd February 2014 at Shirdi.

Monday, February 3, 2014

Smt. Dukki Sai Leelamma

Sri Sai Satcharitra is first written by Govind Raghunath Dabholkar alias Hemad Pant between 1922 & 1929 in Ovi form in Marathi & Sansthan published it on 30th October 1930. Later Sri Sai Satcharitra in condensed form translated into English by Nagesh Vasudev Gunaji & it was this epic book the basis for translation into all major Indian Languages. The first language in which Sri Sai Satcharitra translated was Telugu by Sri Pratti Narayana Rao on the basis of English Translation of Sri Sai Satcharitra (Condensed Version) by Nagesh Vasudev Gunaji. The first ever edition of Sri Sai Satcharitra in Telugu was handed over to Smt. Dukki Sai Leelamma on 19th May 1953 at Samadhi Mandir Shirdi. We have the pleasure in publishing the photograph of Most Revered Sai Leelamaa who was fortunate to have the 1st copy of Sri Sai Satcharita in Telugu. She lives in Hyderabad & aged 95.

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని చినమామిడిపల్లిలో 2014వ.సంవత్సరం మార్చ్ నెల 19వ.తారీకున బాబావారి విగ్రహ ప్రతిష్ట


 తెలుగు అను వాదం త్యాగరాజుగారు
సాయి బంధువులకు ఒక విన్నపం
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని చినమామిడిపల్లిలో 2014వ.సంవత్సరం మార్చ్ నెల 19వ.తారీకున బాబావారి విగ్రహ ప్రతిష్ట జరుపబడుచున్నది. ఈ సందర్భంగా బాబావారి అభిషేకానికై భారత దేశములోని అన్ని పుణ్యనదులలోని జలములను సేకరింపబడుచున్నవి. సద్గురు బాబా వారి అనుగ్రహంతో చాలా మట్టుకు పుణ్యనదుల జలమును సేకరింపగలిగాము. ఇంకను కొన్ని ప్రాంతములనుండి జలమును సేకరంపవలసి ఉంది. కనుక సాయిభక్తులు ఎవరైనా సరే వారి వారి ప్రాంతములలోనున్న పుణ్యనదులలోని జలమును ఒక లీటరు సీసాలొ సేకరించి పంపవలసినదిగా కోరబడుచున్నారు. సాయి అనుగ్రహానికి పాత్రులు కండి ఆయన దీవెనలను అందుకొనండి. ఈ కార్యక్రమమంతా కూడా ఫిబ్రవరి 15 లోపున జరిగినచో కార్యక్రమము విజయవంతంగా జరుగును. ముఖ్య గమనిక: కుళాయిలోని నీటిని మాత్రం సేకరించవద్దని మనవి. మీరు పంపించే సీసాల మీద మీరు సేకరించి పంపుతున్న జలము ఏపుణ్య నదికి సంభంధించినదో ఒక కాగితం మీద వ్రాసి సీసాకు అంటించి పంపండి. మీరు సేకరించిన జలమును హైదరాబాదులోని శ్రీనగేష్ గారికి అందించవలసినదిగా కోరుచున్నాము. సంప్రదించవలసిన నంబరు: 9849200775 ఈమైల్.ఐ.డీ. sreesree@outlook.com

ఇంకనూ ఈ క్రింద వివరింపబడిన పుణ్యనదులు, సముద్రములలోని జలములను ఇంకనూ సేకరింపవలసి ఉంది.

నది పేరు రాష్ట్రము/పట్టణము

చంబల్ మధ్యప్రదేశ్

సన్ అమర్కాంటక్, మధ్యప్రదేశ్

బెట్వా మధ్యప్రదేష్, ఉత్తర ప్రదేశ్

కోసి కోసీ, బీహార్

ఇండస్ జమ్మూ & కాష్మీర్

చంద్రభాగ నది(పండరీపూర్

నందు ప్రవహించే నది) పండర్పూర్

ఇంద్రాయణి నది (షిరిడీనుండి అలంది (షిరిడీకి దగ్గరలో)

80 కి.మీ.దూరంలో ప్రవహిస్తున్న నది)

గోదావరి (నాసిక్) నాసిక్

లుని ఆజ్మీర్ (జైపూర్)

బ్రహ్మ కుండ్ పుష్క ఆజ్మీర్ (జైపూర్)

సబర్మతి అహమ్మదాబాద్

కావేరి కర్నాటక

సరస్వతీ గుజరాత్

పెన్నా నది నెల్లూరు (ఆంధ్రప్రదేశ్)

నాగావళి శ్రీకాకుళం (ఆంధ్రప్రదేశ్)

సువర్ణముఖి శ్రీకాళహస్తి (ఆంధ్రప్రదేశ్)

భీమ అమరాజ

పసిఫిక్ మహా సముద్రం కాలిఫోర్నియా

సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)




































Sunday, February 2, 2014

River Waters Collection Request for Abhishek of Shirdi Sai Baba's Idol for Pranpratistha acknowledge it is from Sreedhar Kalidindi

  Dear Sai Devotees,
I hope that you all are doing well & great with the Grace of Shirdi Sai Baba... It is my pleasure to inform you that one of our Sai Bandhu with the help of his fellow Sai Devotees is constructing Shirdi Sai Baba Temple in Andhra Pradesh by Grace of Baba. BABA's pratishta is scheduled at Narasapur Temple in Andhra Pradesh on 19th Mar 2014 and they are planning to get river water from the sacred places from all over the India (from all States) for Baba ABHISHEK.

Few days back, I got the mail from fellow Sai Devotee and he has requested us to help in collecting the water from the rivers from all the States of India. I am writing all of you in this regard so that we can take part in this Baba's and His devotees service and get the blessings from our beloved Guru & Lovely Baba Sai.

They need the water in ONE LITER bottle (with name tagged of river) before 25th February 2014.

Also note that, you can add more river or sacred place water if you wish/know. May you get Baba's blessings abundantly. Devotees are requested to handover water collection to Nagesh ji from hyderabad. You can reach him @ 9849200775.

Thanks,

Baba bless us All.

Below is the list of those rivers from where we have not been able to collect waters.


River State/City
Chambal Madhya Pradesh
Son Amarkantak, Madhya Pradesh
Betwa Madhya Pradesh, Uttar Pradesh
Ghagra Uttar Pradesh
Kosi Koshi, Bihar
Indus Jammu & Kashmir
River Chandrabhaga flows at Pandharpur Pandharpur
River Indrayani flows at Aalandi (80 Kms away from Shirdi) Aalandi,Near Shirdi
Godavari water from the banks of Nashik Nashik
Mahanadi Cuttack, Sambalpur, Sonepur, Odisha, Boudh
Luni Ajmer (Near Jaipur)
Bramh Kund Pushkar Ajmer ( Near Jaipur)
Sabarmati Ahmedabad
Kaveri Karnataka
Saraswathi Gujarat
Penna River Nellore ,Andhra Pradesh
Nagavali Srikakulam, Andhra Pradesh
Suvarna Mukhi Srikalahasti Andhra Pradesh
Bheema,Amaraja
Pacific Ocean California

Friday, January 31, 2014

కష్టమొచ్చినా సాయిని మరవద్దు

ఈ లీల సాయి భక్తురాలయిన రియా గారు అమెరికానించి పంపించారు.
సాయి సిస్టర్ రియా అమెరికా నించి తమ అనుభవాన్ని ఇలా మనతో పంచుకుంటున్నారు.
కష్టమొచ్చినా సాయిని మరవద్దు
సాయి భక్తులందరి అనుభూతులను ఎన్నిటినో నేను చదువుతున్నాను. మొట్టమొదటిసారిగా నాకు నా అనుభవాన్ని కూడా మీతో పంచుకోవాలనిపించింది. 12 సంవత్సరాలనించి నేను బాబాని సేవిస్తున్నాను. నా జీవితంలో ఆయన చూపించే లీలలు కూడా వృధ్ధి చెందుతున్నాయి. నేను వాటినన్నిటినీ వివరించలేను గానీ, గత 10 నెలలలో నాకు కలిగిన అనుభూతులని వివరిస్తాను.
అమెరికాలో రెసిషన్ వల్ల నాకు ఉద్యోగం పోయింది. 8 నెలలుగా ఉద్యోగం లేకుండా గడిపాను. ఫిబ్రవరి, 2010 లో నా ఉద్యోగం పోయినప్పుడు నేనంతగా బాధ పడలేదు. కారణం సాయి నాతోనే ఉన్నారని నాకు తెలుసు. అంతా ఆయనే చూసుకుంటారనే ధీమా. కాని సాయి నా ఓర్పును సహనాన్ని పరీక్షిస్తున్నారనుకున్నాను.. మరలా కొత్తగా ఉద్యోగాలకి ప్రయత్నాలు మొదలుపెట్టాను. నెలలు గడుస్తున్నా నాకు యెవరినించీ కూడా పిలుపు రాలేదు. పిలుపు వచ్చినా గాని ఎటువంటి ఉద్యోగమూ రాలేదు. జూన్/జూలై కల్లావర్క్ పెర్మిట్ కూడా ఒక సమస్య గా మారింది. నాకు చాలా నిరాశ ఎదురయింది. ఆ సమయంలో గురువార వ్రతము కూడా చేశాను గాని ఏమీ ఫలితం కనిపించలేదు. పరిస్థితులన్నీకూడా దుర్లభంగా మారి, బిల్లులు కట్టడానికి, కారు మీద తీసుకున్న అప్పు తీర్చడానికి కూడా చాలా కష్టమయింది. ఆ సమయములో నా స్నేహితులే నాకు సహాయం చేస్తూ ఉండేవారు. చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టాను గాని అవేమీ కూడా నా అవసరాలను తీర్చలేకపోయాయి. ఒకానొక సమయంలో నేనెంతగా కృంగిపోయానంటే అసలు సాయి ఉన్నారా అని అనిపించింది. నా పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చేశాను. కాని ఏమీ ఫలితం కనపడలేదు. ఒకదాని తరువాత ఒకటి సమస్యలు రావడంతో నేను పూర్తిగా నాశనమయిపోయినట్లుగా అనిపించింది. ఒకనొక సమయంలో పూర్తి నిస్సహాయ స్థితిలో నేను సాయిని కూడా ప్రార్థించడం మానేసాను. కాని నన్ను నేను సమాధాన పరచుకుని సాయినే ప్రార్థించడం మొదలుపెట్టాను. వ్రతాలను చేయడం మానేశాను. ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా చదవడం మానేసాను. నాకింక సహనం నశించి సాయిని సహాయం చేయమని అర్థించాను. ఆన్ లైన్లో బాబా ప్రశ్నలు సమాధానలలో ప్రశ్నలు అడగసాగాను. అందులో జవాబులో ఏది వస్తే అది అన్నీ చేశాను. ఉదాహరణకి కొబ్బరికాయ కొట్టమంటే కొట్టాను. గుడికి వెళ్ళమంటే గుడికి వెళ్ళాను. ఏది చేయమని వస్తే అదే విధంగా అన్నీ చేశాను.
భాబా సచ్చర్తిత్రలో చెప్పారు, ఏది యెలా జరగాలో అది జరుగుతుంది. తన భౌతిక దేహానంతరము తాను తన భక్తులకు సహాయం చేస్తానని చెప్పారు. సెప్టెంబరు నెల వచ్చేటప్పటికి నాకు ఇక సహనం పోయింది. చిన్న ఆశాకిరణం, నమ్మకం మాత్రమే మిగిలి ఉన్నాయి.
నేనెంతగా విసిగి పోయానంటే నేను ఉద్యోగప్రయత్నాలను కూడా మానేశాను. నేనిక ఒకటే చేసాను. సాయి ప్రశ్నలు జవాబులలో ఏది వస్తే అది చేయడానికి సిధ్ధమయ్యాను. నాకెప్పుడూ ఒకే సమాధానం వస్తూ ఉండేది. నవంబరు/డిసెంబరులలో పర్తిస్థితులలో మార్పు వస్తుందని. నాకు నమ్మకం ఉంది. కాని కొన్ని అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. అక్టోబరు వరకు పరిస్థితులు అలాగే ఉన్నాయి. అక్టోబరు చివరలో నాకు పెద్ద ప్రమాదం జరిగి (వివరాలను నేను చెప్పదలచుకోలేదు) ప్రాణాపాయాన్నుండి బయటపడ్డాను. నాకివన్నీ ఎందుకిలా జరుగుతున్నాయి, సాయి నా మొఱ ఎందుకని ఆలకించటంలేదని బాధపడుతూ ఉండేదాన్ని. మెల్లగా, రెండు రోజుల తరువాత సాయి నామీద తన అనుగ్రహాన్ని చూపడం మొదలుపెట్టారు. నన్ను చావునుంచి తప్పించినది సాయే అని నాకు అర్థమయింది. ఆ క్షణంలో నేను, నన్ను రక్షించమని సాయి నామాన్నే స్మరించాను, అప్పుడు నన్ను సాయె కాపాడారు. నవంబరు చివరి వారంలో నాకొక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. కాని దానికి నేనెప్పుడూ అప్ప్లై చేయలేదు. వారు ఆన్ లైన్ లో నా రెజ్యూం చూసి నన్ను యింటర్వ్యూకి పిలవడం జరిగింది. ఇంటర్వ్యూ చాలా కఠినంగా జరిగింది. నాకు ఈ ఉద్యోగం వస్తుందా రాదా అని సందేహం వచ్చింది.
అయినప్పటికీ నేను సాయిని ప్రార్థించాను. నాకు మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. నా వర్క్ పెర్మిట్ కూడా తిరిగి రెన్యూ చేయబడింది.
నేనిప్పుడు ఇక్కడ పనిచేస్తున్న చోట చాలా సంతోషంగా ఉన్నాను. నేనెప్పటినుంచో సాయిని పూజిస్తున్నప్పటికీ, ఈ చివరి నెలలలో ఎన్నో విషయాలను అవగతం చేసుకున్నాను. వాటిని నేను మీతో పంచుకోదలచుకున్నాను.
జీవితంలో మనకందరికీ ఎన్నోసమస్యలు ఉంటాయి. అందరి జీవితాలూ వడ్డించిన విస్తరి కాదు. ఇప్పటికే మనకిచ్చినవాటిని గురించి మనం సంతోషించి, హృదయాంతరాళలోనించి భగవంతునికి కృతజ్ఞతలను తెలుపుకోవాలి. ఆవిధంగా చేసినట్లయితే మనలో మంచి శక్తి పెంపొందుతుంది. అదే మనకు జీవితంలో మంచిని కలగచేస్తుంది.
నాకేది జరిగినా అది భగవంతుని వల్ల జరిగినదే అని నేను భావించాను. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినప్పుడు నేను విచారిస్తూ ఉండేదానిని. ఇప్పుడు నా దృక్పధంలో చాలా మార్పు వచ్చింది. ఏ చిన్న విషయానికైనా భగవంతునికి కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు పునర్జన్మ.
నువ్వేదయినా పని జరగాలని కోరుకున్నప్పుడు అది జరగకపోతే, సాయి సహాయం చేయటంలేదు అని భావించద్దు. దానర్ధం మనం అనవసరంగా ఆందోళనపడుతూ ఉంటాము. కాని సమయం వచ్చినప్పుడు సాయి తప్పకుండా సహాయం చేస్తారు. సాయిమీద పూర్తి విశ్వాసంతో ఉండాలి. ఆయన మృత్యుకోరలనుండి కూడా రక్షిస్తారు.
పరిస్తితులు ఏమయినా కానివ్వండి, మనకోరికలు స్వచ్చమైననవి, తగినవి అయితే సాయి మనవెంటే ఉంటారు. సాయి మనలనెపుడు నిర్లక్ష్యం చేయరు.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Thursday, January 30, 2014

శ్రద్ధ, సబూరీ చాలా అవసరం...

షిర్డీ సాయిబాబా ఎలాంటి హంగులూ, ఆర్భాటాలూ చూపలేదు. మంత్రాలూ తంత్రాలూ ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలు అయింది. అందరూ, అన్ని జీవులూ తినగా మిగిలిన పదార్ధాలనే పంచ భక్ష్య పరమాన్నాలుగా భావించారు. షిర్డీ సాయిబాబా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబ వృక్షం కిందనో ఏ ఆడంబరాలూ లేకుండా కూర్చుని, శ్యామా, మహల్సాపతి, బయజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. అవి మామూలు మాటలు కాదు, అమూల్యమైన ఆణిముత్యాల మూటలు. ఒక సందర్భంలో సాయిబాబా ఇలా చెప్పారు.
''మీరు ఎవర్నీ నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని ఏ రకంగా నయినా కష్టపెట్టినా సరే, వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. ''శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకూ కొరకాకుండా పోతారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి. ఎవరైనా, ఏ కారణంగా నయినా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుండి వెళ్లిపోండి.
''ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక, నిశ్చలంగా, నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాటకు దిగారంటే, మీరు కూడా వారితో సమానులే అవుతారు. ''దేవునిపట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా, పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి. దేవుడివైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుడు మిమ్మల్ని కాపాడటానికి పది అడుగులు ముందుకు వస్తాడని తెలుసుకోండి..'' సాయిబాబా చిప్పిన మాటలను మర్చిపోకండి. ఆచరించేందుకు ప్రయత్నించండి.

సాయి చేష్టల వెనుక గూఢార్ధం

సాయిబాబా అవతార మూర్తి. ఆయన్ను ప్రత్యక్షంగా చూసి తరించినవారు ధన్యులు. బాబాతో సన్నిహితంగా మెలిగే అవకాశం పొందినవారు, ఆ పుణ్యమూర్తి సాంగత్యం పొందివారు అదృష్టవంతులు. మహల్సాపతి, తాత్యాకోతే పాటిల్ తదితరులు ఎందరో బాబాతో సన్నిహితంగా గడిపారు. వారిద్వారా సాయిబాబాకి సంబంధించిన విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.
సాయిబాబా దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేముందు బాబా అనుమతి తీసుకుని వెళ్ళేవారు. ఆయన సమ్మతిస్తేనే వెళ్ళాలి. బాబా గనుక ''ఇప్పుడు వద్దు'' అని చెప్పినా పట్టించుకోకుండా, ఆయన మాటను తేలిగ్గా తీసుకుని వెళ్ళిన భక్తులకు ఏవో ఆటంకాలు కలిగి వెనుదిరిగి రావలసి వచ్చేది. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవారు. తన భక్తులు ఇబ్బందుల పాలు కాకూడదనే ఉద్దేశంతోనే కొన్నిసార్లు బాబా వారిని అడ్డగించేవారు. అది గ్రహించక ఏదో ముఖ్యమైన పని ఉందంటూ వెళ్ళి, కష్టనష్టాలు కొనితెచ్చుకునేవారు. అలా ఆపదలు ఎదురైనప్పుడు గానీ, బాబా ఎందుకు వద్దన్నారో గ్రహించేవారు కాదు. బాబా మాటలమీద గురి ఉన్నవారు మాత్రం, ఆయన చెప్పినట్లు విని నిశ్చింతగా ఉండేవారు.
సాయిబాబా షిర్డీ వదిలి ఎక్కడికీ వెళ్ళేవారు కాదు. ఎప్పుడైనా వెళ్తే షిర్డీకి ఉత్తరాన ఉన్న నీంగావ్, దక్షిణాన ఉన్న రహతా గ్రామాలకు మాత్రం వెళ్ళి వచ్చేవారు. ఈ రెండు ఊళ్లకు తప్పించి సాయిబాబా మరెక్కడికీ వెళ్ళింది లేదు. బాబా ఎన్నడూ రైలు ఎక్కలేదు. ఇంకా చెప్పాలంటే రైలును చూడను కూడా లేదు. కానీ, రైళ్ళ రాకపోకల వేళలను, వాటి వివరాలను భక్తులకు వివరించి చెప్పేవారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో, దారిలో ఎవరు ఎదురౌతారో కూడా చెప్పేవారు. ఆయన ఏది చెబితే అది అక్షరాలా జరిగేది.
సాయిబాబా మసీదులోనే కూర్చుని, ఎక్కడెక్కడ ఏం జరిగిందీ, ఏమి జరగబోతున్నదీ చక్కగా చెప్పేవారు. బాబా ఒక్కోసారి చిత్రవిచిత్రమైన సైగలు చేసేవారు. కొన్నిసార్లు పెద్దపెద్దగా కేకలు వేసేవారు. ఇంకొన్నిసార్లు తనను తానే వీపుమీద చరుచుకునేవారు. మరికొన్నిసార్లు పక్కనున్న భక్తులను విసుక్కునేవారు. ఆ చేష్టలు ఒక్కోసారి ''పిచ్చి పకీరు'' అనిపించేలా ఉండేవి. బాబా ప్రవర్తన కొన్నిసార్లు భయపెట్టేలా కూడా ఉండేది. కానీ, వాటి వెనుక ఏదో గూఢార్ధం ఉండేది. కొద్దిసేపటికి బాబా శాంతించేవారు. భక్తులకు బాబా ఎందుకలా చేస్తున్నారో ఎంతమాత్రం అర్ధమయ్యేది కాదు. దూరాన ఉన్న భక్తులు ఆకస్మిక ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు, వారిని కాపాడే ప్రయత్నంలో బాబా అలా చిత్రంగా ప్రవర్తించేవారు. బాబా ఆ సంగతి చెప్పినప్పుడు పక్కనున్నవారికి ఆశ్చర్యంగానే ఉండేది. నమ్మశక్యం కానట్లు చూసేవారు. కానీ, కొద్దిసేపటికే తమను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిన భక్తులను చూశాక, బాబా ఇక్కడే ఉండి, కష్టాల్లో చిక్కుకున్న వారిని ఆదుకున్న తీరు వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసేది. మసీదులో ఓ మూల కూర్చుని మహినంతటినీ చూడగల మహిమాన్వితుడు సాయిబాబా.
సాయిబాబాను చేరువగా చూసిన వారిలో కూడా అందరికీ ఆయన బోధనలు అర్ధమయ్యేవి కావు. బాబా మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహించేవారు కాదు. కొందరు మాత్రమే బాబాను పరిపూర్ణంగా అర్ధం చేసుకుని తూచ తప్పకుండా అనుసరించేవారు. వారిని బాబా అనుక్షణం కనిపెట్టుకుని ఉండేవారు.