Total Pageviews

Tuesday, November 25, 2014

SAINATH MAHARAJ & SHRI SAI SATCHARITA ARE ONE & SAME

 ?
SAINATH MAHARAJ & SHRI SAI SATCHARITA ARE ONE & SAME
OVI 139 > Maharaj had told the devotees that "I will manifest myself, among the people, as a child of eight years."
OVI 140 > These are the words of a saint & no one should regard them as futile. Shri Vishnu had done the same, when he took the Avatar of Shri Krishna.
OVI 144 > And the devotees felt sure in their minds that tying the bonds of love in this way, Baba has just gone on a journey & will come back again.
While informally chatting on the above OVIs from Shri Satcharita at Shri Dattatreya Sai Ashram, Kapilash, Dhenkanal, Odisha during the last year's Annual Celebrations Shri Bishnu Prasanna Acharya, Retd Prof from Utkal University had interpreted the above OVIs in his own way & the interpretation was most appropriate I felt & that's why I would like to share through these pages.
Maharaj accorded permission to Anna Saheb Dabholkar to write His Story by collecting His leelas & surrendering the ego at His Feet & called him as Hemadh Pant. Anna Saheb used to collect the leelas & note them on rough piece of papers. Four years after Baba attained Mahasamadhi he started writing Shri Sai Satcharita in the month of Chaitra 1922. On 15th July 1929 at the age of 70 Govind R. (Anna Saheb) Dabholkar alias Hemadh Pant merged in SAI. In the month of Jyestha 1929 Satcharita was completed, but in Chapter 52, the Avataranika i.e the table of contents or review was not found, though Dabholkar referred to it. Therefore, Shri Balakrishna Dev wrote it & Chapter 53 was thus added to the book.
Shri Sai Satcharita was 1st published as a book by Ramachandra Atmaram Tarkhad on 26th Novemeber 1930 & the rights were vested in the Sansthan.
Here Prof Acharya interpreted that from 1922 when Dabholkar started writing Shri Sai Satcharita to 1930 when it was published the period was EIGHT (8) years. So Baba's promise as per OVI 139. He would come as EIGHT YEAR's OLD has thus been fulfilled, SAI as Shri Sai Satcharita has reincarnated. Thus SAI is Shri Satcharita & Shri Sai Satcharita is SAI.
In fact Autobiographies of Saints like Ramakrishna Paramahansa, Ramana Maharshi & others may contain the details of date of birth, place of birth, educational & family back ground, saint hood & samadhi. But Sri Sai Satcharita does not contained any of these details of Maharaj except His Maha Samadhi, it is compendium of His Miracles, His Philosophy, His Path. The name Satcharita means SAT = Real, Charita = Story, thus Satcharita is a Real Story & the descendants of the people appeared therein are still alive to vouch its happennings.
Further Dabholkar did not complete the Satcharita & he had not witnessed its publication. Perhaps it is Baba's way of saying that Shri Satcharita has no end. Devotees feeling His Presence even after 96 years of His Maha Samadhi is clear example of continuation of Shri Sai Satcharita, which is never ending.
Today 84 years ago Shri Sai Satcharita was first released. Come let us worship Shri Sai Satcharita as SAI.
Sachidananda Sadguru Sainath Maharaj ki Jai
(Re posted to mark the occasion of Release of Shri Sai Satcharita 84 years ago on this day)

శ్రీ సాయి సచ్చరిత్రా మరియూ సద్గురు సాయినాధ్ మహరాజూ వేరు, వేరు కాదు అభేధము!

 
శ్రీ సాయి సచ్చరిత్రా మరియూ సద్గురు సాయినాధ్ మహరాజూ వేరు, వేరు కాదు అభేధము!
ఒవి 139 – 144, 43 వ అధ్యాయము శ్రీ సాయి సచ్చరితము:
ఆయన వుపదేశించిన విషయాలు గుర్తుకు వస్తున్నాయి, దానికిప్పుడు పశ్చాత్తాపం కలుగుతోంది. ’ఎనిమిది సంవత్సరాల బాలుడినై ఈ జగత్తు లో తర్వాత నేను ప్రకటమౌతాను’ అని మహారాజు భక్తులతో చెప్పారు. ఇవి మహత్ముల మాటలు, ఎవరూ వీటిని వ్యర్దమైన మాటలుగా అనుకోకూడదు. కృష్ణావతారంలో శ్రీ విష్ణువు అదేపని చేసారు. ఆయన ఎక్కడికో విహారార్దమై వెళ్లారు, తిరిగి వస్తారు అన్న విశ్వాసం భక్తుల మనసుల్లో పూర్తిగా వుంది.
గత సంవత్సరం శ్రీ దత్తాత్రేయ సాయి ఆశ్రమం, కపిలాష్, ఒడిషా లో జరిగిన వార్షికోత్సవాలలో పై ఒవిల గురించి ఉత్కళ విశ్వవిద్యాలయం లో ఫొఫెసర్ గా పనిచేసి రిటైరైన శ్రీ బిష్ణు ప్రసన్న ఆచార్య తో జరిగిన మాటలలో, శ్రీ ఆచార్య తనదైన శైలిలో ఆ ఒవిల గురించి విశ్లేషించారు. ఆ విశ్లేషణ సరయినదిగా నాకనిపించడంతో ఇక్కడ పంచుకుంటున్నాను. అన్నా సాహెబ్ డాభోల్కర్ ని హేమాడ్ పంత్ గా సంభోదించిన సాయి ధాబోల్కర్ తన అహంకారాన్ని వారి పాదాల చెంత అర్పించి, లీలలను సేకరించి ఆయన చరిత్రని వ్రాయడానికి హేమాడ్ పంత్ కి అనుమతినిచ్చారు. అన్నా సాహెబ్ బాబా లీలలను సేకరించి, చిన్న చిన్న కాగితాలమీద వ్రాసికునేవారు. బాబా మహాసమాధి చెందిన నాలుగు సంవత్సరాల తర్వాత 1922 చైత్ర మాసంలో హేమాఢ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయడానికుపక్రమించారు. 70 సంవత్సరాల వయసులో జూలై 15, 1929 న హేమాఢ్ పంత్ సాయి లీనులయ్యారు. 1929 జ్యేష్ట మాసానికి శ్రీ సాయి సచ్చరిత్ర్ వ్రాయడమ్ ముగిసినా, ధాబోల్కర్ ప్రస్తావించిన విషయసూచిక (అవతరణిక) మాత్రమ్ దొరకలేదు. శ్రీ బాల కృష్ణ దేవ్ అవతరణిక వ్రాసి, 53 వ అధ్యాయాన్ని జత పరిచారు.
శ్రీ సాయి సచ్చరిత రామచంద్ర ఆత్మారాం తార్కడ్ చే 26 నవంబరు 1930 వ తేదీన మొదటిగా విడుదల చేయబడింది, సచ్చరిత్ర పై హక్కులన్నీ సంస్థాన్ వద్దనే వున్నాయి,
ఇక్కడే ప్రొఫెసర్ ఆచార్య హేమాఢ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర్ ను వ్రాయడం 1922 లో ప్రారంభించినప్పటినుండి, విడుదలైన 1930 వరకూ ఎనిమిది సంవత్సరాలు, ఎనిమిది సంవత్సరాల బాలుడిగా వస్తానన్న బాబా చెప్పిన మాట నిజమయ్యాయనడానికి తార్కాణంగా తీసికోవచ్చునని విశ్లేషించారు. అంటే శ్రీ సాయి సచ్చరిత గా సాయే మళ్లీ అవతరించారు అంటారు శ్రీ ఆచార్య. అంటే శ్రీ సాయే శ్రీ సాయి సచ్చరిత, శ్రీ సాయి సచ్చరితే శ్రీ సాయి అన్న మాట.
నిజానికి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి మరియు ఇతర యోగుల జీవిత చరిత్రలలో వారి పుట్టు పూర్వోత్తరాలూ, విధ్యాబ్యాసవివరాలు, కుటుంబ నేపధ్యమూ, జ్ఞాన సముపార్జన, సన్యాస స్వీకరణ, మహాసమాధి మొదలుగాగల వివరాలుంటాయి. కానీ శ్రీ సాయి చరిత్రలో బాబా మహాసమాధిగురించి తప్ప మిగిలిన దంతా సాయి మహిమల సంకలనమే, ఆయన బోధనలు, ఆయన చర్యలూ సచ్చరిత్రలో చోటుచేసికున్నాయి. సచ్చరిత అంటే సత్ అంటే సత్యమైన చరిత్ అంటే చరిత్ర అనగా సత్యమైన చరిత్ర, ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత్ర లో వచ్చిన పాత్రల వారసులు సచ్చరితలోని సంఘటనలకి సాక్షులా అన్నట్లుగా ఇప్పటికీ జీవించే వున్నారు.
అన్నాసాహెబ్ దాబోల్కర్ సాయి సచ్చరిత ముగించకుండానే సాయిలీనులైనారు. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంధావిష్కరణ ను వారు చూడలేదు. సచ్చరితకి ముగింపులేదని బాబా ఈ విధంగా చెప్పారనిపిస్తుంది. బాబా మహాసమాధి చెందిన 96 సంవత్సారల తర్వాత కూడా బాబా వునికి ని భక్తులు అనుభవించగలుగుతున్నారంటే సచ్చరిత కి ముగింపు లేదనడానికి అంతకన్నా పెద్ద సాక్ష్యం ఏమి కావాలి.
ఈ రోజు శ్రీ సాయి సచ్చరిత్ర్ విడుదలైన రోజు, 84 సంవత్సరాల క్రితం ఈ రోజు శ్రీ సాయిసచ్చరిత్ర మొట్టమొదటి సారి విడుదలైంది. సాయి సచ్చరిత్ర ని సాయి లానే ఆరాధిద్దాం, పారాయణ చేద్దాం!

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Sunday, November 16, 2014

తనను నమ్మిన భక్తులను బాబా జన్మజన్మాంతరాలలోను కాపాడుతునే వుంటాడు. వారికిచ్చిన మాటను ఆయన యధా నిలుపుకుంటాడు. అలాంటి ఉదంతం మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది.
ఒకరోజు బాబా ఒక నదీ తీరంలో నడుస్తు ఉన్నారు. కొంత దూరం ప్రయానించిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. చిలుము వెలిగించుకోవడానికి ప్రయత్నించుచుండగా ఒక కప్ప బెకబెకలాడుతున్న శబ్దం వినిపించింది. అంతలో ఒక భక్తుడు బాబా దగ్గరకు వచ్చి చిలుము వెలిగించే ఆయనకు అందించెను. భోజనానికి రావల్సిందిగా బాబాను ఆహ్వానించెను. మరలా కప్ప బెకబెకలాడెను. ఆ భక్తుడు అదేమి గమనించలేదు. కానీ, ఆ కప్ప శబ్దం విన్న బాబా ఆ కప్ప పూర్వ జన్మ పాపం అనుభవిస్తోందని చెప్పెను. పూర్వ జన్మ ఫలం అనుభవించవలసినదే. తప్పదు అని బాబా పలికెను. అప్పుడు ఆ వ్యక్తి కప్ప ఉన్న చోటుకి వెళ్లి చూసెను. ఆ కప్పను పాము నోట్లో కరుచుకొని వుంది. అది చూసి వచ్చి అతను బాబాతో - పది నిముషాల్లో పాము ఆ కప్పను మింగేస్తుంది అని చెప్పేను. దానికి బాబా - అలా జరుగదు. నేను తండ్రిని. అలా ఎప్పటికీ జరుగనివ్వను. ఆ పాము కప్పను తినలేదు. తప్పకుండా విడిపిస్తాను చూడు అన్నారు.
కాసేపు చిలుము పీల్చిన తర్వాత బాబా కప్ప వున్న చోటుకి వెళ్లెను. బాబాను పాము దగ్గరగా వెళ్లవద్దని ఆ వ్యక్తి హెచ్చరించాడు. బాబా అతని మాట పట్టించుకోకుండా, ముందుకు వెళ్లి, - వీరభద్రప్పా, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మెత్తి తన తప్పు తెలుసుకున్నాడు. నీవు పాముగా పుట్టి నీ తప్పు తెలుసుకోలేదా... అతనిపై ఇంకా శత్రుత్వమా... నీకు సిగ్గుగా లేదా... ఇప్పటికైనా ఈ పగ విడిచిపెట్టు అని పలికెను. బాబా మాటలు విన్న పాము, కప్పను విడిచి నీటిలోకి వెళ్లిపోయింది. కప్ప కూడా తన దారిన పొదలలోకి వెళ్లిపోయింది. ఇదంతా చూస్తున్న ఆ వ్యక్తికి ఒక్క నిముషం ఏమీ అర్థం కాలేదు. ఈ వీరభద్రప్ప, చెన్నబసప్ప ఎవరు... వీరి మధ్య శత్రుత్వం ఏమిటి అని బాబాను ప్రశ్నించాడు. అప్పుడు బాబా ఈ వృత్తాంతం చెప్పుట ఆరంభించెను.
మా ఊరిలో ఒక పురాతన శివాలయం ఉంది. అది శిథిలావస్తకు చేరుకుంది. గ్రామస్తులు తమ ధనం కూడబెట్టి ఆ ఆలయానికి మరమ్మత్తులు చెయించాలని నిశ్చయించుకున్నారు. డబ్బు కూడేసి ఒక ధనవంతునికి ఒప్పజెప్పి మరమ్మత్తులు చేయించనమి చెప్పిరి. ఆ ధనవంతుడు పరమలోభి. దేవాలయం కోసం ఇచ్చిన డబ్బు మింగి, పనులేమి చేయలేదు. గ్రామస్తులకు తన మాటల చాతుర్యంతో మాయ చేసెను. వారిచ్చిన డబ్బు చాలలేదని మరింత ధనం పోగేసి రమ్మని పంపించెను. వారు మరలా డబ్బు జమ చేసి ఆ ధనవంతుడికిచ్చెను. అప్పుడు కూడా అతను గుడి బాగోగులు ఏమి పట్టించుకోలేదు. కొంతకాలం తర్వాత అతని భార్యకు కలలో శివుడు కనిపించి - గుడి శిఖరం కట్టించు నీవు చేసిన ఖర్చుకు వంద రెట్లు నీకు సంపద ప్రాప్తించును అని చెప్పెను. తనకొచ్చిన కల గురించి ఆమె తన భర్తకు చెప్పెను. అది దుస్వప్నమని, అది ఒకవేళ నిజమే అయితే శివుడు తన కలలోకి ఎందుకు రాలేదని, భార్యభర్తలను విడగొట్టేందుకు ఇలా ఎవరో ప్రయత్నిస్తున్నారని చెప్పి భార్య నోరు మూయించాడు ఆ ధనవంతుడు.
అలా మరలా కొన్ని రోజులు గడిచాయి. అతని భార్యకు మరో కల వచ్చింది. ఈ సారి భగవంతుడు, ఆమెను నీ భర్త దాచుకున్న చందాలు అక్కర్లేదని, బలవంతముగా చేయు ఏది కూడా తనకు అక్కర్లేదు అని, భక్తి పూర్వకముగా తానేదైనా చేయదలుచుకుంటే చేయమని సెలవిచ్చెను. ఆమె అప్పుడు తన తండ్రి ఇచ్చిన నగలు అమ్మి, పొలం కొని ఆ దేవాలయానికి దానం చేయాలనుకుంది. ఆమె చేయాలనుకున్న సంగతి భర్తకు చెప్పింది. ఈ విషయం అతనికి చికాకు కలిగించింది. అయినా ఏమి అనలేక వేరే విధంగా మోసం చేయుటకు నిశ్చయించుకొనెను. భార్య సొమ్ములు తక్కువ ధరకు తానే కొన్నాడు. అతని దగ్గర కుదవ పెట్టి ఉంచిన పొలాల్లో ఒకటి భార్యకు అమ్మెశాడు. ఆ పొలం కుదువ పెట్టింది డుబ్కీ అనే పేదరాలు. ఇలా దేవుడిని, భార్యను, డుబ్కీని ఆ ధనవంతుడు మోసం చేశాడు. సాగులో లేని పొలానికి ఎంతో ఎక్కువ విలువ చెప్పి భార్యతో కొనిపించాడు. విలువైన తన నగలకు వెయ్యి రూపాయలె ధర కట్టాడు. 200 రూపాయల విలువ చేసే పొలాన్ని వెయ్యి రూపాయలు పెట్టి కొనిపించాడు. సాగుకు వీలుగా లేని ఆ పొలం గుడి పూజారి ఆధీనంలో ఉండేది.
తర్వాత విచిత్రంగా ఆ లోభి, అతని భార్య చనిపోయారు. పెద్ద తుఫానులో, వారింటిపై పిడుగు పడి భార్యాభర్తలిద్దరూ చనిపోయారు. డుబ్కీ కూడా మరణించింది. తర్వాత జన్మలో ఆ లోభి బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్పగా పుట్టాడు. ఆమె ఆ పూజారి కూతురు గౌరిగా, డుబ్కీ చెన్నబసప్పగా గుడి అధికారిగా పుట్టెను. పూజారి కూతురికి, వీరభద్రప్పకు వివాహం బాబా వలనే జరిగింది. కానీ వీరభద్రప్పకు ఈ జన్మలో కూడా ధనదాహం తగ్గలేదు. హఠాత్తుగా ధరలు పెరిగి పూజారి పొలానికి వంద రెట్లు ధర పలికింది. లక్ష రూపాయలలో సగం నగదుగా వచ్చింది మిగతా 25 వాయిదాలలో యిచ్చేందుకు ఒప్పందం జరిగింది. కానీ ఆ ధనం కోసం తగువులాడుతూ వారు సలహాకోసం నా దగ్గరకు (బాబా) వచ్చారు. అప్పుడు నేను సర్వ హక్కులు గౌరీవే నని చెప్పాను. ఇది విన్న వీరభద్రప్పకు కోపం వచ్చింది. నేను ఆస్తి కోసం ఆరాటపడుతూ అలా చెప్పానని అతను దూషించాడు. గౌరి మాత్రం తనను కూతురుగా భావించమని ప్రార్థించింది. ఆమెను రక్షిస్తానని మాట యిచ్చాను.
మరలా గౌరికి కలలో మహాదేవుడు కనిపించి, ధనం ఎవరికీ ఇవ్వకు. అది అంతా నీదే. చెన్నబసప్పతో సంప్రదించి గుడి మరమ్మత్తులకు కొంత వినియోగించమని చెప్పెను. ఇతరత్రా సలహా కావలసిన మసీదులో బాబాని వేడుకొమ్మనెను. ఈ కల గురించి గౌరీ చెప్పుతుండగానే చెన్నబసప్ప, వీరభద్రప్ప పోట్లాడుతూ నా దగ్గరికి వచ్చారు. వీరభద్రప్ప బెదిరింపులకు భయపడిన చెన్నబసప్ప నా శరణు కోరాడు. వానిని కాపాడుతానని మాట ఇచ్చాను. ఆ తర్వాత వారు కొంతకాలానికి చనిపోయి ఇలా పాము కప్పలుగా జన్మించారు. అప్పుడు నేను చేసిన వాగ్దానం ఇప్పుడు కప్ప బెకబెక వినగానే జ్ఞప్తికి వచ్చింది. చెన్నబసప్పను రక్షించాను. ఇదంతా ఆయన లీల అని వివరించారు బాబా...

Wednesday, November 5, 2014

SAI SANNIDHI - Baba Monthly Magazine -Nov----2014





Online లో చదవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి | Click Below Link to View / Read Online.



 క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి | Download From The Below Link   



Sunday, November 2, 2014

తనను నమ్మిన భక్తులను బాబా జన్మజన్మాంతరాలలోను కాపాడుతునే వుంటాడు.

తనను నమ్మిన భక్తులను బాబా జన్మజన్మాంతరాలలోను కాపాడుతునే వుంటాడు. వారికిచ్చిన మాటను ఆయన యధా నిలుపుకుంటాడు. అలాంటి ఉదంతం మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది.
ఒకరోజు బాబా ఒక నదీ తీరంలో నడుస్తు ఉన్నారు. కొంత దూరం ప్రయానించిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. చిలుము వెలిగించుకోవడానికి ప్రయత్నించుచుండగా ఒక కప్ప బెకబెకలాడుతున్న శబ్దం వినిపించింది. అంతలో ఒక భక్తుడు బాబా దగ్గరకు వచ్చి చిలుము వెలిగించే ఆయనకు అందించెను. భోజనానికి రావల్సిందిగా బాబాను ఆహ్వానించెను. మరలా కప్ప బెకబెకలాడెను. ఆ భక్తుడు అదేమి గమనించలేదు. కానీ, ఆ కప్ప శబ్దం విన్న బాబా ఆ కప్ప పూర్వ జన్మ పాపం అనుభవిస్తోందని చెప్పెను. పూర్వ జన్మ ఫలం అనుభవించవలసినదే. తప్పదు అని బాబా పలికెను. అప్పుడు ఆ వ్యక్తి కప్ప ఉన్న చోటుకి వెళ్లి చూసెను. ఆ కప్పను పాము నోట్లో కరుచుకొని వుంది. అది చూసి వచ్చి అతను బాబాతో - పది నిముషాల్లో పాము ఆ కప్పను మింగేస్తుంది అని చెప్పేను. దానికి బాబా - అలా జరుగదు. నేను తండ్రిని. అలా ఎప్పటికీ జరుగనివ్వను. ఆ పాము కప్పను తినలేదు. తప్పకుండా విడిపిస్తాను చూడు అన్నారు.
కాసేపు చిలుము పీల్చిన తర్వాత బాబా కప్ప వున్న చోటుకి వెళ్లెను. బాబాను పాము దగ్గరగా వెళ్లవద్దని ఆ వ్యక్తి హెచ్చరించాడు. బాబా అతని మాట పట్టించుకోకుండా, ముందుకు వెళ్లి, - వీరభద్రప్పా, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మెత్తి తన తప్పు తెలుసుకున్నాడు. నీవు పాముగా పుట్టి నీ తప్పు తెలుసుకోలేదా... అతనిపై ఇంకా శత్రుత్వమా... నీకు సిగ్గుగా లేదా... ఇప్పటికైనా ఈ పగ విడిచిపెట్టు అని పలికెను. బాబా మాటలు విన్న పాము, కప్పను విడిచి నీటిలోకి వెళ్లిపోయింది. కప్ప కూడా తన దారిన పొదలలోకి వెళ్లిపోయింది. ఇదంతా చూస్తున్న ఆ వ్యక్తికి ఒక్క నిముషం ఏమీ అర్థం కాలేదు. ఈ వీరభద్రప్ప, చెన్నబసప్ప ఎవరు... వీరి మధ్య శత్రుత్వం ఏమిటి అని బాబాను ప్రశ్నించాడు. అప్పుడు బాబా ఈ వృత్తాంతం చెప్పుట ఆరంభించెను.
మా ఊరిలో ఒక పురాతన శివాలయం ఉంది. అది శిథిలావస్తకు చేరుకుంది. గ్రామస్తులు తమ ధనం కూడబెట్టి ఆ ఆలయానికి మరమ్మత్తులు చెయించాలని నిశ్చయించుకున్నారు. డబ్బు కూడేసి ఒక ధనవంతునికి ఒప్పజెప్పి మరమ్మత్తులు చేయించనమి చెప్పిరి. ఆ ధనవంతుడు పరమలోభి. దేవాలయం కోసం ఇచ్చిన డబ్బు మింగి, పనులేమి చేయలేదు. గ్రామస్తులకు తన మాటల చాతుర్యంతో మాయ చేసెను. వారిచ్చిన డబ్బు చాలలేదని మరింత ధనం పోగేసి రమ్మని పంపించెను. వారు మరలా డబ్బు జమ చేసి ఆ ధనవంతుడికిచ్చెను. అప్పుడు కూడా అతను గుడి బాగోగులు ఏమి పట్టించుకోలేదు. కొంతకాలం తర్వాత అతని భార్యకు కలలో శివుడు కనిపించి - గుడి శిఖరం కట్టించు నీవు చేసిన ఖర్చుకు వంద రెట్లు నీకు సంపద ప్రాప్తించును అని చెప్పెను. తనకొచ్చిన కల గురించి ఆమె తన భర్తకు చెప్పెను. అది దుస్వప్నమని, అది ఒకవేళ నిజమే అయితే శివుడు తన కలలోకి ఎందుకు రాలేదని, భార్యభర్తలను విడగొట్టేందుకు ఇలా ఎవరో ప్రయత్నిస్తున్నారని చెప్పి భార్య నోరు మూయించాడు ఆ ధనవంతుడు.
అలా మరలా కొన్ని రోజులు గడిచాయి. అతని భార్యకు మరో కల వచ్చింది. ఈ సారి భగవంతుడు, ఆమెను నీ భర్త దాచుకున్న చందాలు అక్కర్లేదని, బలవంతముగా చేయు ఏది కూడా తనకు అక్కర్లేదు అని, భక్తి పూర్వకముగా తానేదైనా చేయదలుచుకుంటే చేయమని సెలవిచ్చెను. ఆమె అప్పుడు తన తండ్రి ఇచ్చిన నగలు అమ్మి, పొలం కొని ఆ దేవాలయానికి దానం చేయాలనుకుంది. ఆమె చేయాలనుకున్న సంగతి భర్తకు చెప్పింది. ఈ విషయం అతనికి చికాకు కలిగించింది. అయినా ఏమి అనలేక వేరే విధంగా మోసం చేయుటకు నిశ్చయించుకొనెను. భార్య సొమ్ములు తక్కువ ధరకు తానే కొన్నాడు. అతని దగ్గర కుదవ పెట్టి ఉంచిన పొలాల్లో ఒకటి భార్యకు అమ్మెశాడు. ఆ పొలం కుదువ పెట్టింది డుబ్కీ అనే పేదరాలు. ఇలా దేవుడిని, భార్యను, డుబ్కీని ఆ ధనవంతుడు మోసం చేశాడు. సాగులో లేని పొలానికి ఎంతో ఎక్కువ విలువ చెప్పి భార్యతో కొనిపించాడు. విలువైన తన నగలకు వెయ్యి రూపాయలె ధర కట్టాడు. 200 రూపాయల విలువ చేసే పొలాన్ని వెయ్యి రూపాయలు పెట్టి కొనిపించాడు. సాగుకు వీలుగా లేని ఆ పొలం గుడి పూజారి ఆధీనంలో ఉండేది.
తర్వాత విచిత్రంగా ఆ లోభి, అతని భార్య చనిపోయారు. పెద్ద తుఫానులో, వారింటిపై పిడుగు పడి భార్యాభర్తలిద్దరూ చనిపోయారు. డుబ్కీ కూడా మరణించింది. తర్వాత జన్మలో ఆ లోభి బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్పగా పుట్టాడు. ఆమె ఆ పూజారి కూతురు గౌరిగా, డుబ్కీ చెన్నబసప్పగా గుడి అధికారిగా పుట్టెను. పూజారి కూతురికి, వీరభద్రప్పకు వివాహం బాబా వలనే జరిగింది. కానీ వీరభద్రప్పకు ఈ జన్మలో కూడా ధనదాహం తగ్గలేదు. హఠాత్తుగా ధరలు పెరిగి పూజారి పొలానికి వంద రెట్లు ధర పలికింది. లక్ష రూపాయలలో సగం నగదుగా వచ్చింది మిగతా 25 వాయిదాలలో యిచ్చేందుకు ఒప్పందం జరిగింది. కానీ ఆ ధనం కోసం తగువులాడుతూ వారు సలహాకోసం నా దగ్గరకు (బాబా) వచ్చారు. అప్పుడు నేను సర్వ హక్కులు గౌరీవే నని చెప్పాను. ఇది విన్న వీరభద్రప్పకు కోపం వచ్చింది. నేను ఆస్తి కోసం ఆరాటపడుతూ అలా చెప్పానని అతను దూషించాడు. గౌరి మాత్రం తనను కూతురుగా భావించమని ప్రార్థించింది. ఆమెను రక్షిస్తానని మాట యిచ్చాను.
మరలా గౌరికి కలలో మహాదేవుడు కనిపించి, ధనం ఎవరికీ ఇవ్వకు. అది అంతా నీదే. చెన్నబసప్పతో సంప్రదించి గుడి మరమ్మత్తులకు కొంత వినియోగించమని చెప్పెను. ఇతరత్రా సలహా కావలసిన మసీదులో బాబాని వేడుకొమ్మనెను. ఈ కల గురించి గౌరీ చెప్పుతుండగానే చెన్నబసప్ప, వీరభద్రప్ప పోట్లాడుతూ నా దగ్గరికి వచ్చారు. వీరభద్రప్ప బెదిరింపులకు భయపడిన చెన్నబసప్ప నా శరణు కోరాడు. వానిని కాపాడుతానని మాట ఇచ్చాను. ఆ తర్వాత వారు కొంతకాలానికి చనిపోయి ఇలా పాము కప్పలుగా జన్మించారు. అప్పుడు నేను చేసిన వాగ్దానం ఇప్పుడు కప్ప బెకబెక వినగానే జ్ఞప్తికి వచ్చింది. చెన్నబసప్పను రక్షించాను. ఇదంతా ఆయన లీల అని వివరించారు బాబా...

" "గురుస్థాన్"

*ఆ వేపచెట్టు కింద నిరంతరం ధ్యానం చేస్తూండేవాడు బాబా.ఎవ్వరైనా పలకరించిన మౌనంగా వుండేవాడు.ఎండ మండిన,చలి వణికెత్తినా భయం లేకుండా రాత్రింబగళ్లు వేపచెట్టు క్రిందే నివశించేవాడు బాబా.గ్ర్రామస్తులు జాలిపడి అన్నమో,రొట్టెలొ తెచ్చిఇస్తే తినేవాడు గాదు.వాటి క్రిమి కీటకాలు ముసురుతున్నా,కుక్కలు,పిల్లులు ఎగబడి తింటున్నా పట్టించుకొనేవాడు కాదు.ఆకలినిపిస్తే అవి తిని మిగిలిన దానిని రెండు ముద్దలు తినేవాడు.అప్పడు డప్పడు సమీపంలొ అడవిలొకి పొతుండేవారు.
*షిరిడిలొని ఆలయల్లొ ముఖ్యమైనది ఖండొభా ఆలయం.వీరభద్రుడు గ్రామదేవత అక్కడ వెలిశాడు.ఒకరొజు ఖండొభ జాతర జరుగొతుంది.వూరంతా భక్తితొ నినాదాలు చేస్తూ వూగిపొతొంది. ఉన్నట్లుండి ఒక వ్యక్తికి పూనకం వచ్చింది.ఆ వ్యక్తికి ఖండొభ ఆవహించింది.ఈ వేపచెట్టు కిందనున్న బాబా ఎవరు అని పూజరీ మహల్సవతి ని తీసుకొని వేపచెట్టు దగ్గరకి వచ్చాడు. ఆ సమయంలొ బాబా లేడు.వేపచెట్టు కింద తవ్వమని చెప్పాడు.అక్కడ గొతిలొ ఒక పెద్ద బండరాయి కనిపించింది.ఆ రాతిని తొలగించగా దాని కింద ద్రుశ్యం చూసి అందరూ ఆశ్శర్య పొయారు.బండరాతి కింద పెద్ద సొరంగం .అందులొకి పొవడానికి మెట్లు ఉన్నాయి.అక్కడ ప్రమిదలు వెలుగుతున్నాయి.జపమాలలు,ఆసనాలు,తిని వదిలేసిన ఆహర పదార్థములు ఉన్నాయి.మూసివున్న గ్రుహంలొ దీపారాదనలు,తపస్సు ద్రశ్యాలు ఎలా సాధ్యం.అని అంటుండగా...అపుడు పూనకంతొ వున్న వ్యక్తి,ఇక్కడ బాబా12 యేళ్లు తపస్సు చేశాడు అని చెప్పగా గ్రామస్తులు విస్తుపొయారు.
*అంతలొనే సుడిగాలిలా అక్కడికి వచ్చాడు.నాకు తెలియకుండా ఎందుకు చేశారు ఈపని అని కేకలు వేస్తూ..ఇది మా గురుస్థానం...పవిత్ర ప్రదేశం...మూసేయ్యండి అని చెప్పి యథాప్రకారంగా మూయించాడు బాబా.అనంతరం గ్రామస్తులు అడిగిన ప్రశ్నలన్నింటికి "అల్లా మాలిక్"అని ఒకే సమాదానం చెప్పి మౌనంగా ఉండిపొయాడు బాబా.
"ఆ వేపచెట్టు క్రింది ప్రదేశమే నేడు గురుస్థాన్ గా ప్రసిద్దిగాంచుచున్నది"